Asianet News TeluguAsianet News Telugu

అర్ధరాత్రి విద్యుత్ వైర్లు తెగిపడి... నిద్రలోనే ఆరుగురి ప్రాణాలు బలి

గుంటూరు రేపల్లె మండలం లంకెవాని దిబ్బ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

గుంటూరు రేపల్లె మండలం లంకెవాని దిబ్బ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఓ రొయ్యల చెరువు దగ్గర పనిచేస్తున్న ఒడిషాకు చెందినవారు ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ గురయ్యారు.  గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. అర్ధరాత్రి చెరువు గట్టుపై నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్ గా పోలీసులు గుర్తించారు.  

Video Top Stories