Asianet News TeluguAsianet News Telugu

West Godavari Accident: వాగులోకి దూసుకెళ్లిన బస్సు... 9మంది మృతి (వీడియో)

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి వాగులో పడిపోయింది. దీంతో వాగులో మునిగి ఎనిమిది మంది మృతి చెందారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.