MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • PM Modi: ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. పార్లమెంట్‌లో కొత్త బిల్లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు !

PM Modi: ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. పార్లమెంట్‌లో కొత్త బిల్లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు !

PM Modi: పేపర్ లీక్‌లపై కఠిన చట్టం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని గురించి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 24 2026, 08:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పేపర్ లీక్ ముఠాలకు బిగ్ షాక్: కఠిన బిల్లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు
Image Credit : Asianet News

పేపర్ లీక్ ముఠాలకు బిగ్ షాక్: కఠిన బిల్లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు

దేశవ్యాప్తంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే లక్షలాది మంది స్టూడెంట్స్ ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఒక బిగ్ డిసిషన్ తీసుకుంది. ముఖ్యంగా NEET-UG వంటి కీలక పరీక్షల్లో పేపర్ లీకేజీలు విపరీతమైన వివాదానికి దారితీయడంతో, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. గురువారం రాత్రి సోషల్ మీడియా లో ఓ కీలక వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. పేపర్ లీక్ అనేది కేవలం ఒక సాధారణ నేరం కాదని, లక్షలాది మంది విద్యార్థుల కలలు, వారి తల్లిదండ్రుల ఆవేదనతో ముడిపడి ఉన్న తీవ్రమైన అంశమని మోదీ స్పష్టం చేశారు. బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశార

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ప్రధాని మెసేజ్.. నేడు క్యాబినెట్ భేటీలో నిర్ణయం
Image Credit : Asianet News

ప్రధాని మెసేజ్.. నేడు క్యాబినెట్ భేటీలో నిర్ణయం

గురువారం రాత్రి విడుదల చేసిన దాదాపు 3 నిమిషాల వీడియో సందేశంలో ప్రధాని మోదీ పలు కీలక విషయాలను వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం అని చెప్పారు. విద్యార్థుల ఒక సంవత్సరం కాలం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే సుమారు 22 లక్షల మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించి, జూలై 19న ఫలితాలను సైతం విడుదల చేశామని గుర్తు చేశారు.

ఈ పేపర్ లీక్ ఘటనలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా చట్టపరమైన సంస్కరణలు తేనున్నట్లు వెల్లడించారు. దీనిపై సంబంధిత శాఖల నుంచి తీర్మానాన్ని తెప్పించుకున్నామని, శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదిస్తామని తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో వారంలోనే ఈ కొత్త బిల్లును సభ ముందుకు తెచ్చి చట్టంగా మారుస్తామని హామీ ఇచ్చారు.

Related Articles

Related image1
EPFO New Rules 2026: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జాక్‌పాట్.. ఈపీఎఫ్‌ఓ 5 కొత్త రూల్స్ ఇవే
Related image2
Most Liveable Cities 2026: వరల్డ్ బెస్ట్ సిటీ ఏదో తెలుసా? ఇండియా, పాకిస్థాన్‌ నగరాల ర్యాంకులు ఇవే
36
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షలు
Image Credit : Asianet News

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షలు

పేపర్ లీక్ కేసుకు సంబంధించి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా దేశవ్యాప్తంగా ప్రత్యేక 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులు' ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

• ఈ కొత్త బిల్లు ద్వారా పరీక్షా కేంద్రాల్లో డిజిటల్ మానిటరింగ్‌ను భారీగా పెంచనున్నారు.

• అక్రమాలకు పాల్పడే వ్యక్తులు లేదా ముఠాలకు జీవితాంతం జైలు శిక్ష (యావజ్జీవ ఖైదు) పడేలా కఠిన నిబంధనలను చేర్చనున్నారు.

ప్రధాని మోదీ ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ హైకోర్టు కూడా వేగంగా స్పందించింది. క్రిమినల్ కేసుల విచారణ కోసం జడ్జి అనూ గ్రోవర్ బాలిగాను ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U

— Narendra Modi (@narendramodi) July 23, 2026

46
ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిపై వేటు
Image Credit : stockPhoto

ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిపై వేటు

పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల స్థాయిలో కీలక మార్పులు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిని ఆ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించింది. ఆయన స్థానంలో 1994 రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గంగ్వార్‌ను నూతన కార్యదర్శిగా నియమించింది. గంగ్వార్ గతంలో పర్యావరణ, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల్లో కీలక పదవుల్లో సేవలుందించారు.

56
రాహుల్ గాంధీ ఫైర్
Image Credit : Asianet News

రాహుల్ గాంధీ ఫైర్

మరొకవైపు ప్రధాని మోదీ వీడియో సందేశంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని వీడియో రిలీజ్ చేయడం వల్ల విద్యార్థుల ఆవేదనకు పరిష్కారం దొరకదని, అది వారి మేథస్సును అవమానించడమేనని ఎక్స్ లో విమర్శించారు.

"విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం స్పష్టమైన డిమాండ్లతో వీధుల్లో పోరాడుతున్నారు" అని రాహుల్ కామెంట్ చేశారు. వరుస లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.

You are the one who has harmed the future of our youth the most. 

You allowed and encouraged the total capture and destruction of our education system - and protected every person responsible for it.

The students’ demands are clear:
1. Sack Dharmendra Pradhan.
2. Apologise to… https://t.co/0MK4wPMNiK

— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026

66
విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయమా?
Image Credit : ANI + X

విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయమా?

గత కొన్ని నెలలుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నాయి. ఈ ప్రజాందోళనతో తీవ్ర ఒత్తిడికి గురైన కేంద్ర ప్రభుత్వం, చివరికి వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టక తప్పలేదు. ఏది ఏమైనా, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే ఈ కొత్త చట్టం దేశంలో పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Sonam Wangchuk ji has ended his fast after my colleagues, Shri @JPNadda ji and Shri @DrJitendraSingh ji met him at Medanta Hospital, Gurugram, and assured him of the government's commitment to address the concerns.

Wangchuk ji’s decision to end his fast reflects his trust in the… pic.twitter.com/T5KGB4X25b

— Piyush Goyal (@PiyushGoyal) July 24, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
నరేంద్ర మోదీ
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
EPFO New Rules 2026: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జాక్‌పాట్.. ఈపీఎఫ్‌ఓ 5 కొత్త రూల్స్ ఇవే
Recommended image2
ఏడాదంతా కురవాల్సిన వర్షం 24 గంటల్లోనే కురిసిందా..! దేశ చరిత్రలోనే రికార్డు వర్షపాతమా! ఎన్ని మిల్లిమీటర్లో తెలుసా?
Recommended image3
Now Playing
జననాయగన్ సినిమాకి వచ్చిన వారికి బిర్యానీ వడ్డించిన మంత్రులు | CM Vijay's Jananayagan Craze
Related Stories
Recommended image1
EPFO New Rules 2026: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జాక్‌పాట్.. ఈపీఎఫ్‌ఓ 5 కొత్త రూల్స్ ఇవే
Recommended image2
Most Liveable Cities 2026: వరల్డ్ బెస్ట్ సిటీ ఏదో తెలుసా? ఇండియా, పాకిస్థాన్‌ నగరాల ర్యాంకులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved