ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. మంగళవారం (ఏప్రిల్ 30) చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు నిర్దేశిత స‌మ‌యంలో త‌మ ఓవ‌ర్ల కోటాను పూర్తి చేయ‌లేక‌పోవ‌డం ఇదే తొలిసారి. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ తీసినప్పటికీ, శ్రేయస్ అయ్యర్, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌లు అర్థ సెంచరీలతో విజయంలో కీలక పాత్ర పోషించారు.

వారి అద్భుత‌ ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ విజయాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమితో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేస్‌ నుంచి త‌ప్పుకుంది. శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే, ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్ల నిదానంగా ఓవర్లు వేయడంపై ఐపీఎల్ అధికారుల దృష్టి పడింది.

నియమాల ప్రకారం నిర్ణీత సమయానికి ఓవర్లను పూర్తి చేయకపోతే దాన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఇది మొదటిసారి కావడంతో శ్రేయస్ అయ్యర్‌కు కేవలం జరిమానాతో సరిపెట్టారు. అయితే, భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరిగితే మ‌రిన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటారు.