పోలీసునంటూ పరిచయం చేసుకున్న ఓ మహిళ.. లక్షల రూపాయలు మోసం చేసి మొహం చాటేసింది. పీఎస్ లో చిక్కుకుపోయిన వాహనాలు తక్కువ ధరకు ఇప్పిస్తానని చెప్పి ఎర వేసి.. మోసానికి పాల్పడింది.
వేలూరు : పోలీసు కేసుల్లో ఇరుక్కున్న వాహనాలను తక్కువ ధరకు ఇప్పిస్తానని.. police వేషంలో పలువురి వద్ద లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిన మహిళను Vellore పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. వేలూరు సేన్ బాక్కంకు చెందిన రోగిని(32) ప్రస్తుతం కాంచీపురం జిల్లా సుంగాచత్రంలో husbandతో కలిసి ఉంటుంది. రాణిపేట జిల్లా ఆర్కాడ్ సమీపంలోని ఇందిరానగర్ కు చెందిన దినేష్ కుమార్ కు ఓ స్నేహితుని ద్వారా రోగిని పరిచయమయ్యింది.
ఈ క్రమంలో పోలీస్ దుస్తుల్లో ఉన్న ఫోటో, నకిలీ పోలీస్ గుర్తింపు కార్డును దినేష్ కుమార్ కు చూపించి తాను SI అంటూ నమ్మించింది. పోలీస్ కేసులో చిక్కుకున్న Vehicles, carsను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ అతని వద్ద నుంచి 14 లక్షలు తీసుకుంది. అలాగే chennaiకి చెందిన సెంథిల్, వేలూరుకు చెందిన kumarను కూడా దినేష్ పరిచయం చేయడంతో వారి వద్ద నుంచి కూడా కార్ల పేరుతో రోగిని ఐదు లక్షలు కాజేసింది.
అయితే ఆ తర్వాత మొహం చాటేయడంతో దినేష్ కుమార్ గత నెల 25వ తేదీన ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నిందితురాలిని వేలూరు క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో రోగినిపై వివిధ పోలీస్స్టేషన్లలో మొత్తం 14 కేసులు ఉన్నట్లు వెల్లడైంది.
ఇదిలా ఉండగా, ఓ అంతరాష్ట్ర వాహనాల దొంగలముఠాను ఫిబ్రవరి 14న హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులో 2019-21 మధ్య 6884 వాహనాలు చోరికి గురికాగా వాటిలో 1200-1500 వరకూ ఖరీదైన కార్లే ఉన్నాయి. ఇటీవల రాచకొండ పోలీసులు ఆలయాల్లో చోరీ చేస్తున్న gangను అరెస్టు చేసినపుడు ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది.వీరు చోరీలు ప్రారంభించే ముందు Expensive carను అపహరిస్తారు. అదే కంపెనీ, రంగు ఉన్న కారు నెంబరు చోరీ చేసిన వాహనానికి అమర్చుతారు. అవసరం తీరాక తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
ఒక్కో చోరీకి ఒక్కో లెక్క ఉంది..
నగరానికి చెందిన చమన్ సతీష్ ముఠా నకిలీ ఆధార్ కార్డులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో చోరీ చేసిన వాహనాలకు దర్జాగా యాజమాన్య మార్పిడి చేయించారు. కొత్తగా కొనుగోలు చేసిన ఆర్ సి లను రవాణా శాఖ యజమానులు ఇంటికి పోస్టల్/ కొరియర్ ద్వారా పంపుతుంది. కొన్ని చిరునామాలు సరిగా లేక తిరిగి కార్యాలయాలకు చేరుతుంటాయి. ఆ శాఖలోని ఇంటి దొంగల సాయంతో వాటిని సేకరించి వేలంలో కొన్న/కొట్టేసిన వాహనాలకు అనుకూలంగా మార్చేవారు.
మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ ఖాన్ పఠాన్ క్యాబ్ డ్రైవర్ గా కాప్రాలో మకాం వేశాడు. ముఠాను తయారుచేసి అర్ధరాత్రి దాటాక ఖరీదైన కార్ల అద్దాలు తొలగించి తాళాలు సేకరించేవారు. అరగంటలో నకిలీ తాళం తయారు చేసి తీసుకెళ్లేవారు. అయిదేళ్ల వ్యవధిలో వందకుపైగా కార్లను చోరీ చేశాడు. కృష్ణా జిల్లా మహేష్ నూతన కుమార్.. కార్లను అద్దెకిచ్చే యాప్ లనే బురిడీ కొట్టించి 20కి పైగా ఎత్తుకెళ్లి అమ్మాడు. రాజస్థాన్ కు చెందిన కరడు గట్టిన కార్ల దొంగ సత్యేంద్ర సింగ్ షెకావత్ హ్యాండ్ బేబీ యాప్ ద్వారా ఖరీదైన కార్ల తాళాలను క్లోనింగ్ చేసి 90 కార్లు చోరీ చేసి అమ్మేశాడు.
ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు..
తెలుగు రాష్ట్రాల్లో కొట్టేసిన వాహనాలకు నకిలీ నెంబర్ ప్లేట్లు అమర్చి సరిహద్దులు దాటిస్తారు. ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు నగరాలకు చేర్చుతారు. అక్కడ నకిలీ పత్రాలు తయారు చేసి చాలామంది మెకానిక్ లు, డ్రైవర్లకు కమిషన్ ఆశ చూపి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇక్కడ దొంగిలించిన అధిక శాతం కార్లను ఢిల్లీలో విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి వాహనాలను విక్రయించేందుకు శంషాబాద్, అత్తాపూర్, అబిడ్స్, నారాయణగూడ, సికింద్రాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లోనూ దళారులు ఉన్నారు. వీరి ద్వారానే నకిలీ పత్రాలు సృష్టించి వాహనాలను సెకండ్హ్యాండ్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కొట్టేసిన వాహనాలు ఇక్కడ, ఇక్కడ చోరీ చేసినవి ఇతర రాష్ట్రాల్లో చేర్చి విక్రయిస్తుంటారు.
