MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • International
  • Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి

Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి

Nepal Flash Floods: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ల్యాండ్‌స్లైడ్ కారణంగా ఆకస్మిక వరదలు వచ్చాయి. 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 133 మంది భారతీయులు సహా వందలాది మంది గల్లంతయ్యారు. కైలాస యాత్రలో ఊహించని విషాదంతో చాలా మంది భారతీయులు గల్లంతయ్యారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 27 2026, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నేపాల్ సరిహద్దులో ఆకస్మిక విలయం: అసలు ఏం జరిగింది?
Image Credit : ANI

నేపాల్ సరిహద్దులో ఆకస్మిక విలయం: అసలు ఏం జరిగింది?

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఊహించని పర్యావరణ విపత్తు ముంచెత్తింది. హిమపాతం, కొండచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, ఈ కొండచరియలు విరిగిపడిన తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో కూడిన భూకంపంతో సమానంగా నమోదు కావడం గమనార్హం. ఈ దెబ్బకు మంచు, రాళ్లు, మట్టి, నీరు పెద్ద ఎత్తున 'ల్హెండే ఖోలా' నదిలోకి కొట్టుకొచ్చాయి. అక్కడి నుంచి 'భోటే కోశి', 'త్రిశూలి' నదుల ద్వారా నీరు ఉగ్రరూపం దాల్చి దిగువ ప్రాంతాలను ముంచెత్తింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
163కు చేరిన మరణాలు.. వందలాది మంది అడ్రస్ లేదు
Image Credit : ANI

163కు చేరిన మరణాలు.. వందలాది మంది అడ్రస్ లేదు

ఈ భయానక వరదల వల్ల ఇప్పటివరకు 163 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. నూవాకోట్, రసువా, ధాడింగ్, చిత్రవాన్, గూర్ఖా వంటి జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అత్యధికంగా చిత్వాన్‌లో 64 మంది, ధాడింగ్‌లో 27 మంది మరణించారు. దాదాపు 750 మందికి పైగా జాడ తెలియకుండా పోయినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లోని టిబెట్ భూభాగంలో కూడా ముగ్గురు మరణించగా, 265 మంది గల్లంతయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ, శతాబ్ద కాలంలో ఇదొక అతిపెద్ద విపత్తు అని, గ్రామాలు క్షణాల్లో తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

Related image1
Indias Shortest Train Journey: 7 నిమిషాల్లోనే ముగిసే రైలు ప్రయాణం ఇది !
Related image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
35
133 మంది భారతీయ యాత్రికులు గల్లంతు: సహాయక చర్యలు వేగవంతం
Image Credit : ANI

133 మంది భారతీయ యాత్రికులు గల్లంతు: సహాయక చర్యలు వేగవంతం

పవిత్ర కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన భక్తులు ఈ విపత్తులో చిక్కుకున్నారు. వీరిలో 133 మంది భారతీయ యాత్రికుల అడ్రస్ దొరకడం లేదు. తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ జాబితాలో ఉన్నారు. ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది సభ్యులు ఇమ్మిగ్రేషన్ సెంటర్ వద్ద ఉండగా వరదల్లో చిక్కుకున్నారని, వారితో కమ్యూనికేషన్ కట్ అయిందని సద్గురు తెలిపారు. బాధితులను రక్షించడానికి నేపాల్ ఆర్మీ, హెలికాప్టర్లను రంగంలోకి దించింది. భారత్ కూడా వెంటనే స్పందించి 10 టన్నుల సహాయక సామగ్రిని సీ-130జే విమానంలో ఖాట్మండుకు పంపింది.

45
కూలిపోయిన బ్రిడ్జిలు, పవర్ ప్రాజెక్టులు: ఊళ్లు జలమయం
Image Credit : ANI

కూలిపోయిన బ్రిడ్జిలు, పవర్ ప్రాజెక్టులు: ఊళ్లు జలమయం

వరద దెబ్బకు రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. కనీసం 19 మోటారబుల్ వంతెనలు కొట్టుకుపోయాయి. కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే ఒక భారీ బ్రిడ్జి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు 354 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 పవర్ ప్రాజెక్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. బెట్రావతి నుండి రసువాగధి సరిహద్దు వరకు ఉండే 42 కిలోమీటర్ల ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

55
బీహార్‌కు పొంచి ఉన్న ముప్పు: అప్రమత్తమైన యంత్రాంగం
Image Credit : PTI

బీహార్‌కు పొంచి ఉన్న ముప్పు: అప్రమత్తమైన యంత్రాంగం

నేపాల్‌లో ఉప్పొంగిన ప్రవాహం బీహార్‌లోని గండక్ నది వైపు రావడంతో అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. వాల్మీకినగర్ బ్యారేజీకి చెందిన మొత్తం 36 గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు విడుదల చేశారు. రాత్రి వేళ 1.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో ముంపు ప్రాంతాల నుంచి 4,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ చంపారన్, గోపాల్‌గంజ్, ముజఫర్‌పూర్ జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బలగాలను మోహరించారు. ప్రస్తుతం గండక్ నదిలో నీటి మట్టం కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఉపశమనం పొందారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రపంచం
వాతావరణం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods : నేపాల్‌ను ముంచెత్తిన వరదలు.. 105 మంది భారతీయులు గల్లంతు!
Recommended image2
Iran: ఇరాన్ ప్రాక్సీ నెట్‌వ‌ర్క్ కొత్త రూపం.. మునుపటి కంటే ఎందుకు ప్రమాదకరం?
Recommended image3
Donald Trump: మ‌రో కొత్త పంచాయ‌తీ మొద‌లు పెట్టిన ట్రంప్‌.. హార్మోజ్ మాదే అంటూ ప్ర‌క‌ట‌న
Related Stories
Recommended image1
Indias Shortest Train Journey: 7 నిమిషాల్లోనే ముగిసే రైలు ప్రయాణం ఇది !
Recommended image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved