KCR: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మోదీ కూల్చే ప్రయత్నం చేశారన్న కేసీఆర్ అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ కున్న సీట్లు చూస్తే బీజేపీ కొనడం ఎంతసేపు అని వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. అలాగే.. కాంగ్రెస్ నుంచి ఓ కీలక నేత 20 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని చెప్పాడని, కానీ, తాను వద్దని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎన్నికల వేళ కేసీఆర్ సంచలన వ్యాఖ్యల వెనుక అంతర్యామిదేనా?
Telangana Apr 18, 2024, 7:34 PM IST
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంది. ఆమెకు సంబంధించిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై గురువారం ( నేడు ) రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మరికొద్ది సేపట్లో కవిత బెయిల్ పిటిషన్ పైన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది.
Telangana Apr 4, 2024, 4:08 PM IST
Delhi Liquor Scam: ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీని సవరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని, లైసెన్స్దారులకు ప్రయోజనాలను కల్పించారని సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఇందులో లైసెన్స్ ఫీజు మినహాయింపు లేదా తగ్గించబడింది. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.144.36 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కవితలను అరెస్ట్ చేశారు. స్కామ్ ఏంటో తెలుసా...
NATIONAL Apr 2, 2024, 4:07 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టులో దాఖలైన పిటిషిన్ పై సోమవారం వాదనలు జరిగాయి. కవిత తరుఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించారు. అయితే ఈ విచారణను కోర్టు ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది.
Telangana Apr 2, 2024, 12:08 PM IST
ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలనే పదే పదే అడుగుతున్నారని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తన అరెస్టు ఒక కుట్ర అని ఆమె ఆరోపించారు.
Telangana Mar 23, 2024, 4:35 PM IST
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నేడు దేశ వ్యాప్త నిరసనలు చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. దేశంలోని ఉన్న అన్ని బీజేపీ కార్యాలయాల ఎదుట ఆందోళన జరపాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.
NATIONAL Mar 22, 2024, 8:05 AM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఎదుట హాజరు అవుతానని, కానీ ఆ దర్యాప్తు సంస్థ తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై కోర్టు నేడు విచారణ జరపనుంది.
NATIONAL Mar 21, 2024, 10:49 AM IST
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పై, బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. ఈడీ బీజీపీకి పొలిటికల్ వింగ్ ల పని చేస్తోందని ఆరోపించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఒక కుట్ర అని విమర్శించింది.
NATIONAL Mar 19, 2024, 12:14 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టు అయిన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు రిమాండ్ విధించింది. ఆమెను వారం రోజుల పాటు ఈడీ అధికారుల కస్టడీకి అప్పగించింది.
Telangana Mar 16, 2024, 6:46 PM IST
Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులోకి వెళ్తున్న క్రమంలో కవిత మాట్లాడుతూ 'తనది అక్రమ అరెస్టు' అంటూ కామెంట్ చేశారు.
Telangana Mar 16, 2024, 11:47 AM IST
Kavitha’s arrest - KTR : ప్రస్తుతం రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కారుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Cricket Mar 16, 2024, 9:56 AM IST
Excise policy case- Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు రాత్రి ఢిల్లీకి తరలించారు. రాత్రి 8.55కి ఫ్లైట్ బుక్ చేయగా, కవితను తీసుకెళ్లే రూట్ ను పోలీసులు క్లియర్ గా ఉంచారు. కోర్టులో ఈడీ విచారణను కోరే అవకాశముంది.
Telangana Mar 16, 2024, 8:44 AM IST
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ (delhi liquor scam) కేసులో ఈడీ (Enforcement Directorate) ఇచ్చిన సమన్లను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvindh Kejriwal) పాటించడం లేదని ఆ దర్యాప్తు సంస్థ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో నేడు కచ్చితంగా కోర్టుకు హాజరుకావాల్సిందే అని కోర్టు ఆదేశించడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. దీంతో కోర్టు ఆయన రిక్వెస్ట్ ను అంగీకరించింది.
NATIONAL Feb 17, 2024, 1:05 PM IST
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (delhi cm arvind kejriwal)ను లోక్ సభ ఎన్నికల (lok sabha elections 2024)ప్రచారం నుంచి తప్పించేందుకే బీజేపీ (bjp) ఈడీ (ED)ని దుర్వినియోగం చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party)ఆరోపించింది. కేజ్రీవాల్ మద్యం పాలసీ స్కామ్ కేసు (liquor scam case-delhi)లో నిందితుడిగా లేరని, మరి అలాంటప్పుడు ఈడీ సమన్లు (ED summonses) ఎందుకు పంపించిందని ప్రశ్నించింది.
NATIONAL Jan 18, 2024, 2:06 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు ఇవాళ కూడ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దూరంగా ఉండననున్నారు. ఇవాళ విచారణకు రావాలని ఈడీ అధికారులు కేజ్రీవాల్ కు నోటీస్ పంపిన విషయం తెలిసిందే.
NATIONAL Jan 3, 2024, 9:27 AM IST