Published : Apr 28, 2025, 06:13 AM ISTUpdated : Apr 28, 2025, 11:59 PM IST

Telugu news live updates: Nifty prediction 29 April: ఫుల్ జోష్ లో భారత స్టాక్ మార్కెట్లు.. మంగళవారం

సారాంశం

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్‌ లైవ్‌ న్యూస్‌ అప్డేట్స్‌  అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.. 

Telugu news live updates: Nifty prediction 29 April: ఫుల్ జోష్ లో భారత స్టాక్ మార్కెట్లు.. మంగళవారం

11:59 PM (IST) Apr 28

Nifty prediction 29 April: ఫుల్ జోష్ లో భారత స్టాక్ మార్కెట్లు.. మంగళవారం

Nifty prediction tomorrow 29 April: మార్కెట్లు మంచి గ్యాప్-అప్‌తో ప్రారంభమై సోమవారం మొత్తం అదే జోష్‌ను కొనసాగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,005.84 పాయింట్లు (1.27%) పెరిగి 80,218.37 వద్ద, నిఫ్టీ 289.15 పాయింట్లు (1.20%) పెరిగి 24,328.50 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3%, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4% పెరిగాయి. మరి రేపు షేర్ మార్కెట్ ఎలా ఉండనుంది? 
 

పూర్తి కథనం చదవండి

11:09 PM (IST) Apr 28

RR vs GT: గుజ‌రాత్ ను చిత్తుగా ఓడించిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్

RR vs GT: ఐపీఎల్ 2025లో వైభవ్ సూర్యవంశీ, య‌శ‌స్వి జైస్వాల్ సూప‌ర్ నాక్ తో గుజ‌రాత్ టైటాన్స్ పై రాజ‌స్తాన్ రాయ‌ల్స్ సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. కేవ‌లం 15.5 212/2 ప‌రుగుల‌తో విజ‌యాన్ని అందుకుంది. 
 

పూర్తి కథనం చదవండి

11:09 PM (IST) Apr 28

Vaibhav Surya: వైభవ్‌ వైల్డ్ ఫైర్‌ సెంచరీ.. పిల్లోడనుకున్నారు.. అదేం కొట్టుడురా అయ్యా!  

Vaibhav Surya Smashes Century: ఐపీఎల్‌ మ్యాచ్‌లలో రోజుకో సంచలనం నమోదువుతోంది. ఇవాళ జరిగిన మ్యాచ్లో కూడా రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ 14 ఏళ్ల పసివాడు వైభవ్‌ సూర్య గుజరాత్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. బంతి పడటం ఆలస్యం గ్యాలరీకి పంపడమే తన లక్ష్యం అన్నట్లు చెలరేగిపోయాడు.... అత్యంత పిన్న వయసులో తక్కువ బంతుల్లో సెంచరీ బాది రికార్డులో నిలిచాడు. 
 

పూర్తి కథనం చదవండి

10:52 PM (IST) Apr 28

వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే!

Vaibhav Suryavanshi:  గుజరాత్ టైటాన్స్ పై వైభవ్ సూర్యవంశీ బ్యాట్ తో విరుచుకుపడ్డాడు. 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఐపీఎల్ లో చాలా రికార్డ్స్ బద్దలు కొట్టాడు.

పూర్తి కథనం చదవండి

10:52 PM (IST) Apr 28

RR vs GT: 7 ఫోర్లు, 11 సిక్స‌ర్లతో ప‌రుగుల సునామీ.. 35 బంతుల్లో సెంచ‌రీ కొట్టిన వైభ‌వ్ సూర్య‌వంశీ

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో అత్యంత వేగవంతమైన  హాఫ్ సెంచ‌రీ, ఆ త‌ర్వాత సెంచ‌రీ కొట్టాడు 14 ఏళ్ల బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ కొట్టిన అతి పిన్న వయస్కుడిగా వైభ‌వ్ రికార్డు సృష్టించాడు.
 

పూర్తి కథనం చదవండి

10:37 PM (IST) Apr 28

అజిత్ పై మాజీ ప్రేయసి హీరా ఆరోపణలు.. నచ్చిన అమ్మాయితో తిరుగుతా అంటూ.. 

10:26 PM (IST) Apr 28

పద్మ భూషణ్ అందుకున్న బాలయ్య, పవన్ కళ్యాణ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే

నందమూరి బాలకృష్ణ సోమవారం రోజు ఏప్రిల్ 28న రాష్ట్రపతి భవన్ లో పద్మ భూషణ్ అవార్డుని స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.

పూర్తి కథనం చదవండి

09:50 PM (IST) Apr 28

పహల్గాం దాడి: విజయ్ ఆంటోనీ కామెంట్స్ పై వివాదం.. క్లారిటీ ఇచ్చిన క్రేజీ హీరో

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న వారి కోసం విజయ్ ఆంటోనీ మరో ప్రకటన విడుదల చేశారు.

పూర్తి కథనం చదవండి

09:38 PM (IST) Apr 28

Pawan Kalyan: ఏనుగుల గుంపు బీభ‌త్సం.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మీక్ష‌.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపులు బీభ‌త్సం సృష్టించాయి. పంటలు దెబ్బ‌తిన‌డంతో పాటు ఒక రైతు ప్రాణాలు కోల్పోయిన క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప‌ ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మీక్ష నిర్వ‌హించారు. తక్షణ చర్యలకు ఆదేశించారు. 
 

పూర్తి కథనం చదవండి

08:53 PM (IST) Apr 28

Andhra Pradesh RS: హేమాహేమీలను కాదని అతనికే రాజ్యసభ సీట్‌.. ఆర్‌ఎస్‌ఎస్‌ వల్లేనా?

 Andhra Pradesh Rajya Sabha: ఏపీలో ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు బీజేపీ అభ్యర్థిని అధీష్టానం ఎంపిక చేసింది. భీమవరం ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు పాక వెంకట సత్యనారాయణ పేరును ఎన్డీఏ కూటమి ప్రకటించింది. ఈయన ప్రస్తుతం ఏపీ బీజేపీ డిసిప్లీనరీ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభ సీటు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఆ సీటు తమకు కావాలని కోరడంతో బీజేపీ కోరడంతో సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఈ సీటు కోసం అనేక మంది ఆశావాహుల పేర్లు వినిపించాయి. ఈక్రమంలో ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో సంస్థాగతంగా పనిచేసుకుంటూ వస్తున్న నేత పాక వెంకట సత్యనారాయణను రాజ్యసభ అవకాశం వరించింది. 

పూర్తి కథనం చదవండి

08:48 PM (IST) Apr 28

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టిన హీరోయిన్లు

పురుషాధిక్య సమాజంలో, సినిమా పరిశ్రమలో మహిళా ప్రధాన చిత్రాల విజయ ప్రస్థానం, వాటి వినూత్న కథాంశాల గురించి తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

08:48 PM (IST) Apr 28

Injury to KTR: కేటీఆర్‌కు గాయం

Injured BRS working president KTR:  భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు (కేటీఆర్) గాయ‌ప‌డ్డారు. 

పూర్తి కథనం చదవండి

08:27 PM (IST) Apr 28

Weather Update: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు

Weather Forecast: రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఎండాకాలంలో వానలు దంచికొడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాబోయే నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ) పలు జిల్లాలలకు హెచ్చరికలు జారీ చేసింది.

పూర్తి కథనం చదవండి

08:25 PM (IST) Apr 28

చిరు, అనిల్ రావిపూడికి చుక్కలు చూపించిన నయనతార ? ఆమె డిమాండ్ ఏంటో తెలుసా

ప్రస్తుతం ఒక్కో సినిమాకి 12 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న నయనతార, 69 ఏళ్ల నటుడి సరసన నటించడానికి భారీ పారితోషికం అడిగి నిర్మాతలకు షాక్ ఇచ్చారట.

పూర్తి కథనం చదవండి

07:29 PM (IST) Apr 28

IPL 2025: వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ ఎలా బలమైన టీమ్ గా మారింది?

IPL Mumbai Indians Resurgence After Poor Start: ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా పుంజుకుంది. సీజన్ ప్రారంభంలో తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై జట్టు ఇప్పుడు 12 పాయింట్లతో మూడో స్థానానికి దూసుకెళ్లింది. పూర్ స్టార్ట్ నుంచి బలమైన జట్టుగా ముంబై ఇండియన్స్ ఎలా మారింది? హార్దిక్ పాడ్యా కెప్టెన్సీలోని ముంబై జట్టు బలం ఎలా పొందింది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

06:25 PM (IST) Apr 28

మే 7న కొత్త పోప్ ఎన్నిక

కొత్త పోప్‌ను ఎన్నుకోవడానికి మే 7న కార్డినల్స్  సమావేశం కానున్నారు.

పూర్తి కథనం చదవండి

06:13 PM (IST) Apr 28

గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ, కేెెల్ రాహుల్ ఫైట్.. ఏం జరిగింది?

Virat Kohli and KL Rahul fight: ఐపీఎల్ 2025 లో  భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఫైట్ చేశారు? 

పూర్తి కథనం చదవండి

06:07 PM (IST) Apr 28

bomb blast in Pakistan: పాకిస్తాన్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఏడుగురు మృతి

bomb blast in Pakistan: పాకిస్తాన్‌లోని దక్షిణ వజీరిస్తాన్‌లో శాంతి సమావేశంలో బాంబ్ బ్లాస్ట్ జ‌రిగింది. ఈ పేలుడులో 7 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.
 

పూర్తి కథనం చదవండి

06:06 PM (IST) Apr 28

Modi Amaravati Tour: ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది.. వేదికపై 20 మందే!  

Modi Amaravati Tour:  ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది. ప్రధాని మోదీ మే 2న అమరావతికి రానున్నారు. ఇక సభకు సంబంధించి, మోదీ పర్యటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

పూర్తి కథనం చదవండి

05:35 PM (IST) Apr 28

Modi Amaravati Visit: చరిత్రలో నిలిచిపోయేలా మోదీ సభ... ఆ జిల్లాల నుంచి లక్షల మంది!

Modi Amaravati Visit: ప్రధాని మోదీ మే 2న ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమాన్ని, పనుల శంకుస్థాపనలను ప్రధాని చేతులమీదుగా చేపట్టనున్నారు. ఆ తర్వాత రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను మోదీ సన్మానించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి చుట్టుపక్కల నుంచి భారీ జనసమీకరణ చేసేందుకు నాయకులు సన్నద్దం అవుతున్నారు. 

పూర్తి కథనం చదవండి

05:19 PM (IST) Apr 28

ఉక్రెయిన్ రష్యా వార్: 3 రోజుల కాల్పుల విరమణ ప్రకటించిన పుతిన్

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణను ప్ర‌క‌టించారు. ఇది మే 8 నుండి మే 11 వరకు కొనసాగుతుందని  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్ర‌క‌టించారు. దీనిపై ఉక్రెయిన్ ఇంకా స్పందించ‌లేదు. 

పూర్తి కథనం చదవండి

04:49 PM (IST) Apr 28

కిలో చికెన్ రూ.800, బియ్యం రూ.340: కష్టాల్లోపాక్.. భారత్ తో యుద్ధం దానికే నష్టం.. ఎందుకంటే?

Chicken costs Rs. 800 per kg in Pakistan: జ‌మ్మూకాశ్మీర్ లోని ప‌హ‌ల్గామ్ లో ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధ‌వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇరు దేశాల స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఎప్పుడైనా య‌ద్ధం మొద‌లుకావ‌చ్చు అనే రిపోర్టుల మ‌ధ్య పాకిస్తాన్ లో నిత్యావ‌స‌రాల ధ‌రలు ఆకాశాన్ని తాకాయి. ఇప్ప‌టికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ లో కిలో చికెన్ ధ‌ర‌లు రూ.800ల‌కు చేరాయి. కిలో బియ్యం ధ‌ర‌లు 340 రూపాయ‌లుగా ఉంది. 
 

పూర్తి కథనం చదవండి

04:41 PM (IST) Apr 28

తహవూర్ రాణా: 26/11 కుట్రదారుడి కస్టడీ 12 రోజులు పొడిగింపు

ఢిల్లీ కోర్టు సోమవారం 26/11 ముంబై దాడుల నిందితుడు తహవూర్ హుస్సేన్ రాణా కస్టడీని  12 రోజులు పొడిగించింది. రాణా NIA కస్టడీలో మరో 12 రోజులు ఉంటాడు.

పూర్తి కథనం చదవండి

03:50 PM (IST) Apr 28

బాహుబలి 2 తారల చదువుల వివరాలు: ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా

ప్రభాస్, అనుష్క,రానా వంటి 'బాహుబలి 2' సినిమా తారల చదువుల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు! వాళ్ళ స్కూల్ నుండి కాలేజీ వరకు చదువుల ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోండి.

 

పూర్తి కథనం చదవండి

03:47 PM (IST) Apr 28

ఆడామగ తేడాలేదు... ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే లక్కీ ఛాన్స్

తెలుగు రాష్ట్రాలు ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నాయి. అయితే తమిళనాడులో ఆడామగ తేడాలేకుండా ఏడాదిపాటు ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే లక్కీ ఛాన్స్ కల్పిస్తోంది. 

పూర్తి కథనం చదవండి

03:11 PM (IST) Apr 28

ఇలాగైతే నడవదు..: సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్ 

కేసీఆర్ వరంగల్ సభలో కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చించాలని, తెలంగాణను అప్పులపాలు చేసింది కేసీఆరే అని ఆరోపించారు. పథకాల అమలులో కమిట్మెంట్ తో ఉంటామన్నారు. ఈ క్రమంలో సొంతపార్టీ ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 

పూర్తి కథనం చదవండి

03:02 PM (IST) Apr 28

Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్‌లోనే! 

Horrific Road Accident in Tirupati: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. చనిపోయారు. 


 

పూర్తి కథనం చదవండి

02:59 PM (IST) Apr 28

ప్రాన్స్ తో రూ.63,000 కోట్ల ఒప్పందం ... 26 రఫేల్-M జెట్‌లకు

భారత్, ఫ్రాన్స్ దేశాలు 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్‌ల కొనుగోలు కోసం రూ.63,000 కోట్ల భారీ రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడ్డాయి.

పూర్తి కథనం చదవండి

02:50 PM (IST) Apr 28

CM Revanth: కేసీఆర్‌ చావును నేను కోరుకోలేదు.. అందుకే ఆసుపత్రికి వెళ్లా!

CM Revanth: కేసీఆర్‌ గత ప్రభుత్వంలో పేరుకి అనేక పథకాలు తీసుకొచ్చి.. వాటిని వెంటనే క్లోజ్‌ చేశారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. తాను అలాంటి పనులు చేయనని, చెప్పిందే చెస్తానని.. ఈ నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేస్తా అని ఆయన అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకల్లో ఆ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం రేవంత్‌ స్పందించారు. 
 

పూర్తి కథనం చదవండి

02:15 PM (IST) Apr 28

సూర్య 'రెట్రో' మూవీ ప్రీ బుకింగ్ రికార్డ్: గుడ్ బ్యాడ్ అగ్లీని దాటేసింది!

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటించిన రెట్రో సినిమా మే 1న విడుదల కానుంది. దాని ప్రీ బుకింగ్ వసూళ్లను ఇక్కడ చూడండి.

పూర్తి కథనం చదవండి

02:14 PM (IST) Apr 28

Chandrababu: లాజిస్టిక్ హబ్‌గా రాయలసీమ.. వైజాగ్‌ ఆర్థిక రాజధాని... చంద్రబాబు డ్రీం!

Chandrababu with NDA Leaders: ఏపీలోని విశాఖపట్టణాన్ని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చుదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి మే 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలకడంతోపాటు సభను విజయవంతం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే నేతలకు పిలుపునిచ్చారు. 

పూర్తి కథనం చదవండి

02:11 PM (IST) Apr 28

రాజీనామా చేస్తే తీవ్ర పరిణామాలు : పాక్ సైనికులకు హెచ్చరికలు

పహల్గాం దాడి నేపథ్యంలో భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య పాక్ సైన్యంలో రాజీనామాల ఊహాగానాలు వ్యాపించాయి. ఐఎస్‌పిఆర్ ద్వారా క్రమశిక్షణ, ఐక్యతను పాటించాలని, రాజీనామా చేస్తే చర్యలు తప్పవని సైన్యానికి హెచ్చరిక జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల ప్రామాణికత ఇంకా నిర్ధారణ కాలేదు.

పూర్తి కథనం చదవండి

02:10 PM (IST) Apr 28

బాహుబలి 2 కోసం ప్రభాస్, అనుష్క, రానా రెమ్యునరేషన్లు ఎంత తీసుకున్నారో తెలుసా?

దర్శక ధీరుడు  ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా బాహుబలి 2 . ఈ  సినిమా రిలీజ్ అయ్యి   8 ఏళ్లు అవుతుంది.  ఈ సందర్భంగా బాహుబలి  సినిమా కోసం ప్రభాస్ తో పాటు అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, రమ్య కృష్ణ లాంటి స్టార్లు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

01:49 PM (IST) Apr 28

AP: ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. 85 వేల కుటుంబాల సొంతింటి కల నెరవేరబోతోంది! 

AP Govt Regularizes 870 Old Layouts: ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎప్పటి నుంచో పట్టణాభివృద్ది సంస్థ నుంచి అనుమతులకు నోచుకోక లేవట్లు అడవులుగా మారాయి. ఈక్రమంలో ఆ పాత లేఅవుట్లు అన్నింటినీ క్రమబద్దీకరణకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 85 వేల కుటుంబాలకు లబ్ది చేకూర్చినట్లైంది. 

పూర్తి కథనం చదవండి

01:35 PM (IST) Apr 28

ఆర్మీ ఉద్యోగాలు మాకొద్దు బాబోయ్... భారత్ ను చూసి వణికిపోతున్న పాక్ సైన్యం

పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పాకిస్తాన్ సైన్యం వణికిపోతోంది. ఆర్మీ ఉన్నతాధికారులు, సైనికుల రాజీనామాలే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు ఎంతమంది రాజీనామా చేసారంటే...  

పూర్తి కథనం చదవండి

12:41 PM (IST) Apr 28

TS Police: పాకిస్తానీయులకు షాకిచ్చిన తెలంగాణ పోలీస్‌.. ఏం చేశారంటే! 

TS Police: కశ్మీర్‌లోని పహల్గాంలో తీవ్రవాదుల ఘటన నేపథ్యంలో పాకిస్తానీయకులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 48 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసినా కొన్ని ప్రాంతాల్లో పాక్‌ జాతీయులు స్వదేశానికి వెళ్లిపోకుండా ఇక్కడే ఉన్నారు. అలా హైదరాబాద్‌లో కూడా పాకిస్తానోళ్లు వెళ్లకుండా ఉండిపోయారు. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. 

పూర్తి కథనం చదవండి

12:34 PM (IST) Apr 28

వణికిపోతున్న పాక్ సైన్యం ... ఏకంగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మిస్సింగ్

పహల్గాం దాడి తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకోవడంతో పాకిస్తాన్ లో టెన్షన్ నెలకొంది. సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ కుటుంబంతో సహా మిస్సింగ్ అయినట్లు తెలుస్తోంది. 

పూర్తి కథనం చదవండి

12:18 PM (IST) Apr 28

పాకిస్తాన్‌కు చైనా PL-15 క్షిపణులు అందాయా? వీటి ప్రత్యేకత ఏంటి?

ఇండియా-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరుదేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్న వేళ పాక్ కు చైనా భారీ ఆయుధ సామాగ్రిని అందించింది.

 

 

 

పూర్తి కథనం చదవండి

12:15 PM (IST) Apr 28

Telangana 10th: పది ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. ఎస్‌ఎంఎస్‌ చేస్తే రిజల్ట్స్‌.. భారీ మార్పులు! 

Telangana 10th Results: తెలంగాణ ఫలితాల విడుదలలో కీలక మార్పులు చేశారు. గతంలో గ్రేడ్‌ల విధానంలో ఫలితాలు విడుదల కావడంతో ఎవరికి అధికంగా మార్కులు వచ్చాయో తెలిసేది కాదు.. ఈ నేపథ్యంలో ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. గ్రేడ్‌లతోపాటు మార్కులను విడుదల చేయనున్నారు. దీంతోపాటు ఫలితాల విడుదల తేదీలను ప్రకటించారు. 

పూర్తి కథనం చదవండి

11:34 AM (IST) Apr 28

హైదరాబాద్ లో ఈడి దాడులు... భూదాన్ భూముల అక్రమాలపై యాక్షన్

హైదరాబాద్ శివారులో వందల ఎకరాల భూధాన్ భూముల కబ్జా వ్యవహారం బట్టబయలైంది. కోట్ల విలువైన ఈ భూముల అక్రమ విక్రయాలపై ఈడీ దర్యాప్తు చేపడుతోంది... తాజాగా స్పీడ్ పెంచిన ఈడి ఇళ్లపై దాడులకు దిగింది. 

పూర్తి కథనం చదవండి

More Trending News