Lok Sabha Elections 2024 Phase 2: ఏప్రిల్ 26న రెండవ దశ లోక్‌సభ ఎన్నికలలో 13 రాష్ట్రాల్లోని 89 నియోజకవర్గాలలో ఓటింగ్ జ‌రిగింది. త్రిపుర‌లో 76.23 శాతం ఓటింగ్ న‌మోదైంది. కర్ణాటకలోని హున్సూరులో 91 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. 

Lok Sabha Elections 2024 Phase 2: ఏప్రిల్ 19న భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి, మొదటి దశలో 109 నియోజకవర్గాలకు ఎన్నికలు జ‌రిగాయి. 13 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 89 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ జ‌రిగింది. ఏప్రిల్ 19న ప్రారంభమైన ఓటింగ్ జూన్ 1 వరకు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రాత్రి 7 గంటల వరకు నమోదైన ఓటింగ్ 60.98 శాతంగా ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

రెండో ద‌శ పోలింగ్ జ‌రిగిన 13 రాష్ట్రాల్లో పోలింగ్ శాతం ఇలా.. (సాయంత్రం 5 గంటల వరకు..)

మ‌హారాష్ట్ర : 53.5 శాతం 
మణిపూర్ : 76.06 శాతం 
రాజస్థాన్ : 59.19 శాతం 
త్రిపుర : 76.23 శాతం 
ఉత్త‌రప్ర‌దేశ్ : 52.64 శాతం 
పశ్చిమ బెంగాల్ : 71.04 శాతం

జ‌మ్మూకాశ్మీర్ : 67.22 శాతం 
క‌ర్ణాటక : 63.9 శాతం 
కేరళ : 63.97 శాతం 
మ‌ధ్య ప్ర‌దేశ్ : 54.83 శాతం

కర్ణాటక : 63.9 శాతం 
అస్సాం : 70.66 శాతం 
బీహార్ : 53.03 శాతం 
ఛత్తీస్‌గఢ్ : 72.13 శాతం


కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, హేమమాలిని సహా మొత్తం 1210 మంది అభ్యర్థులు రెండో దశ ఎన్నికల్లో బరిలో నిలిచారు. లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో 'డ్రీమ్ గర్ల్' హేమ మాలిని అత్యంత ధనవంతుల అభ్యర్థిగా మూడో స్థానంలో నిలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల దశ 2 కోసం 13 రాష్ట్రాల్లో 88 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం 2,633 నామినేషన్‌లను స్వీకరించింది. ఎన్నికల సంఘం ఒక పత్రికా ప్రకటనలో, “2024 లోక్‌సభ ఎన్నికల 2వ దశ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 12 రాష్ట్రాలు/యూటీల నుండి 1,206 మంది అభ్యర్థులతో పాటు ఔటర్ మణిపూర్ PC నుండి 4 మంది అభ్యర్థులు ఉన్నారు. 12లో 88 PCలకు మొత్తం 2,633 నామినేషన్లు దాఖలయ్యాయి" అని తెలిపింది. 

Scroll to load tweet…

PM MODI INTERVIEW - ఈడి, సిబిఐ దుర్వినియోగ ఆరోపణలపై మోదీ వివరణ