దారుణం.. వివాహితను పబ్ కు తీసుకువెళ్లి, డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం.. వీడియో తీసి, బ్లాక్ మెయిల్ చేస్తూ...
డబ్బున్న మహిళతో స్నేహం చేసిన ఓ వ్యాపారవేత్త.. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత అదంతా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.
ఉత్తర ప్రదేశ్ : స్నేహం ముసుగులో వివాహితపై అత్యాచారం చేసి, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ, డబ్బులు గుంజుతున్న ఓ బిజినెస్ మ్యాన్ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే.. అతనో వ్యాపారవేత్త. బాగా డబ్బున్న ఓ వివాహిత తో స్నేహం చేశాడు. తరచుగా ఆమెతో కలిసి పార్టీలకు వెళ్లేవాడు. అలాగే 6 నెలల క్రితం ఆమెను ఓ పార్టీకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె తాగే డ్రింక్ లో మత్తు పదార్థాలు కలిపాడు. ఆ తర్వాత ఆమెను ఓ గదిలోకి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా.. ఆ వీడియో చూపించి బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టాడు. అలా ఆమె నుంచి ఏకంగా రూ.80 లక్షలు లాగేసాడు.
అయినా, అతని ఆశ తీరలేదు. ఇంకా ఇంకా డబ్బులు కావాలని వేధింపులు ఎక్కువ చేశాడు. దీంతో అతడి ఆగడాలను భరించలేక పోయిన మహిళా ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెడితే.. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ప్రశాంత్ కుమార్ సింగ్ లక్నోకు చెందిన ఓ వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. ధనవంతుల కుటుంబానికి చెందిన ఆ మహిళతో స్నేహం చేశాడు. మంచివాడగా నమ్మించాడు. దీంతో ఆమె అతనితో కలిసి పార్టీలకు వెళ్లేది. ఆరు నెలల క్రితం ఆమెను ఓ పబ్ కి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె తాగే డ్రింక్ లో డ్రగ్స్ కలిపాడు. మగతలో ఉన్న ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు.
రావణ దహనంలో అపశృతి.. ఒక్కసారిగా కింద పడ్డ దిష్టిబొమ్మ.. పలువురికి తీవ్రగాయాలు.. ఎక్కడంటే ?
తనకు అవసరమైనప్పుడల్లా డబ్బులు అడిగి తీసుకునే వాడు. అంతే కాదు ఆమెను బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడు. అలా ఆమె నుంచి దఫదఫాలుగా రూ.80 లక్షలు కాజేశాడు. అయినా ఆ డబ్బుతో ప్రశాంత్ సంతృప్తి చెందలేదు. జిమ్ ప్రారంభిస్తున్నానని చెప్పి మరింత డబ్బు అడిగాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.