వివేకా హత్య కేసును ఈ రోజు విచారించి సీబీఐ కోర్టు విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణకు వివేకా హత్య కేసు నిందితులు ఎంపీ అవినాశ్ రెడ్డి, ఇతర నిందితులు హాజరయ్యారు. కాగా, ఇదే కేసులో నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ రోజు చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు.