RR vs GT: ఐపీఎల్ 2025లో వైభవ్ సూర్యవంశీ, య‌శ‌స్వి జైస్వాల్ సూప‌ర్ నాక్ తో గుజ‌రాత్ టైటాన్స్ పై రాజ‌స్తాన్ రాయ‌ల్స్ సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. కేవ‌లం 15.5 212/2 ప‌రుగుల‌తో విజ‌యాన్ని అందుకుంది.   

RR vs GT:   ఐపీఎల్ 2025లో రాజ‌స్థాన్ ప్లేయ‌ర్లు  ప‌రుగులు సునామీ సృష్టించాడు. దుమ్మురేపే ప్ర‌ద‌ర్శ‌న‌తో గుజ‌రాత్ టైటాన్స్ కు షాక్ ఇచ్చారు. వైభ‌వ్ సూర్య‌వంశీ సూప‌ర్ సెంచ‌రీకీ తోడుగా య‌శ‌స్వి జైస్వాల్ హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో గుజ‌రాత్ టైటాన్స్ ఉంచిన 209/4  ప‌రుగుల టార్గెట్ ను  రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కేవ‌లం 15.5 ఓవ‌ర్ల‌లోనే 212/2 ప‌రుగుల‌తో విజ‌యాన్ని అందుకుంది. 

ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు అదిరిపోయే ఆరంభం ల‌భించింది. పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. 52 పరుగులతో వైభవ్ సూర్యవంశీ, 31 పరుగులతో యశస్వి జైస్వాల్ దుమ్మురేపారు. ఆ త‌ర్వాత కూడా  వైభ‌వ్ ప‌రుగుల సునామీ రేపుతు సెంచ‌రీ కొట్టాడు. కేవ‌లం 35 బంతుల్లోనే సెంచ‌రీ కొట్టాడు. త‌న సెంచ‌రీ (101 ప‌రుగులు) ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 11 సిక్స‌ర్లు బాదాడు. 

మ‌రో ఎండ్ లో ఉన్న య‌శ‌స్వి జైప్వాల్ కూడా మంచి హాఫ్ సెంచ‌రీ (70 ప‌రుగులు) అజేయ ఇన్నింగ్స్  తో రాజ‌స్తాన్ కు విజ‌యాన్ని అందించాడు. అంత‌కుముందు, రాజస్థాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్  ఎంచుకోవ‌డంతో గుజరాత్ బ్యాటింగ్ కు దిగింది. శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్ మరోసారి జట్టుకు గొప్ప ఆరంభాన్ని ఇచ్చారు. సుదర్శన్ 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, శుభ్‌మాన్ గిల్ 84 పరుగులు చేశాడు. జోస్ బ‌ట్ల‌ర్ 50 ప‌రుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో గుజ‌రాత్ టైటాన్స్ కేవ‌లం 209/4 ప‌రుగులు చేసింది. 

వైభవ్ సూర్యవంశీ రికార్డులు మోత

వైభవ్ సూర్యవంశీ సెంచరీ ఇన్నింగ్స్ లో రికార్డుల మోత మోగించాడు. ఐపీఎల్ లో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. మొత్తంగా ఐపీఎల్ హిస్టరీలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా వైభవ్ సూర్య వంశీ నిలిచాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీని క్రిస్ గేల్ కేవలం 30 బంతుల్లోనే కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ మొత్తగా టీ20 క్రికెట్ లో సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ గా కూడా రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్ లో 14 ఏళ్ల 32 రోజుల వయస్సులో వైభవ్ బ్యాట్ నుంచి సెంచరీ వచ్చింది.