GN Rao Committee : జగన్ చేతుల్లో రాజధాని కమిటీ నివేదిక

ఏపీ రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదికను అందించింది.

Share this Video

ఏపీ రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదికను అందించింది. ఏపీలో రాజధాని ఏర్పాటు విషయమై నిపుణుల కమిటీ నివేదికను కేబినెట్ సమావేశంలో చర్చించి నివేదికను బహిర్గతం చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని సమాచారం. ఈ విషయమై ఈ నెల 27వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టుగా ప్రచారం సాగింది. ఏపీకి రాజధాని ఏర్పాటు విషయమై ఈ ఏడాది సెప్టెంబర్ 13వ తేదీన సీఎం జగన్ జీఎన్ రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video