MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • International
  • Nepal Floods: నేపాల్ వరదల్లో 3000 మంది మిస్సింగ్.. గండక్ నది ఒడ్డున మృతదేహాల కలకలం

Nepal Floods: నేపాల్ వరదల్లో 3000 మంది మిస్సింగ్.. గండక్ నది ఒడ్డున మృతదేహాల కలకలం

Nepal Floods : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఉప్పొంగిన ఆకస్మిక వరదలు అత్యంత విషాదాన్ని మిగిల్చాయి. విపత్తు దాటికి వేలాది మంది కొట్టుకుపోగా, బాధితుల ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యల్లో కలచివేసే ఘటనాంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 30 2026, 08:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వంట చేస్తూ వరదలో కొట్టుకుపోయిన నాన్న.. 11 ఏళ్ల బాలుడి కన్నీటి వెతుకులాట
Image Credit : ANI

వంట చేస్తూ వరదలో కొట్టుకుపోయిన నాన్న.. 11 ఏళ్ల బాలుడి కన్నీటి వెతుకులాట

నేపాల్‌లో సంభవించిన భయంకరమైన జలప్రళయం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదంలో బీహార్‌లోని మోతిహారీకి చెందిన 11 ఏళ్ల బాలుడు తన తండ్రిని కోల్పోయాడు. శనివారం రోజు ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ ఖడ్డా ప్రాంతానికి చేరుకున్న ఈ చిన్నారి, నేపాల్‌లో జరిగిన ఆ భయంకర సంఘటనను కన్నీళ్లతో గుర్తుచేసుకున్నాడు. తండ్రి జాడ కోసం గండక్ నది తీరంలో వెతుకుతున్న ఆ బాలుడి ఆవేదన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కంటితడి పెట్టించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బడికి వెళ్లే టైమ్‌లో వచ్చిపడ్డ ప్రళయం
Image Credit : ANI

బడికి వెళ్లే టైమ్‌లో వచ్చిపడ్డ ప్రళయం

ఆ బాలుడు తెలిపిన వివరాల ప్రకారం, అతని తండ్రి నేపాల్‌లోని రసువా జిల్లాలో స్క్రాప్ షాప్ నడుపుతుండేవాడు. ఆ రోజు ఉదయం బాలుడు స్కూల్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. తండ్రి వంట చేస్తున్నాడు. ఇంతలోనే ఊహించని విధంగా ఒక్కసారిగా పైనుంచి ఉధృతంగా వరద నీరు దూసుకొచ్చింది. ఆ నీటి ప్రవాహంలో తండ్రి కొట్టుకుపోయారు. బాలుడు తన ముగ్గురు సోదరులతో కలిసి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకుని బీహార్‌లోని తమ స్వగ్రామానికి చేరుకున్నాడు.

Related Articles

Related image1
Agriculture: లక్షల ఎకరాల భూములు కొంటున్న మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ బాస్‌లు.. అసలు ప్లాన్ ఏంటి?
Related image2
India Debt: భారత్ పై 200 లక్షల కోట్ల అప్పు.. ఎవరి దగ్గర తీసుకుంది? వడ్డీ భారం ఎంతో తెలుసా?
35
గండక్ నది ఒడ్డున కొడుకు ఆవేదన
Image Credit : ANI

గండక్ నది ఒడ్డున కొడుకు ఆవేదన

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే తండ్రి కోసం వెతకడం ప్రారంభించారు. బీహార్‌లోని నదీ తీర ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో, తన బాబాయ్‌తో కలిసి శనివారం కుషీనగర్‌లోని ఛితౌని బంధ్, మదన్‌పూర్ సుక్రౌలీ, భైన్సా ప్రాంతాలకు చేరుకున్నాడు. గండక్ నది ఒడ్డున తన తండ్రి ఆచూకీ దొరుకుతుందనే ఆశతో ఆ చిన్నారి ఇంకా వెతుకుతూనే ఉన్నాడు.

45
తీరానికి కొట్టుకొచ్చిన 6 మృతదేహాలు
Image Credit : ANI

తీరానికి కొట్టుకొచ్చిన 6 మృతదేహాలు

నేపాల్ వరదల ప్రభావంతో గండక్ నదిలో నీటి ఉధృతి మళ్లీ పెరిగింది. దీంతో కుషీనగర్‌లోని ఖడ్డా ప్రాంతంలో వరద, నదీ తీర కోత ప్రమాదం ఎక్కువైంది. నది ప్రవాహం ఛితౌని ఆకట్ట వద్ద ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు, నేపాల్ నుంచి కొట్టుకువచ్చిన 6 మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకుని జిల్లా ఆసుపత్రిలోని డిప్ ఫ్రీజర్‌లో భద్రపరిచారు. మృతదేహాలను గుర్తించడానికి నేపాల్ సరిహద్దు జిల్లాల అధికారులతో ఎడిఎమ్ వైభవ్ మిశ్రా సమన్వయం చేసుకుంటున్నారు. గుర్తింపు పూర్తయ్యాక నిబంధనల ప్రకారం బంధువులకు అప్పగిస్తామని తెలిపారు.

55
నేపాల్‌లో మళ్లీ రెడ్ అలర్ట్: 3000 మంది గల్లంతు
Image Credit : ANI

నేపాల్‌లో మళ్లీ రెడ్ అలర్ట్: 3000 మంది గల్లంతు

నేపాల్‌లో వరద ముప్పు మళ్లీ పెరిగింది. భోటేకోషి నదిలో నీటి ఉధృతి పెరగడంతో రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 26న వచ్చిన వరదల్లో ఇప్పటివరకు 691 మంది మృతి చెందగా, 3000 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో 275 మంది భారతీయులు ఉన్నారు. భారత్ ఇప్పటివరకు 108 మందిని సురక్షితంగా రక్షించింది. చైనా నుంచి 598 మంది భారతీయులు నేపాల్ చేరుకోగా, మరో 900 మంది చైనాలో సురక్షితంగా ఉన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రపంచ ప్రఖ్యాత సరస్సు పేరు మార్చిన ట్రంప్... ఎందుకో తెలుసా?
Recommended image2
Nepal Floods: ముప్పు ఇంకా ముగిసిపోలేదు.. నేపాల్‌కు చైనా హెచ్చ‌రిక‌, మ‌రో 3 రోజుల్లో
Recommended image3
USA: ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంచలన నిర్ణయం.. అమెరికా వెళ్లే భార‌తీయుల‌కు గ‌ట్టి షాక్
Related Stories
Recommended image1
Agriculture: లక్షల ఎకరాల భూములు కొంటున్న మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ బాస్‌లు.. అసలు ప్లాన్ ఏంటి?
Recommended image2
India Debt: భారత్ పై 200 లక్షల కోట్ల అప్పు.. ఎవరి దగ్గర తీసుకుంది? వడ్డీ భారం ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved