పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ పైకోర్టుకు వెళ్లారు. కానీ, ఊరట లభించలేదు. తాజాగా, హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ అప్పీల్ విచారించే ధర్మాసనం నుంచి ఓ న్యాయూమర్తి గీతా గోపీ పక్కకు తప్పుకున్నారు.