Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఎన్నికలు పేదలు-పెట్టుబడిదారులకు మధ్య జరిగే యుద్ధం.. : వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి

Amaravati: తప్పుడు హామీలు, ప్రతికూల ప్రచారాలకు ప్రజలు మోసపోవద్దనీ, ప్ర‌జా అండదండలపైనే తాను ఆధారపడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే, టీడీపీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు, తెలుగుదేశం అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు అవినీతి, ఇతర అవకతవకలను ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు.
 

AP elections are a battle between poor and Capitalists: AP Chief Minister Y.S. Jagan Mohan Reddy RMA
Author
First Published Oct 20, 2023, 6:01 AM IST

AP Chief Minister Y.S. Jagan Mohan Reddy: 2024 సార్వత్రిక ఎన్నికలను కులం చుట్టూ తిప్పాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రయత్నిస్తున్న‌ద‌ని వైఎస్ఆర్సీపీ అధినేత‌, ముఖ్యమంత్రి వైఎస్ జగ‌న్ మోహ‌న్  రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఆర్థిక వర్గాలు-పేదలు-ధనిక పెట్టుబడిదారుల మధ్య యుద్ధమ‌ని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) పథకం కింద నిధులు పంపిణీ చేసిన బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ యుద్ధం కులాల మధ్య కాదనీ, ఒకవైపు పేదవాడితో, మరోవైపు ఆధిపత్య పెట్టుబడిదారీ వర్గంతో వర్గయుద్ధమని అన్నారు.

రాబోయే ఎన్నికలు పేదల అనుకూల ప్రభుత్వానికి, పెట్టుబడిదారులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం లాంటివని అన్నారు. ఎన్నికల లబ్ది కోసం వివిధ రాజకీయ పార్టీల సమీకరణ గురించి మీరు అప్రమత్తంగా ఉండాలని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. నవరత్నాలు కార్యక్రమాల్లో అడుగడుగునా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అత్యంత నిరుపేద వర్గాలకు మార్గనిర్దేశం చేయగలిగామ‌నీ, ఆయా కార్యక్రమాల వల్ల లబ్ధి పొందారా లేదా అనేది మాత్రమే కొలమానంగా అంచనా వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "మీరు లబ్ది పొంది ఉంటే నాకు మద్దతుగా నిలవాలనీ, ప్రభుత్వానికి బలమైన మద్దతుదారులుగా నిలవాలని కోరుతున్నాను" అని పేర్కొన్నారు.

తప్పుడు హామీలు, ప్రతికూల ప్రచారాలకు ప్రజలు మోసపోవద్దనీ, ప్ర‌జా అండదండలపైనే తాను ఆధారపడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే, టీడీపీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు, తెలుగుదేశం అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు అవినీతి, ఇతర అవకతవకలను ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి అవినీతి, ఇతర దుర్వినియోగాలను ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పాలనలో ప్రజలు కనీస పౌర సేవల కోసం నానా అవస్థలు పడ్డారనీ, గత 52 నెలల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో సచివాల యం వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ సేవల ఫలాలను ప్రజలు ఇంటి వద్దకే చేరవేశారన్నారు.

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి, గత టీడీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న గుణాత్మక వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలని జగన్ మోహన్ రెడ్డి కోరారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఇళ్లు కట్టించడం గురించి టీడీపీ అధినేత ఏనాడూ ఆలోచించలేదని, వైసీపీ ప్రభుత్వం 20 వేల ఇళ్లను కేటాయించిందనీ, అందులో 8 వేల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. గృహనిర్మాణం, ఆరోగ్యం, సామాజిక సాధికారత, పేదరిక నిర్మూలనను 2014 నుంచి 2019 వరకు విస్మరించగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమ హయాంలోనే రూ.2.38 లక్షల కోట్ల విలువైన వివిధ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడం ద్వారా ఆర్థిక, సామాజిక సాధికారత సాధించారని జ‌గ‌న్ పేర్కొన్నారు. ప్రభుత్వం 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిందని, 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios