Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ పై కేసీఆర్ సర్కార్ ఉక్కుపాదం: హైద్రాబాద్ లో రెండు ప్రత్యేక విభాగాలు


తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు  అరికట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి  హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.

Telangana DGP Mahender Reddy To launch two special wings for Drugs
Author
Hyderabad, First Published Feb 9, 2022, 9:35 AM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం KCR ఆదేశాల మేరకు పోలీస్ శాఖ చర్యలు తీసుకొంటుంది. Hyderabad పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.  ఈ ప్రత్యేక విభాగాలను Telangana డీజీపీ Mahender reddy  బుధవారం నాడు  ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలో Drugs వాడకాన్ని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. . డ్రగ్స్ ఎవరు వాడినా కూడా ఉపేక్షించేది లేదని కేసీఆర్ ప్రకటించారు. ఏ పార్టీ వాళ్లు డ్రగ్స్ కేసులో ఉన్నా వదిలొద్దని ఆయన పోలీసులను ఆదేశించారు. నేరస్తులను కాపాడేందుకు ప్రజా ప్రతినిధుల సిఫారసులను తిరస్కరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. వెయ్యి మందితో కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్టుగా కేసీఆర్ ప్రకటించారు. డ్రగ్స్ నియంత్రణకు విధి విధానాలను రూపొందించామన్నారు. 

దేశంలోని పలు నగరాలకు  డ్రగ్స్ సరఫరా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ నైజీరియన్ Tony సహా ఏడుగురు వ్యాపారవేత్తలను హైద్రాబాద్ పోలీసులు ఈ నెల 20వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుల నుండి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. డ్రగ్స్ కేసులో విచారణ సమయంలో హవాలా, మనీలాండరింగ్ జరిగిందని పోలీసులు గుర్తించారు. మనీలాండరింగ్, హవాలాను నిగ్గు తేల్చాలని Enforcement Directorateకి హైద్రాబాద్ పోలీసులు ఈ నెల 24న  లేఖ రాశారు.

టోని ప్రధాన అనుచరుడు ఇమ్రాన్ బాబు షేక్ ను గతంలోనే అరెస్ట్ చేశారు. దీంతో  టోని జాగ్రత్తలు తీసుకొన్నారు. ఇమ్రాన్ తో చేసిన చాటింగ్ ను టోని డిలీట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.  2013లో  నైజీరియా నుండి టోని ఇండియాకు వచ్చిన టోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీవీ ఆనంద్ వివరించారు.ముంబైలోని ఈస్ట్ అంథేరిలో  టోని నివసిస్తున్నాడని పోలీసులు చెప్పారు.

 డ్రగ్స్ సరఫరా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ నైజీరియన్ టోని సహా ఏడుగురు వ్యాపారవేత్తలను హైద్రాబాద్ పోలీసులు ఈ ఏడాది జనవరి 20వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుల నుండి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. డ్రగ్స్ కేసులో విచారణ సమయంలో హవాలా, మనీలాండరింగ్ జరిగిందని పోలీసులు గుర్తించారు. మనీలాండరింగ్, హవాలాను నిగ్గు తేల్చాలని ఈడీకి హైద్రాబాద్ పోలీసులు జనవరి  24న  లేఖ రాశారు.

టోని ప్రధాన అనుచరుడు ఇమ్రాన్ బాబు షేక్ ను గతంలోనే అరెస్ట్ చేశారు. దీంతో  Tony జాగ్రత్తలు తీసుకొన్నారు. ఇమ్రాన్ తో చేసిన చాటింగ్ ను టోని డిలీట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.  2013లో  నైజీరియా నుండి టోని ఇండియాకు వచ్చిన టోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీవీ ఆనంద్ వివరించారు.ముంబైలోని ఈస్ట్ అంథేరిలో  టోని నివసిస్తున్నాడని పోలీసులు చెప్పారు.

టోని 60 మంది యువకులతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్ లోని OYO హోటల్  రూమ్ ను అద్దెకు తీసుకొని డ్రగ్స్ ను సరఫరా చేసేవాడని పోలీసులు  కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.వ్యాపారులకు గ్రాము కొకైన్ ను రూ. 20 వేలకు టోని విక్రయించేవాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. గత నాలుగేళ్లుగా టోని వద్ద వ్యాపారులు డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

నాలుగు సంవత్సరాల నుంచి  వ్యాపారవేత్త నిరంజన్ జైన్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ వాడుతున్నాడు.30 సార్లు టోనీ దగ్గర్నుంచి   నిరంజన్ జైన్ డ్రగ్స్  తేప్పించుకున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ  నిరంజన్ జైన్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని పోలీసులు చెప్పారు.పలు ప్రభుత్వ ప్రాజెక్టు పనులను నిరంజన్ కాంట్రాక్టు తీసుకొన్నాడు.నిరంజన్ జైన్ ఇచ్చే పార్టీలో కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.పాత బస్తీ కేంద్రం గా నడుస్తున్న  మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. మసాలా దినుసుల తో  ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఆనంద్ కూడా ఈ కేసులో అరెస్టయ్యాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios