వికాస్ దూబే టెర్రర్: ఇంటికి తిరిగొచ్చి, నోరు విప్పిన రాహుల్ తివారీ
తన అత్తగారి ఆస్తి విషయంలో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేతో తలపడ్డ రాహుల్ తివారీ అతడి ఆగడాల గురించి వివరించారు.
కాన్పూర్: గ్యాంగస్టర్ వికాస్ దూబేపై పోరు చేసిన రాహుల్ తివారీ చివరకు నోరు విప్పారు. వికాస్ దూబే ఈ నెల 10వ తేదీన పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే. రాహుల్ తివారీ బుధవారంనాడు ఇంటికి తిరిగి వచ్చారు. కాన్పూర్ లోని బిక్రూ గ్రామంలో వికాస్ దూబే సృష్టించిన భయోత్పాతం గురించి మాట్లాడారు.
వికాస్ దూబేపై చేసిన పోరాటం గురించి రాహుల్ తీవారీ ఈ విధంగా వివరించారు... తన అత్తగారి ఆస్తి విషయంలో రాహుల్ తివారీ వికాస్ దూబేతో తలపడ్డారు. జూన్ 27వ తేదీన ఆయన మోటార్ బైక్ మీద ఇంటికి వస్తుండగా వికాస్ దూబే మనుషులు దాడి చేశారు. ఆయన మోటార్ సైకిల్ ను, డబ్బును లాక్కుపోయారు.
అది జరిగిన తర్వాత రాహుల్ తివారీ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. సంఘటనపై దర్యాప్తు జరుపుతానని స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినయ్ తివారీ ఆయనకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత తివారీపై దూబే మనుషులు దాడి చేశారు. ఎస్ఓ తివారీ ఎదుటే ఆయనపై దాడి చశారు. వినయ్ తివారీని బెదిరించారు.
ఎస్ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) తనను దూబే మనుషులు చంపుతారని అనుకున్నాడు. దీంతో పండితులు ధరించే పవిత్రమైన తాడును ధరించారు. పండితుల పట్ల కాస్తా దయచూపాలని వినయ్ తివారీ దూబే మనుషులను అడిగాడు. దాంతో వికాస్ దూబే గంగా జలం తీసి వాళ్లకు ఇచ్చాడు. తాను కూడా గంగా జలం తీసుకున్నాడు. తివారీని చంపబోనని దూబే ప్రతిజ్ఢ చేశాడు.
రాహుల్ తివారీపై శివం, బాల్ గోవింద్, అతుల్ దూబే, సునీల్ కుమార్, అమర్ దూబే దాడి చేశారు. రాహుల్ తివారీ దృష్టిలో వికాస్ దూబే పెద్ద టెర్రరిస్టు. వికాస్ దూబే రాహుల్ తివారీని కొన్ని ప్రశ్నలు అడిగి మోటార్ సైకిల్ తిరిగి ఇచ్చేశాడు. వికాస్ దూబే తనను చంపుతాడని భయపడి దాంతో అతను కెప్టెన్ ఇంటికి వెళ్లాడు. పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేయాలని కెప్టెన్ చెప్పాడు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన ఫిర్యాదును తీసుకుని దూబే చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. పోలీసులు జూలే 2, 3 మధ్య రాత్రి కాన్పూర్ లోని బిక్రూ గ్రామంలోని వికాస్ దూబే ఇంటికి వెళ్లారు. వికాస్ దూబే మనుషులు కాల్పులు జరిపి ఎనిమిది మంది పోలీసులను హత్య చేశారు.
బిక్రూ సంఘటన తర్వాత రాహుల్ తివారీ తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. ఆయన మొబైల్ ఫోన్ కూడా పనిచేయలేదు. ఎన్ కౌంటర్ తర్వాత అతను కెప్టెన్ ఇంటికి వెళ్లాడు. ఆయనకు భద్రతగా ఓ గన్ మన్ ను ఇచ్చాడు. ఆ తర్వాత గ్రామానికి వచ్చాడు.
బిక్రూ ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత రాహుల్ తివారీ కనిపించకుండా పోయాడు. ఈ తివారీయే జూన్ 30వ తేదీన వికాస్ దూబేపై చౌబేయపూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు.