చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించం, ఎఫ్ఆర్ఓ అనితకు మంత్రి పరామర్శ
పోడు భూముల సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తుందని తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్: పోడు భూముల సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తుందని తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
బుధవారంనాడు ఆయన బోథ్ మండలం కోర్టా (కే) గ్రామంలో ఎఫ్ఆర్ఓ అనితను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు.అనిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని అనితకు, ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. ధైర్యంగా నిలబడి దాడిని ఎదుర్కొని అనిత తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిందని ఆయన ప్రశంసించారు.
పోడు భూముల సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ త్వరలోనే పరిష్కరించనున్నట్టు ఆయన తెలిపారు. కాగజ్ నగర్ అటవీ రేంజ్ ఆఫీసర్ అనితపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
మాకు ఆయుధాలు ఇవ్వండి: కోనేరు కృష్ణ దాడిపై అనిత
అనితపై దాడి: కోనేరు కృష్ణ మరిన్ని అరాచకాలు, వీడియో లీక్
ఎమ్మెల్యే కోనప్పపై ఎఫ్ఆర్ఓ అనిత సంచలన వ్యాఖ్యలు
సార్సాలో ఉద్రిక్తత: అటవీశాఖాధికారులను అడ్డుకొనేందుకు గ్రామస్తుల యత్నం
బూటు కాలితో తన్నింది, అందుకే దాడి: అనితపై ఎమ్మెల్యే కోనప్ప
వైస్ చైర్మన్ దాడి: గుర్తు చేసుకుని ఏడ్చేసిన అనిత
నన్ను వాళ్లు ఏం చేస్తారోనని భయంగా ఉంది.. అనిత
ఎఫ్ఆర్వోపై దాడి: చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న కేటీఆర్
ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్
ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్
ఎఫ్ఆర్ఓ అనితపై దాడిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందన ఇదీ
ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణపై కేసు
ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా
నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ
ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)
మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)