సీసీడీ బోర్డు తాత్కాలిక చైర్మెన్ గా రంగనాథ్
కేఫ్ కాఫీ డే బోర్డు తాత్కాలిక చైర్మెన్ గా ఎస్వీ రంగనాధ్ ను నియమించారు. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్దార్ధ నియామకంతో రంగనాధ్ ను నియమించారు.
బెంగుళూరు: కేఫ్ కాఫీ డే బోర్డుకు ఎస్వీ రంగనాథ్ను తాత్కాలిక చైర్మెన్ గా నియమించినట్టుగా బోర్డు బుధవారం నాడు ప్రకటించింది.కేఫ్ కాఫీ డే బోర్డు వ్యవస్థాపకులు వీజీ సిద్దార్ధ ఆత్మహత్య చేసుకోవడంతో బుధవారం నాడు కొత్త బోర్డు అత్యవసరంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకొంది.
సోమవారం నాడు వీజీ సిద్దార్ధ అదృశ్యమయ్యారు. బుధవారం నాడు ఉదయం నేత్రావతి నది ఒడ్డున వీజీ సిద్దార్ద మృతదేహం లభ్యమైంది.
సీసీడీ బోర్డు పలు కీలక విషయాలపై బుధవారం నాడు నిర్ణయాలు తీసుకొంది. లీగల్, డెవలప్మెంట్ బోర్డు విభాగాల్లో కొత్త వారిని నియమించింది.
సీసీడీ బోర్డులో వీజీ సిద్దార్ధ తనయుడు కూడ సభ్యుడిగా ఉన్నాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే వీజీ సిద్దార్ధ ఆత్మహత్యలకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.సోమవారం నాడు నేత్రావతి నది బ్రిడ్జిపై నుండి దూకి సిద్దార్ధ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సంబంధిత వార్తలు
కాఫీ కింగ్ కన్నుమూత... తోటి పారిశ్రామికవేత్తలకు ఆనంద్ మహీంద్రా నోట్
అంతా చట్టప్రకారమే.. సిద్ధార్థను మేం ఇబ్బంది పెట్టలేదు: ఐటీ శాఖ
విషాదాంతం: నేత్రావతిలో శవమై తేలిన కాఫీ డే అధినేత సిద్ధార్ధ్
అంతా చట్టప్రకారమే.. సిద్ధార్థను మేం ఇబ్బంది పెట్టలేదు: ఐటీ శాఖ
వీజీ సిద్దార్ధ మిస్సింగ్: బ్రిడ్జి నుండి దూకడం చూశా, కానీ...
వీజీ సిద్దార్ధ మిస్సింగ్: కీలక సమాచారమిచ్చిన డ్రైవర్
సిద్ధార్థ అదృశ్యం... కేఫ్ కాఫీడే ఉద్యోగులకు సెలవు
కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం
అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ
‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..
వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?
130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...