MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • యుద్ధం త‌ప్ప‌దు.. పాకిస్థాన్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి వ్యాఖ్య‌లు

యుద్ధం త‌ప్ప‌దు.. పాకిస్థాన్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి వ్యాఖ్య‌లు

ప‌హ‌ల్గామ్ దాడుల త‌ర్వాత భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లో కాల్పుల విర‌మ‌ణ చేస్తూ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతూనే మ‌రోవైపు భార‌త్ త‌మ‌పై దాడి చేయ‌నుంది అంటూ బూకాయిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా పాకిస్థాన్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  

1 Min read
Narender Vaitla
Published : May 01 2025, 09:58 AM IST| Updated : May 01 2025, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Pakistan Defence Minister Khawaja Asif (File Photo)

Pakistan Defence Minister Khawaja Asif (File Photo)

భారత్ – పాకిస్తాన్‌ మధ్య పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయని పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ అన్నారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు పలు దేశాలు కృషి చేస్తున్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం చల్లబడట్లేదని ఆయన పేర్కొన్నారు. 
 

23
Khawaja Asif

Khawaja Asif

ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఖవాజా ఆసిఫ్‌, “పహల్గాం ఘటన తర్వాత భారతదేశం క్షేత్రస్థాయిలో తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలు తగ్గేలా కనీస సూచనలు కనిపించడం లేదు.

శాంతికి భారత్‌ ఒప్పుకుంటుందనే ఆశా కనిపించడంలేదు. ఎలాంటి దాడులు జరిగినా, పాకిస్థాన్‌ కూడా తగిన రీతిలో ప్రతిస్పందిస్తుంది. దీనిపై ఎలాంటి సందేహం లేదు. పరిస్థితి భారత్‌ చర్యలపై ఆధారపడి ఉంటుంది,” అన్నారు.

అలాగే, “ఇరు దేశాల మధ్య సయోధ్యకు దేవుడే దారి చూపించాలని కోరుకుంటున్నా. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి,” అని చెప్పారు.
 

Related Articles

Related image1
పహల్గాం మృతులకు అమరుల హోదా : కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్
Related image2
భారత గగనతలంలో పాకిస్తాన్ విమానాలకు నిషేధం
33

ఇదిలా ఉండగా, పహల్గాం దాడి తర్వాత భారత – పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్‌ సైన్యం వరుసగా ఆరు రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా వారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి, ఎల్‌వోసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వద్ద కూడా దుశ్చర్యలు కొనసాగిస్తున్నారు. 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
భారత దేశం
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved