మండే ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ చల్ల చల్లని నీళ్లను తాగుతుంటారు. ఇది చాలా కామన్. కానీ చల్ల నీళ్లను ఎక్కువగా తాగితే మాత్రం మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే?
Health Apr 20, 2024, 9:50 AM IST
చాలా మందికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వివారంగా అనిపిస్తుంది. వాంతులు కూడా అవుతుంటాయి. చిన్న పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇలా అవుతుంది. అయితే కొన్ని చిట్కాలతో వాంతులు కాకుండా చూసుకోవచ్చు. అదెలాగంటే?
Health Apr 7, 2024, 10:49 AM IST
టాలీవుడ్లో సింగర్స్ లో చాలా మంది స్టార్ సింగర్స్ గా రాణిస్తున్నారు. అయితే వీరికి అందే పారితోషికాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఎవరు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా?
Entertainment Apr 6, 2024, 2:01 PM IST
రాష్ట్ర రాజధాని బెంగళూరు తర్వాత బెళగావికి ప్రాధాన్యత వుంది. బెళగావి లోక్సభ నియోజకవర్గం కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్రమంత్రులుగా పనిచేసన బాబాగౌడ పాటిల్, సురేష్ అనగాడిలు బెళగావి నుంచి ప్రాతినిథ్యం వహించారు. బెళగావి లోక్సభ నియోజకవర్గం పరిధిలో అరభావి, గోకక్, బెళగావి ఉత్తర్, బెళగావి దక్షిణ్, బెళగావి రూరల్, బెయిల్హోంగల్, సౌండట్టి ఎల్లమ్మ, రాందుర్గ్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీరశైవ లింగాయత్, మరాఠాలు ఇక్కడ బలమైన శక్తులుగా వున్నారు. బెళగావిలో కాంగ్రెస్ పార్టీ 11 సార్లు, బీజేపీ 6 సార్లు, జనతాదళ్ ఒకసారి విజయం సాధించాయి. కిత్తూరు కర్ణాటక ప్రాంతంలో కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ను బీజేపీ తన అభ్యర్ధిగా బరిలో దించింది. తన అభ్యర్ధిగా మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్ను కాంగ్రెస్ ప్రకటించింది.
NATIONAL Apr 4, 2024, 8:35 PM IST
నాలుగు సార్లు వరుస విజయాలు సాధించిన ప్రహ్లాద్ జోషి .. 2024 లోక్సభ ఎన్నికల్లో మరోసారి గెలిచి ఐదోసారి పార్లమెంట్లో అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో వున్నారు. బీజేపీకి వీరవిధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు . ఈద్గా మైదాన్లో జాతీయ జెండాను ఎగురవేడంతో పాటు 1992 నుంచి 1994 వరకు హుబ్లీలో ‘‘సేవ్ కాశ్మీర్ ఉద్యమం ’’ వంటి కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో ధార్వాడ్ లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రహ్లాద్ జోషినే గెలుస్తూ వస్తున్నారు. ఐదోసారి విజయం సాధించాలని భావిస్తున్న ప్రహ్లాద్ జోషి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
NATIONAL Apr 4, 2024, 7:10 PM IST
వీరశైవ లింగాయత్ సామాజిక వర్గంతో పాటు మరాఠాల సంస్కృతి, ఆచార వ్యవహారాలు ధార్వాడ్ ప్రాంతంలో కనిపిస్తాయి. ఉత్తర కర్ణాటకలో అతిపెద్ద నగరాలైన హుబ్లీ- ధార్వాడ్ ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తోంది. ఎంతోమంది ఉద్ధండులైన నేతలను, పారిశ్రామికవేత్తలను, కళాకారులను, సాహితవేత్తలను ఈ గడ్డ దేశానికి అందించింది. 2009లో ధార్వాడ్ లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రహ్లాద్ జోషినే గెలుస్తూ వస్తున్నారు. ధార్వాడ్ లోక్సభ స్థానంలో నవలగుంద, కుందగోల్, ధార్వాడ్, హుబ్లీ ధార్వాడ్ ఈస్ట్ (ఎస్సీ), హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్, హుబ్లీ ధార్వాడ్ వెస్ట్, కల్ఘాట్గి, షిగ్గాన్ అసెంబ్లీ స్థానాలున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మరోసారి టికెట్ కేటాయించారు. కాంగ్రెస్ విషయానికి వస్తే.. వినోద్ అసూతిని బరిలో దించింది.
NATIONAL Apr 4, 2024, 5:27 PM IST
పార్టీని, ప్రభుత్వాన్ని ఎన్నికల వరకు సమర్ధవంతంగా నెట్టుకొచ్చిన బసవరాజ్ బొమ్మై మరోసారి సీఎం అవుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బొమ్మై తండ్రి ఎస్ఆర్ బొమ్మై జనతా పరివార్కు చెందిన వ్యక్తి. 1988-89 మధ్యకాలంలో కర్ణాటకకు 11వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జనతాదళ్తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు బసవరాజ్ బొమ్మై . జనతాదళ్ (యునైటెడ్) నుంచి నిష్క్రమించి ఫిబ్రవరి 2008లో బీజేపీలో చేరారు. కోవిడ్ సెకండ్ వేవ్లో హోంమంత్రిగా వున్న బసవరాజ్.. తన నివాసాన్నే కోవిడ్ కేర్ సెంటర్ (సీసీసీ)గా మార్చారు. దేశంలో తొలిసారిగా షిగ్గావ్ ప్రాంతంలో 100 శాతం నీటిపారుదల ప్రాజెక్ట్ను విజయవంతంగా ఏర్పాటు చేశారు.
NATIONAL Apr 4, 2024, 3:26 PM IST
నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో వున్న ధార్వాడ్ సౌత్ లోక్సభ స్థానాన్ని రద్దు చేసి 2009లో కొత్తగా హవేరి పార్లమెంట్ స్థానాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ధార్వాడ్ నార్త్ పార్లమెంట్, బాగల్ లోక్సభ పరిధిలోని గదగ్, రోన్ నియోజకవర్గాలను హవేరి పార్లమెంట్ స్థానంలో కలిపారు. పూర్వపు ధార్వాడ్ సౌత్ లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 1999 వరకు కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీ ఇక్కడ గెలవలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 2024 పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే.. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని బీజేపీ తన అభ్యర్ధిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఏజీ మథ్ బరిలో దిగుతున్నారు.
NATIONAL Apr 2, 2024, 9:54 PM IST
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 30 ఏళ్ల వయసులోనే ఎంపీగా గెలిచిన ఆయన.. తాత, తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 2014లో బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యారు. 2014 లోక్సభ ఎన్నికల్లో తన తాతన దేవెగౌడకు సహాయం చేయడానికి ప్రజ్వల్.. ఆస్ట్రేలియాలో తన ఎంటెక్ కోర్సును మధ్యలోనే వదిలేశాడు. 2019 లోక్సభ ఎన్నికల్లో మనవడి పొలిటికల్ ఎంట్రీ కోసం దేవెగౌడ తన కంచుకోట హసన్ను వదులుకుని తుమకూరు నుంచి పోటీ చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మరోసారి హసన్ బరిలో నిలిచిన ప్రజ్వల్ తన ఆస్తులను రూ.40.85 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
NATIONAL Apr 2, 2024, 9:14 PM IST
రాజకీయంగానూ హసన్కు ఎంతో ప్రాధాన్యత వుంది. మాజీ ప్రధాని , దేవెగౌడ కుటుంబానికి హసన్ కంచుకోట వంటిదని చెప్పవచ్చు. 1991 నుంచి నేటి వరకు రెండు సార్లు తప్పించి దేవెగౌడ కుటుంబమే హసన్ లోక్సభ స్థానంలో గెలుస్తూ వస్తోంది. దేవెగౌడ హసన్ నుంచి ఐదు సార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, జనతాదళ్ 3 సార్లు, జేడీఎస్ 4 సార్లు, జనతా పార్టీ, స్వతంత్ర పార్టీ ఒక్కొక్కసారి హసన్లో విజయం సాధించాయి. జేడీఎస్ నుంచి మరోసారి ప్రజ్వల్ రేవణ్ణ బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ పటేల్ను బరిలో దించింది.
NATIONAL Apr 2, 2024, 7:40 PM IST
తన పార్టీకి తక్కువ సీట్లే వచ్చినా పలుమార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టి లక్కీ పొలిటిషీయన్గా కుమారస్వామి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ చిత్రాలను పంపిణీ చేసి మంచి లాభాలను అందుకున్న కుమారస్వామి అనంతరం చన్నాంబిక ఫిల్మ్స్ను స్థాపించి ఎన్నో విజయవంతమూన చిత్రాలను నిర్మించారు. 1996 లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తండ్రి దేవెగౌడ అనుమతి లేకుండా బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. 2006 నుంచి 2007 వరకు తొలిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. మే 28, 2018న కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేశారు
NATIONAL Apr 2, 2024, 6:22 PM IST
మైసూరు మహారాజా యదువీర్ కృష్ణదత్త వడియార్ ఈ ఏడాది లోక్సభ ఎన్నికల ద్వారా రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ సింహా స్థానంలో బీజేపీ ఆయనను మైసూర్ సెగ్మెంట్ నుంచి అభ్యర్ధిగా నిలబెట్టింది. 31 ఏళ్ల యదువీర్ అమెరికాలో చదువుకున్నారు. 2015 మే 28న వడియార్ రాజవంశానికి 27వ రాజుగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. పాత మైసూరు ప్రాంతంలో (దక్షిణ కర్ణాటక) రాజకుటుంబానికి ఇప్పటికీ గణనీయమైన గౌరవం, అభిమానం వున్నాయి. ఈ కారణంగా కాంగ్రెస్ దూకుడుకు యదువీర్తో కళ్లెం వేయొచ్చని కమలనాథులు భావిస్తున్నారు.
NATIONAL Apr 2, 2024, 4:43 PM IST
బళ్లారిలో జరిగే చిన్న ఘటనైనా కర్ణాటకలో పెను ప్రభావం చూపుతుందనడంలో అతిశయోక్తి లేదు. రాయలసీమకు ఆనుకుని వుండే ఈ నగరం పేరుకు కర్ణాటకలో వున్నా 90 శాతం మంది తెలుగువారే. 1952 నుంచి కాంగ్రెస్ కంచుకోటగా వున్న బళ్లారిలో మొట్టమొదటి సారిగా కాషాయ జెండా రెపరెపలాడటానికి కారణం గాలి సోదరులు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్లు బళ్లారి నుంచి బరిలో దిగారు. గాలి జనార్థన రెడ్డి అనుచరుడు, సీనియర్ నేత బీ శ్రీరాములను ఎంపీ అభ్యర్ధిగా బరిలో దించింది బీజేపీ. కాంగ్రెస్ విషయానికి వస్తే.. మాజీ మంత్రి తుకారాంను అభ్యర్ధిగా ప్రకటించింది.
NATIONAL Apr 2, 2024, 3:33 PM IST
దశాబ్థాల విరామం తర్వాత కచ్చతీవు సమస్యను లేవనెత్తడం న్యూఢిల్లీకి సంబంధించిన విషయం అని , అది కొలంబోది కాదని, శ్రీలంక ప్రభుత్వంలోని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ఆసియానెట్తో మాట్లాడుతూ చెప్పారు. చారిత్రక వాస్తవాల ఆధారంగా ఈ ఒప్పందం 1974లో సంతకం చేయబడి సెటిలైందని వివరించారు.
INTERNATIONAL Apr 1, 2024, 9:46 PM IST
ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు
NATIONAL Apr 1, 2024, 9:08 PM IST