Asianet News TeluguAsianet News Telugu

శ్రీశైలంలో హడలెత్తిస్తున్న అడవి పందులు

శ్రీశైలమహాక్షేత్రంలో రాత్రిపూట పురవీధుల్లో అడవి పందులు స్వైర విహారం చేస్తూ చేస్తున్నాయి

శ్రీశైలమహాక్షేత్రంలో రాత్రిపూట పురవీధుల్లో అడవి పందులు స్వైర విహారం చేస్తూ చేస్తున్నాయి . శ్రీశైల దేవస్థానం కార్యనిర్వాహక పరిపాలన భవనానికి సమీపాన ఉన్నా రహదారిపై దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా వచ్చి అడవిపందులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురి చేశాయి .శ్రీశైల దేవస్థానం లో కరోనా కేసులు విజృంభించడంతో ఆలయ భక్తుల దర్శనాలను నిలిపోయివేయడంతో భక్తులు లేక భక్తుల అన్నదాన సత్రాలు కూడా మూసివేయడంతో రోడ్డుపై ఉన్న దుకాణాలపై దాడి చేసి ఆ దుకాణాలలో వాటికి దొరికిన ఆహారాన్ని తినేందుకు అడవి పందులు పోటీపడ్డాయి.