MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మే 1 నుండి అమలయ్యే 6 ముఖ్యమైన మార్పులివే: మన జేబుకు చిల్లే

మే 1 నుండి అమలయ్యే 6 ముఖ్యమైన మార్పులివే: మన జేబుకు చిల్లే

మే 1 నుండి కొన్ని ముఖ్యమైన మార్పులు అమలులోకి వస్తున్నాయి. ఇకపై ATM ల నుండి డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. అలాగే రైల్వేలో రిజర్వేషన్ చేయిస్తే వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు వచ్చిన వారు జనరల్ కోచ్‌లో మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. ఇలాంటి 6 ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకుందాం రండి. 

2 Min read
Naga Surya Phani Kumar
Published : May 01 2025, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ATM లపై ఛార్జీల మోత

మే 1, 2025 నుండి ATM ల నుండి డబ్బు విత్‌డ్రా చేయడం ఖరీదైనదిగా మారుతుంది. RBI ఇటీవల NPCI ప్రతిపాదనపై ఛార్జీల పెంపునకు అనుమతి ఇచ్చింది. అంటే మే 1 నుండి ఒక వ్యక్తి తన హోమ్ బ్యాంక్ ATM కాకుండా వేరే నెట్‌వర్క్ ATM నుండి డబ్బు విత్‌డ్రా చేస్తే లిమిట్ తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 23 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇంతకు ముందు రూ.17 మాత్రమే ఉండేది. అదేవిధంగా వేరే బ్యాంక్ ATMలో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే రూ.6 కాకుండా రూ.7 ఛార్జ్ విధిస్తారు. 

25

ATM లావాదేవీల లిమిటేషన్ కూడా మారింది

మే 1 నుండి ATM లావాదేవీల పరిమితి కూడా మారుతోంది. కొత్త నియమాల ప్రకారం మెట్రో నగరాల్లో వినియోగదారులు నెలకు 3 ఉచిత ATM లావాదేవీలు మాత్రమే చేయగలరు. మెట్రో కాకుండా ఇతర నగరాల్లో ఈ లిమిట్ నెలకు 5 చేయవచ్చు. ఈ ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే ఎక్కువ ఛార్జీలు కట్టాల్సిందే.

Related Articles

Related image1
గాడిద పాల చీజ్ లక్ష రూపాయలా? అంత స్పెషల్ ఏముందబ్బా?
Related image2
ఇప్పుడు పెన్షన్ రూ.1,000 కాదు రూ.3000: పెంచేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం
35

జనరల్ కోచ్‌లో మాత్రమే వెయిటింగ్ టికెట్

మే 1, 2025 నుండి రైల్వే టికెట్ బుకింగ్ నియమాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. దీని ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఇంతకు ముందులా రిజర్వేషన్ బోగీలో నుంచొని ప్రయాణించడానికి లేదు. జనరల్ కోచ్‌లో మాత్రమే ప్రయాణించాలి. అంటే ఇకపై మీరు వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్‌తో స్లీపర్ కోచ్‌లో ప్రయాణించలేరు.

45

LPG సిలిండర్ ధరల్లోనూ మార్పులు

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. కాబట్టి మే 1న LPG సిలిండర్ ధరల్లో మార్పులు ఉండవచ్చని సమాచారం. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ ధర రూ.17 వరకు తగ్గుతుందని తెలిసింది. 

55

CNG-PNG ధరల్లో మార్పులు

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన CNG, PNG ధరలను కూడా సవరిస్తాయి. దీని ప్రకారం విమాన ఇంధనం అయిన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరల్లో కూడా మే 1 నుండి మార్పులు ఉంటాయని తెలిసింది. 

మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవు

మే నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు ఉంటాయి. వీటిలో 2 శనివారాలు, 4 ఆదివారాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాల్లో బుద్ధ పూర్ణిమ, మహారాణా ప్రతాప్ జయంతి ఇతర స్థానిక సెలవులు ఉంటాయి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ప్రయాణం
ప్రభుత్వ పథకాలు
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
భారత దేశం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved