Asianet News TeluguAsianet News Telugu

మాజీ ఎంపీ వినోద్ ను టార్గెట్ చేసిన పొన్నం ... బండి సంజయ్ కు విజ్ఞప్తి

కరీంనగర్ :  మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత బోయినిపల్లి వినోద్ కుమార్ కేవలం తన స్వప్రయోజనాలే తప్ప కరీంనగర్ జిల్లా ప్రయోజనాలను పట్టించుకోలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. 

కరీంనగర్ :  మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత బోయినిపల్లి వినోద్ కుమార్ కేవలం తన స్వప్రయోజనాలే తప్ప కరీంనగర్ జిల్లా ప్రయోజనాలను పట్టించుకోలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణకు తాను కృషిచేసానని... కానీ వినోద్ తన ప్రయోజనాల కోసం అలైన్ మెంట్ మార్చారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు వంకలు తిప్పుతూ తన ప్రతిమ కాలేజీ పక్కనుండి హైవే వెళ్లేలా వినోద్ చూసుకున్నాడని అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో వుంది కాబట్టి ఈ నేషనల్ హైవే అలైన్ మెంట్ పై స్థానిక ఎంపీ, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టిసారించాలని పొన్నం కోరారు.