టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ... టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ, బ్యాట్స్మెన్గానే కాకుండా టెస్టుల్లో భారత జట్టును టాప్ ప్లేస్లో నిలిపిన కోహ్లీ... ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించి టెస్టు సిరీస్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్గా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది టీమిండియా. ఈసారి కోహ్లీ ఆ లోటు తీర్చుకుంటాడని నమ్మకం వ్యక్తం చేశాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్.
Cricket Nov 23, 2020, 3:46 PM IST
ఈ ఏడాది ఐపీఎల్ 2020 సీజన్ జరిగే సమయానికి టీ20 వరల్డ్కప్ టోర్నీ జరగాల్సింది. అయితే కరోనా వైరస్ కారణంగా మెగా టోర్నీని వచ్చే ఏడాదికి వాయిదా వేసింది ఐసీసీ. ఎన్నో విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ను నిర్వహించిన బీసీసీఐ, వచ్చే ఏడాది టీ20 వరల్డ్కప్కు నిర్వహించబోతోంది.
Cricket Nov 13, 2020, 7:21 PM IST
మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్ జట్టుకి లెజెండరీ మాజీ కెప్టెన్. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా భారత క్రికెట్ జట్టును రెండు సార్లు విశ్వవిజేతగా నిలపడమే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ అందించిన ఏకైక కెప్టెన్. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ తర్వాత అత్యధిక విజయాలు అందించిన సారథి ధోనీయే. మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన చాలారోజుల తర్వాత మాహీని మళ్లీ గుర్తు చేసుకుంది బీసీసీఐ.
Cricket Oct 28, 2020, 8:09 PM IST
పాకిస్తాన్ స్టార్ పేసర్ ఉమర్ గుల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఉమర్ గుల్... రిటైర్మెంట్ తర్వాత కోచ్గా కొత్త అవతారం ఎత్తబోతున్నట్టు ప్రకటించాడు. 2003లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన ఉమర్ గుల్, పాకిస్తాన్ క్రికెట్ జట్టులో స్టార్ పేసర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Cricket Sep 26, 2020, 6:05 PM IST
భారత క్రికెట్ చరిత్రలో ఓ అద్భుత ఘట్టం 2007 టీ20 వరల్డ్ కప్. 2007 వన్డే వరల్డ్కప్లో గ్రూప్ దశ నుంచే నిష్కమించిన టీమిండియా, సౌతాఫ్రికాలో జరిగిన టీ20 వరల్డ్కప్లో అండర్ డాగ్స్గా బరిలో దిగింది. రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ స్వచ్ఛందంగా టీ20 వరల్డ్కప్ నుంచి తప్పుకోవడంతో సీనియర్లు లేకుండా సౌతాఫ్రికా వెళ్లింది ధోనీ టీమ్.
Cricket Sep 24, 2020, 7:39 PM IST
2007 వన్డే వరల్డ్కప్లో గ్రూప్ దశలోనే ఘోరంగా ఓడింది భారత జట్టు. దీంతో సచిన్, ద్రావిడ్, గంగూలీ వంటి స్టార్లు లేకుండానే మొట్టమొదటి టీ20 వరల్డ్కప్ టోర్నీ ఆడింది భారత్. ఏ మాత్రం అంచనాలు లేకుండా టోర్నీలో అడుగుపెట్టి, టీ20 ఫార్మాట్లో మొట్టమొదటి విశ్వవిజేతగా నిలిచింది. ధోనీ శకానికి ప్రారంభంగా చెప్పుకునే ఈ టోర్నీలో దాయాది దేశాలు భారత్, పాక్ రెండు సార్లు తలబడ్డాయి. గ్రూప్ దశలో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా, అనేక ట్విస్టులతో సాగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పాక్. బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే గంభీర్, సెహ్వాగ్ అవుట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది భారత్. అయితే రాబిన్ ఊతప్ప 50, ధోనీ 33, ఇర్ఫాన్ పఠాన్ 20 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 141 పరుగులు చేయగలిగింది.
SPORTS Sep 14, 2020, 3:19 PM IST
క్రికెట్లో ఐపీఎల్ తరువాత ఇప్పుడీ జాబితాలోకి టీ20 వరల్డ్కప్ చేరిపోయింది. కరోనా ప్రభావంతో టి20 వరల్డ్కప్ అర్హత టోర్నీలను వాయిదా వేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. దీంతో అక్టోబర్ 2020లో జరగాల్సిన టీ20 వరల్డ్కప్పై నీలినీడలు కమ్ముకున్నాయి.
Cricket Mar 28, 2020, 2:18 PM IST
కోహ్లీ ఎంత గొప్ప క్రికెటరో అతని రికార్డులే చెబుతున్నాయన్నాడు. ఏ ఫార్మాట్ లోనైనా కోహ్లీ అదగొడతాడని.. అసాధారణ ఆటగాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. టెస్టు క్రికెట్ లో టీమిండియాను నెంబర్ వన్ స్థానంలో ఉంచిన ఘనత విరాట్ కే దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా కోహ్లీ ఫిట్ నెస్ కూడా అమోఘం అంటూ ప్రశంసించాడు.
Cricket Jan 23, 2020, 8:58 AM IST
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మళ్లీ జట్టులో చేర్చుకునేందుకు టీమిండియా మేనేజ్మెంట్ ప్రయత్నాలు మొదలుపెట్టిింది. బెంగళూరు టీ20లో టీమిండియా ఓటమి తర్వాత మేనేజ్మెంట్ ఆలోచనలో మార్పు వచ్చినట్లుంది.
CRICKET Sep 24, 2019, 5:40 PM IST
పాకిస్థాన్ జట్టును ఎప్పటికైనా గెలిపించేది విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్ లేనట. కాలాలు మారినా తమ జట్టు ఆటతీరు మారదంటూ స్వయంగా పాకిస్థానే ఒప్పుకున్నట్లు వున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
CRICKET Sep 8, 2019, 3:44 PM IST