Temple: ఈ గుడిలోకి చెప్పులు వేసుకొని లోపలికి వెళతారు... ఎందుకు అనుమతి ఇస్తారో తెలుసా..?
Temple: గుడిని మనం చాలా పవిత్రమైన స్థలంగా పరిగణిస్తాం. అందుకే.. చెప్పులు బయటే వదిలేసి.. కాళ్లు శుభ్రం చేసుకొని మరీ.. గుడిలోకి వెళతాం. కానీ, చెప్పులు వేసుకొని లోపలికి వెళ్లే ఆలయాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?

చెప్పులు అనుమతించే ఆలయాలు..
సాధారణంగా మనం ఏ గుడికి వెళ్లినా.. కాళ్లకు ఉన్న చెప్పులను బయటే విడిచి పెట్టి, భక్తి శ్రద్ధలతో లోపలికి వెళతాం. ఇది మన ఆచారం. కానీ, మన దేశంలోని కొన్ని ప్రముఖ ఆలయాల్లో చెప్పులు వేసుకొని లోపలికి వెళతారని మీకు తెలుసా? వినడానికి కాస్త వింతగా అనిపించినా నిజంగానే ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి. వేరే ఏ ఇతర ఆలయాల్లో లేని ఈ రూల్... ఈ టెంపుల్స్ లో మాత్రం ఎందుకు ఉంది? దీని వెనక ఉన్న కారణం ఏంటి?
దేవ్జీ మహారాజ్ ఆలయం..
ఈ దేవ్జీ మహారాజ్ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా, మాలాజ్ పూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లే భక్తులు చెప్పులు ధరించే.. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాతరకు వెళ్లే భక్తులు.. పాదరక్షలను ధరించే ఆలయ ప్రాంగణంలోకి వెళ్తారు. అయితే.. రోజువారీ సాధారణ పూజల సమయంలో చెప్పులు ధరించరు. కానీ, సంవత్సరానికి ఒకసారి నిర్వహించే జాతరకు వెళ్లే వారు మాత్రం.. చెప్పులు ధరిస్తారు.
అసలు కారణం: స్థానిక నమ్మకాల ప్రకారం, దుష్టశక్తులు, చేతబడులు లేదా శారీరక/మానసిక సమస్యలతో బాధపడేవారు దేవ్జీ మహారాజ్ను దర్శించుకుంటే ఆ సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అక్కడ పాదరక్షలతో నడవడం వల్ల తమను ఆవహించిన దుష్టశక్తులు తొలగిపోతాయని స్థానికుల విశ్వాసం.
2. కాళీ మాత ఆలయం..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ జిల్లా, భోపాల్పూర్ ప్రాంతంలో ఉన్న కాళీమాత దేవాలయం.భక్తులు తమ కాళ్లకు ఉన్న చెప్పులను తీయకుండానే అమ్మవారిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు.
అసలు కారణం: ఈ ప్రాంతంలో అమ్మవారిని చాలా ఉగ్రరూపిణిగా, అలాగే భక్తులను కంటికి రెప్పలా కాపాడే తల్లిగా భావిస్తారు. భక్తులు ముళ్ల బాటలు, కఠినమైన దారుల్లో నడిచి వస్తారు కాబట్టి వాళ్లకు పాదరక్షల వల్ల ఎలాంటి హాని కలగకుండా, అమ్మవారే స్వయంగా చెప్పులతో రావడానికి అనుమతి ఇచ్చిందని ఇక్కడి స్థానిక జానపద కథనం చెబుతుంది.
జగన్నాథ స్వామి ఆలయం
ఒడిశాలోని పూరీ జగన్నాథుని ప్రధాన ఆలయంలోకి చెప్పులను అస్సలు అనుమతించరు. కానీ, ఆలయ వంటశాల (మహాప్రసాదం తయారీ ప్రాంతం), కొన్ని నిర్దిష్ట పూజా ప్రాంగణాల్లో సేవకులు/పూజారులు చెక్కతో చేసిన పాదరక్షలను ధరించడానికి అనుమతి ఉంటుంది.
సాధారణంగా ఆలయాల్లోకి చెప్పులు ఎందుకు అనుమతించరు..?
పరిశుభ్రత : బయట తిరిగిన మురికి, క్రిములు ఆలయ పవిత్ర ప్రాంగణంలోకి రాకుండా ఉండేందుకు.
ఎనర్జీ, వైబ్రేషన్స్: ఆలయాల్లో ఉండే రాతి నేలలు, మంత్రోచ్ఛారణల ద్వారా ఉత్పత్తయ్యే పాజిటివ్ ఎనర్జీ కాళ్ల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అందుకే చెప్పులు వేసుకోవద్దని చెబుతుంటారు.

