MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • International
  • Nepal Floods : నేపాల్ వరదల్లో చిక్కుకున్న సద్గురు టీమ్.. ఈ హీరోయిన్ సంగతేంటి?

Nepal Floods : నేపాల్ వరదల్లో చిక్కుకున్న సద్గురు టీమ్.. ఈ హీరోయిన్ సంగతేంటి?

నేపాల్‌లో ఆకస్మిక వరదల కారణంగా మానస సరోవర యాత్రకు వెళ్లిన ఈశా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులు గల్లంతయ్యారు. అయితే ఇదే యాత్రలో ఉన్న నటి మానసి పరేఖ్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 27 2026, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటి మానసి పరేఖ్ సేఫ్
Image Credit : Gemini AI

నటి మానసి పరేఖ్ సేఫ్

నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 160కి చేరింది. గల్లంతైన వారి సంఖ్య 1000 దాటింది. నేపాల్-టిబెట్ సరిహద్దులో హిమపాతం కారణంగా కేవలం 30 నిమిషాల్లో నీటిమట్టం 9 మీటర్లు పెరిగింది… కోశీ నదిలో నీరు ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో ఈ నది చుట్టుపక్కల గ్రామాలు, నగరాలు, పట్టణాలు వరదల్లో కొట్టుకుపోయాయి.

అయితే ఈ వరదల్లో టిబెట్ సరిహద్దు మార్గంలో మానస సరోవర యాత్రకు వెళ్లిన చాలా మంది భారతీయులు గల్లంతయ్యారు. వీరిలో సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఈశా ఫౌండేషన్ ద్వారా యాత్రకు వెళ్లిన 77 మంది ఉన్నారు. అయితే ఇదే యాత్రలో ఉన్న నటి మానసి పరేఖ్ సురక్షితంగా బయటపడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చైనాకు చేరుకున్న నటి మాససి
Image Credit : Manasi safe

చైనాకు చేరుకున్న నటి మాససి

కైలాస మానస సరోవర యాత్రలో భాగంగా టిబెట్ సరిహద్దులోని గిరియాంగ్ ప్రాంతంగుండా వెళుతున్న ఈశా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది యాత్రికులు వరదల్లో గల్లంతయ్యారు. ఈశా ఫౌండేషన్ యాత్రికులు దశలవారీగా యాత్ర చేపట్టారు. గిరియాంగ్ ప్రాంతంలో వరదలు తీవ్రంగా ఉండటంతో చాలా మంది భారతీయులు గల్లంతయ్యారు. అయితే మానసి పరేఖ్ అప్పటికే గిరియాంగ్ ప్రాంతాన్ని దాటడంతో సురక్షితంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె చైనాలో సేఫ్‌గా ఉన్నారు.

Related Articles

Related image1
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Related image2
Now Playing
Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
35
వరదలపై మానసి పోస్ట్
Image Credit : Manasi safe

వరదలపై మానసి పోస్ట్

"నేపాల్ వరదలు హృదయ విదారకం. ఈ దుర్ఘటనలో చిక్కుకున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడి దయవల్ల మేము చైనాలో సురక్షితంగా ఉన్నాం. ఈశా ఫౌండేషన్ మమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. గల్లంతైన యాత్రికులను గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించండి" అని మానసి పరేఖ్ పోస్ట్ చేశారు.

45
సద్గురు కూడా చైనాలోనే
Image Credit : Manasi safe

సద్గురు కూడా చైనాలోనే

తాను సద్గురుతో పాటు చైనాలో ఉన్నట్లు మానసి పరేఖ్ తెలిపారు. "మేము చాలా మంది యాత్రికులం సద్గురుతో కలిసి చైనాలోని ఒక హోటల్‌లో ఉన్నాం. చైనా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాం. సద్గురు ఇక్కడి నుంచే తమ యాత్రికుల ఆచూకీ కోసం అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నారు. ఈశా ఫౌండేషన్ ద్వారా యాత్రకు వచ్చిన చాలా మంది గల్లంతైనట్లు తెలిసింది. వారిని సంప్రదించడం సాధ్యం కావడం లేదు. అందుకే అధికారుల ద్వారా వారిని గుర్తించాలని సద్గురు కోరారు" అని మానసి పరేఖ్ వివరించారు.
55
మానస సనోవర్ లో చిక్కుకున్న హైదరబాదీలు
Image Credit : ANI

మానస సనోవర్ లో చిక్కుకున్న హైదరబాదీలు

భారత్ నుంచి కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన వారిలో సుమారు 450 మందికి పైగా గల్లంతైనట్లు పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే నేపాల్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. చైనా కూడా నేపాల్‌లో సహాయక చర్యలు చేపట్టింది. భారత ప్రభుత్వం రెండు విమానాల్లో సహాయక సామగ్రిని పంపింది.

నేపాల్ వరదల్లో సామాన్య యాత్రికులే కాదు కొందరు ప్రముఖులు కూడా చిక్కుకున్నారు. మానస సరోవరం యాత్రకు హైదరాబాద్ నుండి వెళ్లిన 31 యాత్రికులు ఈ వరదల్లో చిక్కుకున్నారు... వీరంతా ప్రస్తుతం మానస సరోవరంలో క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టీమ్ లోనే DRDO మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
భారత దేశం
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Recommended image2
Nepal Floods : నేపాల్‌ను ముంచెత్తిన వరదలు.. 105 మంది భారతీయులు గల్లంతు!
Recommended image3
Iran: ఇరాన్ ప్రాక్సీ నెట్‌వ‌ర్క్ కొత్త రూపం.. మునుపటి కంటే ఎందుకు ప్రమాదకరం?
Related Stories
Recommended image1
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Recommended image2
Now Playing
Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved