Published : May 01, 2025, 09:03 AM ISTUpdated : May 02, 2025, 12:01 AM IST

Telugu news live updates: Manakondur: ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. మానకొండూర్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం

సారాంశం

భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఎల్‌వోసీ దగ్గర వరుసగా ఏడోరోజు కాల్పుల జరిపిన పాక్‌. ఇక పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌ జాతీయ భద్రతా సలహాదారుగా.. ఐఎస్ఐ చీఫ్‌ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్‌ ఆసిమ్ మాలిక్ ను నియమించింది. ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.. 
 

Telugu news live updates: Manakondur: ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. మానకొండూర్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం

12:01 AM (IST) May 02

Manakondur: ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. మానకొండూర్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం

Manakondur MLA Kavvampally Satyanarayana: మానకొండూర్  ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ ఒక వైద్యుడు. ఆయన వారానికి మూడుసార్లు నియోజకవర్గంలోని గ్రామాలు సందర్శించి ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వింటారు. వాటి ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్పుడు 'ఎమ్మెల్యే ఆన్ వీల్స్' ను ప్రారంభించారు. 
 

పూర్తి కథనం చదవండి

11:10 PM (IST) May 01

RR vs MI: రాజస్థాన్ ను చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్

IPL 2025 RR vs MI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, హర్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్ కు తోడుగా బుమ్రా, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ తో ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుగా ఓడించింది ముంబై ఇండియన్స్. దీంతో ముంబై టీమ్ ప్లేఆఫ్స్  కు మరింత దగ్గరైంది. 
 

పూర్తి కథనం చదవండి

10:21 PM (IST) May 01

PM Modi: తిరువనంతపురంలో ప్రధాని మోడీ

PM Modi in Thiruvananthapuram: విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరువనంతపురం చేరుకున్నారు. 

పూర్తి కథనం చదవండి

09:53 PM (IST) May 01

Shikhar Dhawan: మై లవ్ అంటూ కొత్త ప్రేయసిని పరిచయం చేసిన శిఖర్ ధావన్

Shikhar Dhawan confirmed relationship with Sophie Shine: ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో తనకున్న సంబంధంపై శిఖర్ ధావన్ క్లారిటీ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మై లవ్ అంటూ ఎమోజీతో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు. 

పూర్తి కథనం చదవండి

08:52 PM (IST) May 01

Pahalgam Attack : వెతికి వెతికి ప్రతీకారం తీర్చుకుంటాం... ఎవ్వరినీ వదిలిపెట్టం : అమిత్ షా సీరియస్

పహల్గాం ఉగ్రదాడిపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఎవరినీ వదలమని, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

పూర్తి కథనం చదవండి

08:48 PM (IST) May 01

Amaravati: రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల ఖర్చు.. ఆ డబ్బంతా ఎక్కడిదో తెలుసా? 

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లతో త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, ఇతర కీలక నాయకులు చెబుతున్నారు. ఆయా పనులను ప్రధాని మోదీ మే 2న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అసలు అమరావతి కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు ఎక్కడివి? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? లేక రాష్ట్ర ప్రభుత్వానివా? పెద్దఎత్తున అప్పులు తీసుకురావడం వల్ల ప్రజలపై అప్పుల భారం పడనుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. వెంటనే ఈ ఫుల్‌ స్టోరీ చదివేయండి.. 

పూర్తి కథనం చదవండి

08:38 PM (IST) May 01

Nandyala: నంద్యాలలో పాకిస్తాన్‌ మద్దతుదారుల హల్‌చల్‌

Nandyala: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో కొంతమంది యువకులు పాకిస్తాన్ జెండాను జాగ్ర‌త్త‌గా తీసిపెట్ట‌డం తీవ్ర దుమారం రేపుతోంది. పహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి క్ర‌మంలో ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు పెరిగాయి. ఇలాంటి స‌మ‌యంలో పాకిస్తాన్ కు అనుకూలంగా ప‌లువురు యువ‌కులు న‌డుచుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 
 

పూర్తి కథనం చదవండి

07:47 PM (IST) May 01

Zodiac sign: ఈ రాశి వారితో ప్రేమ న‌ర‌కంతోస‌మానం.. తొంద‌ర‌పాటు ఎక్కువ

మ‌నిషి వ్య‌క్తిత్వం అత‌ని రాశిపై ఆధార‌ప‌డి ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది. మ‌నం పుట్టిన స‌మ‌యం, తేదీ ఆధారంగా మ‌న ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు, మ‌నం తీసుకునే నిర్ణ‌యాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతుంటారు. మ‌రి మిథున రాశి వారి వ్య‌క్తిత్వం ఎలా ఉంటుంది.? వారి ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయి.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

05:56 PM (IST) May 01

అదిరిపోయే ఫీచర్స్‌తో మోటరోలా ఎడ్జ్ 60 ప్రో వచ్చేసింది: ధర, ఫీచర్స్ ఇవిగో

Motorola Edge 60 Pro: మార్కెట్ లో క్లిక్ అయిన ఎడ్జ్ ఫోన్లలో మోటరోలా కంపెనీకి చెందిన మోడల్స్ టాప్ లో ఉంటున్నాయి. అందుకే మోటరోలా ఇప్పుడు మరో ఎడ్జ్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. మోటరోలా ఎడ్జ్ 60 ప్రో పేరుతో రిలీజ్ అయిన ఈ ఫోన్ ఫీచర్లు, ధర తెలుసుకుందాం రండి. 

 

పూర్తి కథనం చదవండి

05:45 PM (IST) May 01

RBI: రూ. 500 నోట్లు ర‌ద్దు చేయ‌నున్నారా..?

రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. డిజిట‌ల్ చెల్లింపులు పెంచ‌డం, దొంగ నోట్లను కంట్రోల్ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ప‌ట్లో ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌ర్వాత కొత్త‌గా రూ. 2 వేల నోట్లు, రూ. 500 నోట్లు తీసుకొచ్చింది. అయితే ఆ త‌ర్వాత రూ. 2 వేల నోట్ల‌ను కూడా వెన‌క్కి తీసుకున్నారు. 
 

పూర్తి కథనం చదవండి

05:33 PM (IST) May 01

Elon Musk: ఎలాన్ మస్క్ టెస్లాకు దూరం కానున్నారా?

వైట్‌హౌస్ బాధ్యతలతో టెస్లాకు సమయం కేటాయించలేకపోతున్న ఎలాన్ మస్క్‌ను సీఈఓ పదవి నుంచి తప్పించేందుకు టెస్లా బోర్డు యోచిస్తోందా? కంపెనీ లాభాలు, అమ్మకాలు తగ్గడంతో కొత్త సీఈఓ కోసం అన్వేషణ మొదలైందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

పూర్తి కథనం చదవండి

05:29 PM (IST) May 01

2 నిమిషాల్లో ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి! సీక్రెట్ ట్రిక్స్ ఇవిగో

Confirmed Train Ticket: అర్జెంట్ గా ఊరెళ్లాలి.. రైలులో బెర్త్‌లు ఫుల్ అయిపోయాయి.. వెయిటింగ్ లిస్టేమో పెద్దగా ఉంది. ఇలాంటి సమయంలో చాలా మంది ఖరీదైన ఫ్లైట్ లేదా ఇతర ఆప్షన్స్ కోసం చూస్తారు. కానీ మీరు ఈ ట్రిక్స్ పాటించారంటే కన్ఫర్మ్ టికెట్ దొరకడం ఖాయం. అవేంటో తెలుసుకుందాం రండి. 

 

పూర్తి కథనం చదవండి

05:09 PM (IST) May 01

పహల్గాం దాడి పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం.. సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దంటూ

పహల్గాం దాడిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీసే ఇలాంటి పిటిషన్లు వద్దని కోర్టు హెచ్చరించింది.

 

 

పూర్తి కథనం చదవండి

05:06 PM (IST) May 01

అస్త్ర... దీన్ని మించిన క్షిపణే లేదు.. ఇదీ మేడిన్ ఇండియా అంటే

అస్త్రకు ఆకాశమే హద్దు... రాఫెల్ మెరైన్‌లో సమ్మిళితమవుతున్న స్వదేశీ మిస్సైల్, భవిష్యత్ వైమానిక యుద్ధంలో కీలకం కానుంది. 

పూర్తి కథనం చదవండి

04:55 PM (IST) May 01

కి.మీ.కి 10 పైసలు ఖర్చు చేస్తే చాలు! తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ స్కూటర్లు ఇవిగో

Electric Scooters: మీరు తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.70,000 వరకు ఉంటే మీకు చాలా ఉపయోగకరమైన సమాచారం ఇక్కడ ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం.  

పూర్తి కథనం చదవండి

04:49 PM (IST) May 01

భార‌త్‌-పాక్ యుద్ధం గురించి బాబా వంగా ముందే చెప్పారా.?

 పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో బాబా వంగా జోస్యం చర్చనీయాంశమైంది. రెండు దేశాలకు సంబంధించి బాబా వంగా ఎలాంటి విషయాలు తెలిపారు ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

పూర్తి కథనం చదవండి

04:35 PM (IST) May 01

పాకిస్థాన్ అణు బాంబులు ఎక్కడ దాచి పెట్టారో తెలుసా?

పాకిస్థాన్ అణు ఆయుధాల నిల్వలు ఎక్కడున్నాయన్న విషయం‌పై 2023లో వెల్లడైన ఓ  నివేదిక కీలకంగా మారింది. ఈ అంశానిక సంబంధించి మస్రూర్ ఎయిర్ బేస్ ప్రాధాన్యత పొందింది.
 

పూర్తి కథనం చదవండి

04:33 PM (IST) May 01

Revanth Reddy: కేసీఆర్ క‌ప‌ట సూత్ర‌ధారి.. ఓ రేంజ్‌లో ఫైర్ అయిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. ఇటీవ‌ల బీఆర్ఎస్ నిర్వ‌హించిన ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల‌పై ఘాటూగా స్పందించారు. గురువారం ర‌వీంద్ర భార‌తిలో నిర్వ‌హించిన మేడే వేడుక‌ల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ప‌లు కీలక అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఆయ‌న ఏం మాట్లాడారంటే.. 
 

పూర్తి కథనం చదవండి

04:26 PM (IST) May 01

Kishan Reddy: కాంగ్రెస్ పార్టీని కుక్కతో పోల్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy compares Congress party to a dog: కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని కుక్క‌తో పోల్చారు.  కిష‌న్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

పూర్తి కథనం చదవండి

04:17 PM (IST) May 01

మట్టి కుండలో నీళ్ళు చల్లగా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి

Clay pot: వేసవి కాలంలో ఫ్రిడ్జ్ కంటే మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఫ్రిడ్జ్ లో ఉండే చల్లని నీరులా మట్టి కుండలో నీరు ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.  

 

పూర్తి కథనం చదవండి

03:54 PM (IST) May 01

WAVES 2025: గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా భారత్‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

WAVES 2025: వరల్డ్‌ ఆడియో విజువల్‌ & ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (WAVES 2025) లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాట్లాడుతూ.. క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ వరల్డ్ ఈ అభిప్రాయానికి ప్రస్తుత యుగం పూర్తిగా సిద్ధమైందని  ప్రపంచం కథలు చెప్పే కొత్త మార్గాలను అన్వేషిస్తున్న వేళ, భారతదేశం వద్ద చెప్పలేని అనేక కథలున్నాయన్నారు. 
 

పూర్తి కథనం చదవండి

03:13 PM (IST) May 01

Operation kagar: ఆప‌రేష‌న్ క‌గార్ ల‌క్ష్యం ఏంటి.? ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేశారు.? అస‌లే జ‌రుగుతోంది..

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తరిమివేసే 'ఆపరేషన్ కగార్' కొనసాగిస్తాం. నక్సలిజాన్ని తుదముట్టించే వరకు భద్రతా బలగాల దాడులు జరుగుతూనే ఉంటాయి. 2026 మార్చి 31 వరకు నక్సల్స్ రహిత దేశంగా భారత్ ను తీర్చి దిద్దుతాం. ఇవీ ఆపరేషన్ కగార్ గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

02:12 PM (IST) May 01

Amaravati: 50 అంత‌స్తుల్లో అసెంబ్లీ, 42 ఫ్లోర్స్‌లో HOD ట‌వ‌ర్స్‌.. అమ‌రావ‌తిలో అద్భుత నిర్మాణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానిని అందించాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతోంది కూట‌మి ప్ర‌భుత్వం. ఇందులో భాగంగానే అమ‌రావ‌తి పునఃనిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. మే2వ తేదీన రాజ‌ధాని పునఃనిర్మాణ ప‌నుల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలోనే అమ‌రావ‌తిలో నిర్మించ‌నున్న ప‌లు ఐకానిక్ భ‌వ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

02:00 PM (IST) May 01

ఇండియా, పాకిస్థాన్ వివాదంలో రంగంలోకి అమెరికా

పహల్గాం ఉగ్రదాడి తర్వాత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడారు. దోషులను శిక్షించి తీరుతామని జైశంకర్ స్పష్టం చేశారు.

పూర్తి కథనం చదవండి

01:50 PM (IST) May 01

మే 1 నుండి అమలయ్యే 6 ముఖ్యమైన మార్పులివే: మన జేబుకు చిల్లే

మే 1 నుండి కొన్ని ముఖ్యమైన మార్పులు అమలులోకి వస్తున్నాయి. ఇకపై ATM ల నుండి డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. అలాగే రైల్వేలో రిజర్వేషన్ చేయిస్తే వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు వచ్చిన వారు జనరల్ కోచ్‌లో మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. ఇలాంటి 6 ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకుందాం రండి.

 

పూర్తి కథనం చదవండి

01:39 PM (IST) May 01

సరిహద్దులో రోబోలను ఉపయోగించాలని మోదీకి సూచించిన టెక్ దిగ్గజం.. భార్యా,కొడుకును చంపి తాను తనువు చాలించాడు.

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో భారతీయ సంతతికి చెందిన టెక్ వ్యాపారవేత్త హర్షవర్ధన్ S. కిక్కేరి తన భార్య శ్వేతా పనీయంతో పాటు 14 ఏళ్ల కొడుకును కాల్చి చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడీ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

 

పూర్తి కథనం చదవండి

01:36 PM (IST) May 01

మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో సినీనటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. చార్జ్‌షీట్ కొట్టివేత పిటిషన్ ను తిరస్కరించిన న్యాయస్థానం విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. 

పూర్తి కథనం చదవండి

01:22 PM (IST) May 01

8 ఏళ్లకే ఆది శంకరాచార్యులు అన్ని అద్భుతాలు చేశారా? ఆయనే మహాశివుడా?

Shankaracharya Jayanti: ఆది గురువు శంకరాచార్యుల గురించి మనందరం వినే ఉంటాం. పండితులు ఆయన్ను మహాదేవుని అవతారం అంటారు. దీనికి అనేక కారణాలు, ఆధారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి. 

 

పూర్తి కథనం చదవండి

12:40 PM (IST) May 01

IPL: శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు రూ. 12 ల‌క్షల ఫైన్‌.. ఎందుకో తెలుసా.?

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. మంగళవారం (ఏప్రిల్ 30) చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
 

పూర్తి కథనం చదవండి

12:35 PM (IST) May 01

కుల గణన క్రెడిట్ రాహుల్ గాంధీదే...: రేవంత్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ఱయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ క్రెడిట్ మొత్తం తమ నాయకుడు రాహుల్ గాంధీకే దక్కుతుందని పేర్కొన్నారు. కుల గణన విషయంలో కేంద్రం తమ సలహాలు తీసుకోవాలని రేవంత్ కోరారు. 

పూర్తి కథనం చదవండి

12:11 PM (IST) May 01

బీటెక్ స్టూడెంట్స్ ... ఇక మీ అమీర్ పేట చదువులు పనికిరావు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో అమీర్ పేట చదువులు పనికిరాకుండా పోతున్నాయా? అంటే టెక్ దిగ్గజ ాలు అవుననే అంటున్నాయి. తాజాగా ఈ ఏఐ పై మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

పూర్తి కథనం చదవండి

12:09 PM (IST) May 01

Milk price: భారీగా పెరిగిన పాల ధరలు.. లీటర్ పై ఎంతంటే..

మదర్ డెయిరీ తర్వాత ఇప్పుడు అమూల్ కూడా తన వివిధ పాల బ్రాండ్ల ధరలను పెంచింది. కొత్త ధరలు మే 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. వేసవి తీవ్రత నేపథ్యంలో పాల ధరలు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.

పూర్తి కథనం చదవండి

11:47 AM (IST) May 01

Gold Sales: మాకు బంగారం అంటే ప్రాణం.. అక్షయ తృతీయ రోజున ఎంత గోల్డ్ కొన్నారో తెలుసా?

బంగారం అంటే కేవ‌లం ఒక వ‌స్తువు మాత్ర‌మే కాదు, అదొక ఎమోష‌న్‌. ఇంట్లో బంగారం ఉంటే అదో ధీమా. అందుకే చాలా మంది బంగారాన్ని కొన‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. ముఖ్యంగా భారతీయుల‌ను, బంగారాన్ని విడ‌దీసి చూడలేము. సాధార‌ణ రోజుల్లోనే బంగారాన్ని తెగ కొంటుంటారు. అలాంటిది అక్ష‌య తృతీయ రోజు ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తాజాగా బుధ‌వారం అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా భారీగా బంగారం కొనుగోళ్లు జ‌రిగాయి. 
 

పూర్తి కథనం చదవండి

10:44 AM (IST) May 01

Gold Price: భారీగా ప‌త‌న‌మ‌వుతోన్న బంగారం ధ‌ర‌లు.. తులం రూ. 70 వేలు కానుందా.?

భార‌తీయుల‌ను, బంగారాన్ని విడ‌దీసి చూడ‌లేం. అంత‌లా మ‌న సంస్కృతిలో, ఆచారాల్లో బంగారం భాగ‌మైంది. ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయాల‌ని భావిస్తుంటారు. కాగా బంగారం ధ‌ర‌లు ఆకాశన్నంటిన విష‌యం తెలిసిందే. తులం బంగారం ఏకంగా రూ. ల‌క్ష దాటేసి అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. అయితే తాజాగా బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. 
 

పూర్తి కథనం చదవండి

10:24 AM (IST) May 01

ప్రయాణంలో మీకు వాంతులు అవుతాయా? ఖర్చులేని ఈ టిప్స్ మీ కోసమే

Travel Sickness: మీకు ప్రయాణంలో వాంతులు అవుతాయా? తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందా? ఎలాంటి ఖర్చు లేకుండా ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ప్రయాణం హాయిగా సాగుతుంది. 

 

పూర్తి కథనం చదవండి

10:15 AM (IST) May 01

India Pakistan Tension : బరితెగిస్తున్న పాక్ ... వరుస కాల్పులతో కవ్వింపు

జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాన్ ఆర్మీ బరితెగించినట్లు వ్యవహరిస్తోంది. విరామం లేకుండా ప్రతిరోజు రాత్రి కాల్పులు జరుపుతోంది. అయితే పాక్ కు భారత సైన్యం దీటుగా బదులిస్తోంది. 

పూర్తి కథనం చదవండి

09:58 AM (IST) May 01

Ind vs pak: యుద్ధం త‌ప్ప‌దు.. పాకిస్థాన్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌హ‌ల్గామ్ దాడుల త‌ర్వాత భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో కాల్పుల విర‌మ‌ణ చేస్తూ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతూనే మ‌రోవైపు భార‌త్ త‌మ‌పై దాడి చేయ‌నుంది అంటూ బూకాయిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా పాకిస్థాన్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 

పూర్తి కథనం చదవండి

09:40 AM (IST) May 01

Hyderabad : తెలుగోళ్లకు సూపర్ ఛాయిస్ ... ఇక్కడికి వెళితే తెల్ల పులులతో సెల్పీ దిగొచ్చు

ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు పులులను దూరంనుండి చూడాల్సిన పనిలేదు. హైదరాబాద్ కు వెళితే చాలు... తెల్ల పులుల ముఖంలో ముఖం పెట్టి చూడవచ్చు.  నెహ్రూ జూపార్క్‌లో టైగర్ గ్లాస్ ఎన్‌క్లోజర్ అందుబాటులోకి వచ్చింది. 

పూర్తి కథనం చదవండి

More Trending News