Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల పొత్తుల పచ్చడి... జనసేనకు వగరు, టీడీపీ కి తీపి, బీజేపీకి చేదు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నే దెబ్బ తీసినట్లు కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నే దెబ్బ తీసినట్లు కనిపిస్తోంది. జగన్ కు ఆ ఫలితాలు ఎలాగూ మింగుడు పడవు. కానీ, పవన్ కల్యాణ్ కు మాత్రం ఎదురుదెబ్బనే అని చెప్పాలి. ఓ వైపు తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు మునుపటిలా పవన్ కల్యాణ్ తో దోస్తీ కోసం అర్రులు చాచకపోవచ్చు. అలాగే, పవన్ కల్యాణ్ మీద ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులు మండిపడుతున్నారు. 

Video Top Stories