AP Train Accident: విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండి దగ్గర ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. సుమారు 50 మందికి తీవ్ర గాయపడ్డారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఈ రైలు ప్రమాద ఘటనకు సంబంధించిన ఎన్నో హృదయ విదారక దృశ్యాలు వైరల్ గా మారాయి. మృత దేహాలు, బాధిత కుటుంబ సభ్యుల కన్నీటి వ్యథలు, క్షత్రగాత్రులు ఆర్తానాథాలు ఇలా ఎన్నో దృశ్యాలు తారసపడ్డాయి. తాజాగా ఈ ప్రమాద బాధితుడైన ఓ జర్నలిస్ట్ సోదరిడ్ని ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.