మైనర్ పై రేప్.. ఇతరులతోనూ సెక్స్ కోసం నిందితుడు, తల్లి బలవంతం.. మధ్యప్రదేశ్లో దారుణం
మధ్యప్రదేశ్లో ఓ టీనేజీ బాలికపై కన్నేసి ఓ దుండగుడు రేప్ చేశాడు. అనంతరం, నిందితుడు, ఆ నిందితుడి తల్లి కలిసి ఇతర వ్యక్తులతోనూ శారీరక సంబంధం పెట్టుకోవాలని బాలికను బెదిరించారు. ఈ ఘటనపై మహారాష్ట్రలో కేసు నమోదైంది.
నాగ్పూర్: మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక పై రేప్ జరిగింది. అంతేకాదు, ఆ రేప్ నిందితుడు, నిందితుడి తల్లి ఆ బాలికను మరింత వేధించారు. ఇతరులతోనూ ఆమె సెక్స్ చేసేలా బలవంతం చేశారు.
మహారాష్ట్రలో నాగ్పూర్లోని జరిపట్కాకు చెందిన టీనేజీ బాలిక పై ఈ దారుణం జరిగింది. ఆమె ఈవెంట్ మేనేజ్మెంట్లో పని చేస్తున్నారు. ఆ సంస్థ పనిలో భాగంగా మే నెలలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వెళ్లారు. అక్కడ అభిషేక్ కురిల్ అనే వ్యక్తిని కలుసుకున్నారు. అభిషేక్ కురిల్ ఆ బాలికను ప్రలోభపెట్టాడు. ఆమెతో సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ తర్వాత ఆమెను రేప్ చేశాడని పోలీసు అధికారులు ఆదివారం తెలిపారు.
అయితే, ఆ బాలిక విషాద గాధ ఇక్కడితో ముగియలేదు. ఈ నేరంలో నిందితుడు అభిషేక్ కురిల్ తల్లి కూడా ప్రవేశించింది. నిందితుడు, నిందితుడి తల్లి రజనీ (45) ఇద్దరు కలిసి ఆ బాలికపై మరింత వేధింపులు పెంచారు. ఇతర వ్యక్తులతోనూ శారీరక సంబంధం పెట్టుకునేలా ఆ బాలికను బలవంతపెట్టారు. బెదిరించారు. ఆ తర్వాత ఆ నిందతుడు బాలిక మొబైల్ ఫోన్ను చోరీ చేశాడు. ఆ ఫోన్ నుంచి అభ్యంతరకర ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడని అధికారులు వివరించారు.
రేప్ కేసులో తల్లి, కొడుకు ఇద్దరూ బుక్ అయ్యారు. అలాగే, ఇతర నేరాల కోసం బెదిరింపులు సహా ఇతర నేరాల కింద కేసు నమోదైంది. ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని జరిపట్కా పోలీసులు స్టేషన్ అధికారులు వెల్లడించారు.