రాజకీయాల పరంగానూ శివమొగ్గకు మంచి గుర్తింపే వుంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కుటుంబానికి షిమోగా పెట్టని కోట అని విశ్లేషకులు చెబుతుంటారు. కేజీ వడయార్, టీవీ చంద్రశేఖరప్ప, ఎస్ బంగారప్ప , యడియూరప్ప వంటి హేమాహేమీలు షిమోగా నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. వీరశైవ లింగాయత్ సామాజికవర్గం ఈ సెగ్మెంట్లో బలంగా వుంది. 1952లో ఏర్పడిన షిమోగా లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ 10 సార్లు, బీజేపీ 6 సార్లు, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, కర్ణాటక వికాస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఒక్కోసారి విజయం సాధించాయి. యడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర , కన్నడ అగ్రకథానాయకుడు శివరాజ్ కుమార్ సతీమణి, సీనియర్ రాజకీయవేత్త , మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పలు షిమోగా నుంచే పోటీ చేస్తున్నారు.
NATIONAL Apr 1, 2024, 7:59 PM IST
వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. పెన్షన్లు ఇవ్వకుండా ఆపటం చంద్రబాబు వల్ల కాదని .. గతంలో ఇంటింటికి పింఛను కార్యక్రమాన్ని ఆయన చేపట్టారా అని నాని నిలదీశారు. నిమ్మగడ్డకు ఎవరెవరితో సంబంధాలున్నాయో అందరికీ తెలుసునని పేర్నినాని దుయ్యబట్టారు.
Andhra Pradesh Apr 1, 2024, 7:05 PM IST
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో వున్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం జూన్ 2కు వాయిదా వేసింది.
Telangana Apr 1, 2024, 6:03 PM IST
రాజకీయ స్వార్ధం కోసం సీఎం జగన్.. పింఛనర్ల పొట్టకొట్టారని.. జనసేన బీజేపీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ నేతలు కలెక్టర్లను కలిసి పింఛన్ సొమ్ము అందేలా చొరవ చూపాలని చంద్రబాబు ఆదేశించారు. కూటమి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను ప్రకటిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.
Andhra Pradesh Apr 1, 2024, 5:03 PM IST
రాజకీయంగానూ మైసూరుకు ఎంతో ప్రాధాన్యత వుంది. పాత మైసూరు ప్రాంతంపై పట్టు కోసం నేటికీ పార్టీల మధ్య పోరు నడుస్తూనే వుంటుంది. కర్ణాటకలోని వీఐపీ సెగ్మెంట్లలో మైసూర్ ఒకటి. ఈ లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మైసూర్ నుంచి హస్తం పార్టీ 12 సార్లు, బీజేపీ 4 సార్లు, కేఎంపీపీ ఒకసారి విజయం సాధించాయి. మైసూరు పరిధిలోని 8 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 5 చోట్ల, జనతాదళ్ 2 చోట్ల, బీజేపీ ఒకచోట విజయం సాధించాయి. మైసూరు మహారాజా యదువీర్ కృష్ణదత్త వడియార్ ఈ ఏడాది లోక్సభ ఎన్నికల ద్వారా రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహా స్థానంలో బీజేపీ ఆయనను మైసూర్ సెగ్మెంట్ నుంచి అభ్యర్ధిగా నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ఎం లక్ష్మణ్ పోటీ చేస్తున్నారు.
NATIONAL Apr 1, 2024, 4:16 PM IST
మరికొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ శుక్రవారం ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు.
Entertainment Apr 1, 2024, 11:32 AM IST
శివనంజప్ప, ఎస్ఎం కృష్ణ, అంబరీష్, సుమలత, రమ్య, మాదే గౌడ వంటి సెలబ్రెటీలు మాండ్య నుంచి ఎంపీలుగా గెలుపొందారు. శివనంజప్ప 4 సార్లు, అంబరీష్ 3 సార్లు, ఎస్ ఎం కృష్ణ మూడు సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 13 సార్లు, జేడీఎస్ 5 సార్లు, జనతా పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, స్వతంత్రులు ఒక్కోసారి విజయం సాధించారు. మాండ్య, మైసూరు జిల్లాల్లో విస్తరించి వుంది. ఈ సెగ్మెంట్ పరిధిలో మాలవల్లి, మద్దూర్, మేల్కోటే, మాండ్య, శ్రీరంగపట్టణ, నాగమంగళ, కృష్ణరాజపేట, కృష్ణరాజనగర్ అసెంబ్లీ స్థానాలున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి జేడీఎస్ తరపున ఇక్కడి నుంచి బరిలో దిగారు. జేడీఎస్కు, దేవెగౌడ కుటుంబానికి మాండ్య ప్రాంతంలో మంచి పట్టుంది. ఒక్కలిగ సామాజికవర్గానిదే మాండ్యలో ఆధిపత్యం. ఇక కాంగ్రెస్ నుంచి స్టార్ చంద్రు బరిలో దిగనున్నారు.
NATIONAL Mar 30, 2024, 10:15 PM IST
2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా రాజాం (ఎస్సీ) ఏర్పాటైంది. రాజాం నియోజకవర్గం ఏర్పడ్డాక 2009లో కాంగ్రెస్ పార్టీ, 2014, 2019లలో వైసీపీలు గెలుపొందాయి. 2019లో కాంగ్రెస్ తరపున కొండ్రు మురళి.. 2014, 2019లలో వైసీపీ తరపున కంబాల జోగులు విజయం సాధించారు. రాజాంలో హ్యాట్రిక్ నమోదు చేయాలని వైపీపీ అధినేత , సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో వున్నారు. అయితే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కంబాల జోగులను కాదని, డాక్టర్ తేలే రాజేష్ను అభ్యర్ధిగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి విషయానికి వస్తే.. రాజాం నుంచి టీడీపీ పోటీ చేయనుంది. కానీ అభ్యర్ధి ఎవరన్నది ఇంత వరకు ప్రకటించలేదు .
Andhra Pradesh Mar 30, 2024, 8:51 PM IST
దేశంలో గిరిజనులు అధికంగా వుండే సెగ్మెంట్లలో పాలకొండ కూడా ఒకటి. పాలకొండ ప్రాంతానికి బ్రిటీష్ హయాం నుంచి చారిత్రక నేపథ్యం వుంది. పాలకొండలో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 4 సార్లు, స్వతంత్ర పార్టీ, ఇండిపెండెంట్లు, వైసీపీ రెండేసి సార్లు, జనతా పార్టీ ఒకసారి విజయం సాధించాయి. మరోసారి ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని కళావతి కృతనిశ్చయంతో వున్నారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమి విషయానికి వస్తే.. పాలకొండ నుంచి జనసేన అభ్యర్ధి పోటీ చేయనున్నారు. కానీ నేటి వరకు ఇక్కడ అభ్యర్ధిని ప్రకటించలేదు. నాగేశ్వరరావుకు మంగళగిరి నుంచి పిలుపురావడంతో ఆయన పోటీ ఖాయమని అంతా భావించారు.
Andhra Pradesh Mar 30, 2024, 7:53 PM IST
150 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటగిరి చీరలను 17వ శతాబ్ధంలోనే నెల్లూరుకు చెందిన వెలుగుగోటి రాజవంశీయులు ధరించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి వెంకటగిరి నుంచి ప్రాతినిథ్యం వహించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇదే నియోజకవర్గంలోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. హస్తం పార్టీ 9 సార్లు, టీడీపీ 5 సార్లు, ఇండిపెండెంట్ , వైసీపీ ఒకసారి గెలిచాయి. వెంకటగిరిలో విభిన్న పరిస్ధితులు నెలకొన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించారు. వైసీపీ అభ్యర్ధిగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని ప్రకటించారు జగన్. కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియాకు టికెట్ కేటాయించారు చంద్రబాబు.
Andhra Pradesh Mar 30, 2024, 5:40 PM IST
ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో వున్న సూళ్లూరుపేట.. జిల్లాల పునర్విభజన తర్వాత తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది. సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,796 మంది. వీరిలో పురుషులు 1,15,896 మంది.. మహిళలు 1,21,878 మంది. భారత అంతరిక్ష పరిశోధనా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 5 సార్లు , వైసీపీ రెండు సార్లు గెలిచాయి. రెడ్డి, శెట్టి బలిజ, దళిత వర్గాల ఓటు బ్యాంక్ సూళ్లూరుపేటలో అధికం. సూళ్లూరుపేటలో పట్టును కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ కృతి నిశ్చయంతో వున్నారు. మరోసారి సంజీవయ్యకే టికెట్ కేటాయించారు. నెలవల విజయశ్రీకి సూళ్లూరుపేట టికెట్ కేటాయించారు చంద్రబాబు.
Andhra Pradesh Mar 30, 2024, 3:41 PM IST
దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ సతీమణే ఈ మేనకా గాంధీ. 17 ఏళ్ల వయసులో మోడలింగ్లో తన తొలి బ్రేక్ను పొంది.. బాంబే డైయింగ్లో పనిచేశారు. సంజయ్ గాంధీని తొలిసారిగా డిసెంబర్ 14, 1973న తన మామ మేజర్ జనరల్ కపూర్ కాక్టెయిల్ పార్టీలో కలుసుకున్నారు. 1980లో సంజయ్ గాంధీ ఓ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అప్పుడు మేనకా గాంధీకి కేవలం 23 ఏళ్లు మాత్రమే. 1983లో మేనకా గాంధీని ప్రధాని అధికారిక నివాసం నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఇందిర ఆదేశించారు. మేనకా గాంధీ అజంగఢ్కు చెందిన రాజకీయ నాయకుడు అక్బర్ అహ్మద్తో కలిసి ‘‘ సంజయ్ విచార్ మంచ్ ’’ను ప్రారంభించారు. 1988లో జనతాదళ్, 1999లో బీజేపీలో చేరారు.
NATIONAL Mar 29, 2024, 9:49 PM IST
కాఫీ, టీ, కొక్కో, నల్ల మిరియాలు, వెల్లుల్లి పంటలకు వయనాడ్ కేంద్రం. పచ్చని ప్రకృతే కాదు.. ఇక్కడి రాజకీయాలు కూడా హాట్ హాట్గా సాగుతాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019లో ఇక్కడి నుంచి పోటీ చేయడంతో వయనాడ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 4 చోట్ల ముస్లింల ప్రాబల్యం అధికం. వారు తొలి నుంచి కాంగ్రెస్ వైపే వుండటంతో ఆ పార్టీ సునాయాసంగా గెలుస్తోంది. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వయనాడ్ పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభా స్థానాల్లో కాంగ్రెస్ 3, సీపీఎం 2, ఐయూఎంఎల్, ఎల్డీఎఫ్ తలో ఒక చోట విజయం సాధించాయి. రాహుల్ గాంధీ మరోసారి బరిలో దిగుతున్నారు. సీపీఐ తరపున అన్నీ రాజా, బీజేపీ తరపున కే సురేంద్రన్ పోటీ చేస్తున్నారు.
NATIONAL Mar 29, 2024, 8:58 PM IST
బీవీ కేస్కర్ , గోవింద్ మాలవీయ, రాజ్ కరణ్ సింగ్ వంటి దిగ్గజాలు సుల్తాన్పూర్ నుంచి గెలుపొందారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కోడలు మేనకా గాంధీ , మనవడు వరుణ్ గాంధీలు ఇక్కడ ఎంపీలుగా గెలిచారు. సుల్తాన్పూర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వుండేది. హస్తం పార్టీ 8 సార్లు, బీజేపీ 5 సార్లు, బీఎస్పీ 2 సార్లు, జనతా పార్టీ, జనతాదళ్లు ఒక్కోసారి ఇక్కడ గెలుపొందాయి. ఈ లోక్సభ స్థానంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 21.29 శాతం, షెడ్యూల్డ్ తెగల జనాభా 0.02 శాతం . సుల్తాన్పూర్ స్థానంలో ముస్లిం, రాజ్పుత్, బ్రాహ్మణ ఓటర్లు బలంగా వుండి అభ్యర్ధుల గెలుపొటములను నిర్దేశిస్తున్నారు. మేనకా గాంధీని బీజేపీ మరోసారి అభ్యర్ధిగా ప్రకటించింది. విపక్ష ఇండియా కూటమి తరపున సమాజ్వాదీ పార్టీ సుల్తాన్పూర్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
NATIONAL Mar 29, 2024, 7:31 PM IST
విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
Entertainment Mar 29, 2024, 5:38 PM IST