హైద్రాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు: ఇద్దరు అరెస్ట్
న్యూ ఈయర్ సందర్భంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు యత్నిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్: న్యూ ఈయర్ సందర్భంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు యత్నిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
సోమవారం నాడు హైద్రాబాద్లో హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడారు.న్యూ ఇయర్ పార్టీ కోసం డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు.
ఈ ముఠాను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సీపీ అభినందించారు. సుమారు రూ. 10 లక్షల విలువైన 89 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకొన్నట్టుగా ఆయన తెలిపారు.
ఒక్క గ్రాము కొకైన్ను పకడ్బందీగా ప్యాక్ చేశారు. ఇలా సుమారు రూ.10 లక్షల విలువైన కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
నిందితుల నుండి స్వాధీనం చేసుకొన్న కొకైన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పోలీసులు పంపారు. ల్యాబ్ రిపోర్ట్లో కూడ మత్తుపదార్థాలుగా సర్టిఫై చేసినట్టు ఆయన తెలిపారు.
న్యూ ఈయర్ సందర్భంగా యువతకు సరఫరా చేసేందుకు గాను ఈ డ్రగ్స్ను హైద్రాబాద్కు ఈ ముఠా తీసుకొచ్చిందని సీపీ తెలిపారు.న్యూ ఈయర్ సందర్భంగా పబ్లు, రెస్టారెంట్లలో కూడ మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.మరో వైపు ఈ ముఠా ఎవరెవరికి ఈ డ్రగ్స్ను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.