AP Cabinet Meet: ఈ నెల 31న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. అయితే, ఈ సమావేశంలో రాజధాని మార్పు, విశాఖ నుంచి పాలన కొనసాగించడం సహా పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. పలు సంక్షేమ పథకాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకకునే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Andhra Pradesh Oct 21, 2023, 2:04 PM IST
Amaravati: తప్పుడు హామీలు, ప్రతికూల ప్రచారాలకు ప్రజలు మోసపోవద్దనీ, ప్రజా అండదండలపైనే తాను ఆధారపడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే, టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు, తెలుగుదేశం అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు అవినీతి, ఇతర అవకతవకలను ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు.
Andhra Pradesh Oct 20, 2023, 6:01 AM IST
Amaravati: కుల గణనపై తీర్మానం చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లను ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అభినందించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్ లతో పాటు అధికార డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న తమిళనాడులో ఇప్పటికే బీసీ కుల గణన ప్రారంభమైందని తెలిపారు.
Andhra Pradesh Oct 18, 2023, 3:07 PM IST
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
Andhra Pradesh Oct 18, 2023, 1:23 PM IST
AP Skill Development Case: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టులో మంగళవారం కీలక విచారణ జరగనుంది. కాగా, రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్లను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర పోలీసు నేర దర్యాప్తు విభాగం (సీఐడీ) ఈ దశలో దర్యాప్తును అడ్డుకోవడం మంచిదికాదనీ, ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఆరోపణల తీవ్రతను, దర్యాప్తు ఆవశ్యకతను కోర్టుముందు ఎత్తిచూపింది.
Andhra Pradesh Oct 17, 2023, 10:38 AM IST
Amaravati: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు పీటీ వారెంట్ పై దర్యాప్తు చేయొద్దని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై సీఐడీ కౌంటర్ దాఖలు చేయగా తుది వాదనలు ఈ నెల 18వ తేదీకి వాయిదా పడ్డాయి. అయితే, చంద్రబాబు ఆరెస్టు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలను బీజేపీ సమర్థించబోదని బీజేపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి అన్నారు.
Andhra Pradesh Oct 16, 2023, 2:10 PM IST
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది.
Andhra Pradesh Oct 16, 2023, 1:28 PM IST
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.
Andhra Pradesh Oct 16, 2023, 12:02 PM IST
Amaravati: రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ముమ్మరంగా ప్రచారం మొదలపెట్టాయి. ఈ విషయంలో అధికార పార్టీ తమ ముందున్న అన్ని అంశాలను ఉపయోగించుకుంటుంది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అధినేత అరెస్టు, ఈ పార్టీ ఇతర నేతలపై అవినీతి కేసులు, పలు ఆరోపణలు రావడం అధికార పార్టీకి కాస్త అనుకూలించే విషయాలుగా మారాయి. ఇది క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితిని ఏర్పర్చింది. ఇదే సమయంలో ప్రస్తుతం ముందున్న జనసేనను టార్గెట్ చేసిన వైసీపీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన నాయకులు పవన్ పై విమర్శల దాడి చేస్తున్నారు.
Andhra Pradesh Oct 13, 2023, 2:01 PM IST
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజూ సీఐడి విచారణ ముగిసింది . హెరిటేజ్ ఫుడ్స్ భూముల కొనుగోలు, జీవోఎం నిర్ణయం, లోకేష్ పాత్రపై అధికారులు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.
Andhra Pradesh Oct 11, 2023, 5:29 PM IST
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఐడీ విచారణ ముగిసింది. రేపు మరోసారి సీఐడీ విచారణకు రావాల్సిందిగా లోకేష్ను ఆదేశించింది.
Andhra Pradesh Oct 10, 2023, 6:24 PM IST
Amaravati: వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు మళ్లీ సీఎంగా ఎందుకు ఎన్నుకోవాలని సీపీఐ ప్రశ్నించింది. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడింది. ఏపీ ప్రయోజనాలను జగన్ మోహన్ రెడ్డి సర్కారు బీజేపీకి తాకట్టు పెడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.
Andhra Pradesh Oct 10, 2023, 4:59 PM IST
Amaravati: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ముందే తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి లోకేష్ చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద సెప్టెంబర్ 30న టీడీపీ నేతకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇదిలావుండగా, ఇదే కేసుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణ అల్లుడు హైకోర్టును ఆశ్రయించారు.
Andhra Pradesh Oct 10, 2023, 2:00 PM IST
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తూ ఏపీ సీఐడీ నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh Oct 10, 2023, 12:37 PM IST
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు నారా లోకేష్ హాజరయ్యారు. ఇవాళ ఉదయం 10 గంటల నుండి ఐదు గంటల వరకు లోకేష్ ను సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
Andhra Pradesh Oct 10, 2023, 10:08 AM IST