రెండేళ్ల తర్వాత విండీస్ జట్టులోకి క్రిస్ గేల్.... 8 ఏళ్ల తర్వాత ఫిడేల్ ఎడ్వర్డ్స్ రీఎంట్రీ...
‘యూనివర్సల్ బాస్’ క్రిస్గేల్ రెండేళ్ల తర్వాత విండీస్ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 2019 వన్డే వరల్డ్కప్లో చివరిసారిగా విండీస్ తరుపున మ్యాచ్ ఆడాడు క్రిస్ గేల్. ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచుల్లో క్రిస్ గేల్కి అవకాశమే దక్కలేదు. వెస్టిండీస్ టీమ్లో చోటు దక్కకపోయినా ఐపీఎల్తో పాటు అనేక విదేశీ టోర్నీల్లో పాల్గొన్నాడు క్రిస్ గేల్...
ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్న క్రిస్ గేల్, భారీ ఇన్నింగ్స్లతో అదరగొడుతుండడంతో యూనివర్సల్ బాస్కి విండీస్ క్రికెట్ బోర్డు నుంచి పిలుపు అందింది.
అలాగే 8 ఏళ్ల క్రితం జట్టుకి దూరమైన 39 ఏళ్ల ఫిడేల్ ఎడ్వర్డ్స్ కూడా విండీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మార్చి 3 నుంచి 7 వరకూ జరిగే శ్రీలంకతో మూడు టీ20 మ్యాచులు ఆడనుంది విండీస్.
ఆ తర్వాత ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేలు, రెండు టెస్టులు కూడా జరుగుతాయి. టీ20, వన్డేలకు కిరన్ పోలార్డ్ కెప్టెన్గా వ్యవహారిస్తే, టెస్టులకు జాసన్ హోల్డర్ కెప్టెన్గా వ్యవహారిస్తాడు.
ఈ నెల ప్రారంభంలో కరోనా బారిన పడిన కారణంగా ఆల్రౌండర్ ఆండ్రూ రస్సెల్కి ఈ సిరీస్లో చోటు దక్కలేదు... కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ అతను తిరిగి జట్టులో చేరేందుకు అవసరమైన ప్రోటోకాల్స్ పూర్తి చేయాల్సి ఉంది...
ఇంగ్లాండ్తో, అంతకుముందు సౌతాఫ్రికా చేతుల్లో వరుసగా నాలుగు టెస్టులు ఓడిపోయిన శ్రీలంక జట్టు, విండీస్తో జరిగే సిరీస్లోనైనా కమ్బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది... మరోవైపు బంగ్లాదేశ్ను, బంగ్లాలో ఓడించిన విండీస్ విజయోత్సహాంతో ఉంది.
టీ20 జట్టు ఇది: కిరన్ పోలార్డ్, నికోలస్ పూరన్, ఫ్యాబియన్ ఆలెన్, డ్వేన్ బ్రావో, ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఆండ్రే ఫ్లెచర్, క్రిస్ గేల్, జాసన్ హోల్డర్, అకీల్ హుస్సేన్, ఎవిన్ లూయిస్, ఒబెడ్ మెక్కాయ్, రూవెన్ పావెల్, లెండిల్ సిమ్మన్స్, కెవిన్ సిన్క్లయిర్
వన్డే జట్టు: కిరన్ పోలార్డ్, షాయ్ హోప్, ఫ్యాబియన్ ఆలెన్, డారెన్ బ్రావో, జాసన్ హోల్డర్, ఆకీల్ హుస్సేన్, అల్జరీ జోసఫ్, ఎవిన్ లూయిస్, కేల్ మేయర్స్, జాసన్ మహ్మద్, నికోలస్ పూరన్, రొమానియా షీఫర్డ్, కెవిన్ సిన్క్లయిర్