MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold: మాకు బంగారం అంటే ప్రాణం.. అక్షయ తృతీయ రోజున ఎంత గోల్డ్ కొన్నారో తెలుసా?

Gold: మాకు బంగారం అంటే ప్రాణం.. అక్షయ తృతీయ రోజున ఎంత గోల్డ్ కొన్నారో తెలుసా?

బంగారం అంటే కేవ‌లం ఒక వ‌స్తువు మాత్ర‌మే కాదు, అదొక ఎమోష‌న్‌. ఇంట్లో బంగారం ఉంటే అదో ధీమా. అందుకే చాలా మంది బంగారాన్ని కొన‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. ముఖ్యంగా భారతీయుల‌ను, బంగారాన్ని విడ‌దీసి చూడలేము. సాధార‌ణ రోజుల్లోనే బంగారాన్ని తెగ కొంటుంటారు. అలాంటిది అక్ష‌య తృతీయ రోజు ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తాజాగా బుధ‌వారం అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా భారీగా బంగారం కొనుగోళ్లు జ‌రిగాయి.  

2 Min read
Narender Vaitla
Published : May 01 2025, 11:47 AM IST| Updated : May 01 2025, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
akshay tritiya 2025

akshay tritiya 2025

అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు రూ. 12,000 కోట్లకు చేరుకున్నాయని కన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ‌ర్స్ (CAIT) పేర్కొంది. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, పెళ్లి సీజన్, అక్షయ తృతీయకు ఉన్న పవిత్రత కారణంగా ప్రజలు భారీగా బంగారం కొనుగోళ్లు చేశారు.
 

25


CAIT జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు ప్రవీణ్ ఖండేల్వాల్ ప్రకారం, బంగారం ఆభరణాలతో పాటు ఇతర వస్తువుల అమ్మకాలు రూ. 12,000 కోట్లకు చేరగా, వెండి అమ్మకాలు సుమారు రూ. 4,000 కోట్లుగా అంచా వేశారు. 
ఆల్ ఇండియా జ్యూవెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ అధ్యక్షుడు పంకజ్ అరోరా తెలిపిన వివరాల ప్రకారం. గురువారం బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,500గా ఉంది. వెండి ధర కిలోకి రూ. 98,000కి చేరింది. 

Related Articles

Related image1
Gold Price: భారీగా ప‌త‌న‌మ‌వుతోన్న బంగారం ధ‌ర‌లు.. తులం రూ. 70 వేలు కానుందా.?
Related image2
ఇప్పుడు పెన్షన్ రూ.1,000 కాదు రూ.3000: పెంచేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం
35

2022లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 52,700, వెండి కిలో ధర రూ. 65,000 ఉండగా, 2023లో బంగారం రూ. 61,800, వెండి రూ. 76,500కి చేరింది. 2024లో బంగారం రూ. 74,900కి చేరింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా గణాంకాల ప్రకారం, 2025 జనవరి మార్చిలో దేశంలో బంగారం డిమాండ్ 118.1 టన్నులుగా నమోదైంది, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15% తగ్గింది. కానీ, బంగారం ధరలు 25% పెరిగిన కారణంగా మొత్తం డిమాండ్ విలువలో 22% వృద్ధి చోటు చేసుకుంది.
 

45
Gold Price

Gold Price

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా CEO సచిన్ జైన్ ప్రకారం, బంగారం ధర 10 గ్రాములకు  లక్షను తాకడంతో ప్రజల ఆసక్తి మరింత పెరిగింది. డిజిటల్ గోల్డ్, గోల్డ్ ETFలు, నాణేలు, బార్లపై పెట్టుబడులపై ఆసక్తి పెరిగిందన్నారు. అక్షయ తృతీయతో పాటు పెళ్లి సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లపై మరింత ఉత్సాహం కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

55

రికార్డు స్థాయిలో బంగారం డాల‌ర్ల విక్ర‌యాలు

అక్షయ తృతీయ రోజు రికార్డుస్థాయిలో శ్రీవారి బంగారం డాలర్ల విక్రయాలు జ‌రిగాయి. బుధ‌వారం ఒక్క రోజే టీటీడీ ఏకంగా రూ. 90 లక్షల విలువైన బంగార డాలర్లను విక్రయించింది. ఇదిలా ఉంటే గ‌తేడాది అక్ష‌య‌తృతీయ రోజు రూ. 75 ల‌క్ష‌ల విలువైన బంగారు డాల‌ర్ల విక్ర‌యాలు జ‌రిగాయి. 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
బంగారం
పర్సనల్ పైనాన్స్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved