ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందారు.ఈ ఏనుగును బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీస్తుంది. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యేను కాంగ్రెస్లోకి ఆహ్వానించింది.
రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ అభ్యర్ధిని మార్చింది. స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా అభ్యర్ధిని మార్చాల్సి వచ్చిందని జనసేన ప్రకటించింది.
ఏడాది పాటు తాగునీటికి సరిపోను నాగార్జునసాగర్ లో నీళ్లున్నా ఎందుకు ఉపయోగించుకోవడం లేదని కేటీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ ను ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కోరారు.
రైలులో ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్ గా టాయిలెట్ కు వెళ్లే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆటో ఎక్కారు.
చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎల్ నినో ప్రభావంతో జూన్ వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.