సెక్స్ వీడియోలకు అడిక్ట్.. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. మైనర్ అరెస్టు
Karnataka: సెక్స్ వీడియోలకు బానిసైన ఒక మైనర్ బాలుడు.. ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం బాలిక ప్రాణాలు తీశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Kalaburagi: సెక్స్ వీడియోలకు బానిసైన ఒక మైనర్ బాలుడు.. ఓ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన తర్వాత.. ఆమెను హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. కలబురగి జిల్లా అలంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోరల్లి గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కలబుర్గి జిల్లాలోని అలంద తాలూకాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికపై మంగళవారం సాయంత్రం చెరకు తోటలో అత్యాచారం చేసి, హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సెక్స్ వీడియోలకు బానిసైన 16 ఏళ్ల ఐటీఐ విద్యార్థి, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితులపై సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామాలలో, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళనకు దిగారు. బాలికది పొరుగున ఉన్న అఫ్జల్ పూర్ తాలూకాలోని కోరల్లి గ్రామం. గత మూడు సంవత్సరాలుగా చదువు కోసం తన అత్తతో కలిసి ఉంటోంది. తన స్వస్థలంలో దీపావళి సెలవులు గడిపిన తరువాత ఆమె తిరిగి వచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలో బయటకు వెళ్లిన బాలిక చాలా సమయం వరకు తిరిగిరాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఆమె బంధువులు ఆ ప్రాంతంలో.. చుట్టుపక్కల ఏరియాలో ఆమె కోసం వెతికినప్పుడు బాధితురాలి మృతదేహం చెరకు తోట సమీపంలో కనిపించింది.
కాగా, దేశంలోని చాలా ప్రాంతాల్లో గ్రామీణ గృహాలకు ఇప్పటికీ మరుగుదొడ్లు లేకపోవడం.. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన క్రమంలో మహిళలు హింసను, లైంగికదాడులను ఎలా గురవుతున్నారనే విషయాన్ని ఈ ఘటన మరోసారి ఎత్తిచూపింది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇషా పంత్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రసన్న దేశాయ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సంఘటనను మీడియా ముందు వివరించడంతో ఎస్పీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. చేతులు, కాళ్లు కట్టివేసి, ఆపై ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై గొంతుకోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. దీనిపై విచారణ జరుపుతున్నారు.
మైనర్ పై అత్యాచారం, హత్య.. దోషులకు మరణశిక్ష
మైనర్పై అత్యాచారం, కిడ్నాప్-హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరు నిందితులకు ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లోని కోర్టు మరణశిక్ష విధించిందని పీటీఐ నివేదించింది. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద అడిషనల్ సెషన్స్ జడ్జి తీర్పు వెలువరించారు. నవాబ్గంజ్ కొత్వాలి ప్రాంతంలోని పర్సాయి గ్రామానికి చెందిన నిందితులు హలీమ్-రిజ్వాన్లకు కోర్టు మరణశిక్ష, ₹ 50 వేల జరిమానా విధించింది.