బీటెక్ స్టూడెంట్స్ ... ఇక మీ అమీర్ పేట చదువులు పనికిరావు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో అమీర్ పేట చదువులు పనికిరాకుండా పోతున్నాయా? అంటే టెక్ దిగ్గజ ాలు అవుననే అంటున్నాయి. తాజాగా ఈ ఏఐ పై మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Artificial Intelligence
Artificial Intelligence : ప్రస్తుత టెక్నాలజీలో మరో విప్లవం ఈ కృత్రిమ మేధ (AI). ఇప్పటికే అనేక రంగాల్లో ఈ ఏఐ వినియోగం ప్రారంభమయ్యింది... దీంతో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మనిషి కంటే అత్యంత ఖచ్చితత్వంతో తప్పులు లేకుండా ఏఐ పనిచేస్తుంది... ఎక్కువమంది అవసరమయ్యే పనులను కూడా ఈ ఏఐ ఒక్కటే చేస్తోంది. దీంతో ఉద్యోగులకు బదులు ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించేందుకే దిగ్గజ సంస్థలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి.
ఇలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమ ప్లాట్ఫామ్ల మాతృ సంస్థ మెటా కూడా ఏఐ వైపే మొగ్గు చూపుతోంది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకన్ బర్గ్ స్వయంగా వెళ్లడించారు. త్వరలోనే తమ కంపనీకి చెందిన కీలక పనులను సైతం ఏఐ చేస్తుందని... అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని జుకన్ బర్గ్ తెలిపారు.

Mark Zuckerberg
మెటాలో ఏఐకి కీలక బాధ్యతలు :
ప్రపంచంలోని ప్రముఖ సామాజిక మాధ్యమాలను నిర్వహిస్తోంది మెటా. ఇందుకోసం భారీగా ఉద్యోగులు పనిచేస్తున్నారు... అయితే త్వరలోనే ఉద్యోగులు చేసే పనులను ఏఐతో చేయించనున్నట్లు ఆ సంస్థ సిఈవో మార్క్ జుకన్ బర్గ్ తెలిపారు. ఇదే జరిగితే చాలామంది టెక్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలున్నాయి.
ఇప్పటికే మెటాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తున్నామని... ఇది మా టీంలో సభ్యుడిగా మారిపోయిందని అన్నారు. కోడింగ్ కోసం ఉపయోగించేలా ఏఐ టెక్నాలజీని రూపొందిస్తున్నామని... 18 నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుందని అన్నారు. టాప్ కోడర్ల కంటే మెరుగ్గా ఈ ఏఐ పనిచేస్తుందని జుకన్ బర్గ్ తెలిపారు.
కోడింగ్ లో ఏఐ అద్భుతంగా పనిచేస్తుందని... బగ్ లను గుర్తిస్తూ స్వతంత్రంగా కోడ్ రాయగలదని జుకన్ బర్గ్ అన్నారు. అందుకే ఇప్పటికే మెటా చేపట్టిన లామా ప్రాజెక్టులో చాలా కోడ్స్ ఏఐ రాస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఏఐని మరింత ఎక్కువగా వినియోగించుకుంటామని... తద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించగలమని మెటా సీఈవో జుకన్ బర్గ్ తెలిపారు.
Artificial Intelligence
అమీర్ పేట చదువులు ఇక పనికిరావా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన మొదలయ్యింది... దీనివల్ల ఉద్యోగాలు ఉంటాయో, ఉడతాయో అన్న డైలమా చాలామందికి ఉంది. ముఖ్యంగా సాప్ట్ వేర్ రంగంలో ఈ భయం ఎక్కువగా ఉంది... టెక్ దిగ్గజాలన్ని ఈ ఏఐ వైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా జుకన్ బర్గ్ మరో అడుగు ముందుకేసి ఏఐ మనుషులకంటే ఖచ్చితత్వంతో పనిచేయగలదని అంటున్నారు. అంటే ఇకపై ఏఐ టెక్ సంస్థల్లో కీలక పాత్ర పోషించనుందని స్పష్టంగా అర్థమవుతోంది.
ఇదే జరిగితే ఇక అమీర్ పేట చదువులు అటకెక్కాల్సిందే. ఇప్పటికే ప్రతిఏటా లక్షలాదిమంది విద్యార్థులు బిటెక్ లు పూర్తిచేసి ఉద్యోగాలు లేక సతమతం అవుతున్నారు. ఇప్పుడు ఈ ఏఐ రాకతో ఉన్న ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి వస్తోంది. కాబట్టి సాప్ట్ వేర్ ఉద్యోగాల కోసం అమీర్ పేటలో కోచింగ్ లు తీసుకునే బిటెక్ స్టూడెంట్స్ పరిస్థితి ఏమవుతుందో అర్థంకావడంలేదు.