MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • Cricket
  • Most Expensive Player: కోహ్లీ కాదు రోహిత్ కాదు.. ఒక్క పరుగుకు 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

Most Expensive Player: కోహ్లీ కాదు రోహిత్ కాదు.. ఒక్క పరుగుకు 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

Most Expensive Player ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సిరీస్‌లో ఒక ప్లేయర్ ఒక్కో పరుగుకు 3 లక్షల రూపాయలు తీసుకుని ఈ టోర్నీలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ కాదు.. రోహిత్ శర్మ కాదు.. మరి ఎవరా ప్లేయర్?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 28 2025, 07:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కోహ్లీ, రోహిత్ కాదు, రన్‌కి 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

కోహ్లీ, రోహిత్ కాదు, రన్‌కి 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

Most Expensive Player ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రాండ్‌గా జరుగుతోంది. ఇందులో పాల్గొన్న 8 జట్లలో గ్రూప్ Aలో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు సిరీస్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. అలాగే, గ్రూప్ బీ నుంచి ఇంగ్లాండ్ కూడా టోర్నీ నుంచి ఔట్ అయింది. ఇక ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని నిర్వహిస్తున్న పాకిస్తాన్ ఆడిన 2 మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. దాని మూడో మ్యాచ్ వర్షంతో రద్దు అయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కోహ్లీ, రోహిత్ కాదు, రన్‌కి 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

కోహ్లీ, రోహిత్ కాదు, రన్‌కి 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. అదే విధంగా గ్రూప్ Bలో ఉన్న ఇంగ్లండ్ 2 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి నిష్క్రమించింది. ఈరోజు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ముఖ్యమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది, ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి ఔట్ అవుతుంది.

36
కోహ్లీ, రోహిత్ కాదు, రన్‌కి 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

కోహ్లీ, రోహిత్ కాదు, రన్‌కి 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

ప్రపంచంలోని టాప్ క్రికెట్ ప్లేయర్స్ పాల్గొంటున్న ఈ సిరీస్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్ ఎవరో తెలుసా? విరాట్ కోహ్లీ కాదు.. రోహిత్ శర్మ కాదు..  పాకిస్తాన్‌కు చెందిన ఇమామ్ ఉల్ హక్. అవును మీరు చదివింది నిజమే.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు. గత నెల 23న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో  భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఒక్క మ్యాచ్ లోనే అతను ఆడాడు. 

46
కోహ్లీ, రోహిత్ కాదు, రన్‌కి 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

కోహ్లీ, రోహిత్ కాదు, రన్‌కి 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

ఈ మ్యాచ్‌కు ముందు గాయం కారణంగా తప్పుకున్న ఫకర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ పాకిస్తాన్ జట్టులోకి వచ్చాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 10 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇప్పుడు అతనే చాలా కాస్ట్లీ ప్లేయర్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 6 పరుగులకే అవుటైన ఇమామ్ ఉల్ హక్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక్కో పరుగుకు రూ.3 లక్షల చొప్పున రూ.30,00,000 జీతంగా ఇచ్చింది.

56
కోహ్లీ, రోహిత్ కాదు, రన్‌కి 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

కోహ్లీ, రోహిత్ కాదు, రన్‌కి 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

అలాగే, బాబర్ ఆజం 2 మ్యాచ్‌లు ఆడి 87 పరుగులు (64, 23) చేశాడు. ఇందులో అతను చేసిన ప్రతి పరుగుకు రూ.1 లక్షకు పైగానే సంపాదించాడు. అదేవిధంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 2 మ్యాచ్‌లు ఆడి 61 పరుగులు చేశాడు. దీని ద్వారా ఒక్కో పరుగుకు రూ. 19,672 చొప్పున అతనికి జీతం అందుతోంది. ఇది కాకుండా బీసీసీఐ ఒప్పందం ద్వారా వన్డే క్రికెట్ మ్యాచ్‌కు రోహిత్ శర్మకు రూ.6 లక్షలు జీతంగా అందుతోంది. 2 మ్యాచ్‌లు ఆడినందుకు రూ.12 లక్షలు అందుకున్నాడు.

66
కోహ్లీ, రోహిత్ కాదు, రన్‌కి 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

కోహ్లీ, రోహిత్ కాదు, రన్‌కి 3 లక్షలు తీసుకున్న క్రికెటర్ ఎవరంటే?

భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 2 మ్యాచ్‌లు ఆడి 122 పరుగులు చేశాడు. దీని ద్వారా ఒక్కో పరుగుకు రూ.9,806 కంటే ఎక్కువ సంపాదించాడు. బీసీసీఐ ఒప్పందం ద్వారా వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు జీతం పొందుతున్నాడు. 2 మ్యాచ్‌లు ఆడినందుకు జీతంగా రూ.12 లక్షలు అందుకున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved