MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • తిరుమ‌ల కాలిన‌డక మార్గంలో రోబో డాగ్.. ఇంత‌కీ దీని ఉప‌యోగం ఏంటంటే.?

తిరుమ‌ల కాలిన‌డక మార్గంలో రోబో డాగ్.. ఇంత‌కీ దీని ఉప‌యోగం ఏంటంటే.?

TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రోబో డాగ్‌ను తీసుకొచ్చారు. ఇంత‌కీ దీని ఉప‌యోగం ఏంటంటే?

3 Min read
Author : Narender Vaitla
Published : Aug 21 2026, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రమాదకర ప్రాంతాల్లోనూ సులభంగా కదలిక
Image Credit : Tirumala Tirupati Devasthanams/X

ప్రమాదకర ప్రాంతాల్లోనూ సులభంగా కదలిక

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలినడక మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాల‌నే ఉద్దేశంతో నాలుగు కాళ్లతో నడిచే క్వాడ్రుపెడ్ రోబోట్ డాగ్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. సాధారణ నిఘా కెమెరాలు, ఫుట్ పెట్రోలింగ్ ద్వారా చేరుకోవడం కష్టమైన ప్రాంతాల్లోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించే సామర్థ్యం ఈ రోబోట్‌కు ఉంది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద నిర్వహించిన ట్రయల్‌లో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు రోబో పనితీరును పరిశీలించారు.

తిరుమల కొండల్లోని కొన్ని అటవీ ప్రాంతాలు సాధారణ సిబ్బంది నిరంతరం పర్యటించేందుకు అనుకూలంగా ఉండవు. ఎత్తుపల్లాలు, రాళ్లు, మెట్లు, గుట్టలు, దట్టమైన వృక్ష సంపద ఉన్న ప్రాంతాల్లో మానవ నిఘాకు పరిమితులు ఉంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో రోబో డాగ్‌ను మోహరించడం ద్వారా మరింత విస్తృతంగా పర్యవేక్షణ చేపట్టే అవకాశం ఉంటుంది. నాలుగు కాళ్ల నిర్మాణం కారణంగా స‌మానంగా లేని నేలపైనా ఇది సమతుల్యతను కాపాడుకుంటూ ముందుకు కదలగలదు. అవసరాన్ని బట్టి వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దీనిని త్వరగా తరలించవచ్చు. దీంతో సిబ్బంది నేరుగా ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లాల్సిన అవసరం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కెమెరాలు, థర్మల్ సెన్సర్లతో నిఘా
Image Credit : Tirumala Tirupati Devasthanams/X

కెమెరాలు, థర్మల్ సెన్సర్లతో నిఘా

రోబో డాగ్‌లో సాధారణ కెమెరాలతో పాటు థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సర్లు అమర్చినట్లు అధికారులు తెలిపారు. వీటి సాయంతో పరిసరాలను వివిధ కోణాల్లో పరిశీలించవచ్చు. ముఖ్యంగా వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో థర్మల్ కెమెరా ద్వారా ఉష్ణోగ్రత ఆధారిత చిత్రాలను సేకరించే అవకాశం ఉంటుంది.

దట్టమైన పొగమంచు, చీకటి వంటి పరిస్థితుల్లోనూ పరిసరాల్లో కదులుతున్న జీవులను గుర్తించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. సేకరించిన సమాచారం ఆధారంగా అటవీ ప్రాంతంలో ఏ సమయంలో, ఏ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉంటున్నాయనే అంశంపై టీటీడీకి మరింత స్పష్టమైన సమాచారం లభించే అవకాశం ఉంది.

Related Articles

Related image1
భ‌విష్య‌త్తులో ఈ ప్రాంతం మ‌రో లింగంప‌ల్లి కావ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌కి 40 కి.మీల దూరంలో
Related image2
రెండు రోజులుగా ఒకే చోట పార్కింగ్ చేసిన కారులోంచి దుర్వాస‌న‌.. ఏంటా చూడ‌గా షాకింగ్ సీన్
35
ఏఐ ద్వారా జంతువుల గుర్తింపు.. వెంటనే అలర్ట్
Image Credit : Tirumala Tirupati Devasthanams/X

ఏఐ ద్వారా జంతువుల గుర్తింపు.. వెంటనే అలర్ట్

ఈ రోబోట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థను కూడా వినియోగించే అవకాశం ఉంది. దీని ద్వారా మనుషులు, వాహనాలు, పశువులు, పెద్ద జంతువులు వంటి విభిన్న కదలికలను గుర్తించి వేర్వేరు వర్గాలుగా గుర్తించే సామర్థ్యం ఉంటుంది. వన్యప్రాణి భక్తులు రాకపోకలు సాగించే మార్గం వైపు కదులుతున్నట్లు గుర్తించినప్పుడు సంబంధిత సిబ్బందికి సమాచారం చేరేలా వ్యవస్థను రూపొందించారు. జియో ట్యాగ్‌తో కూడిన అలర్ట్‌తో పాటు లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బందికి పంపే అవకాశం ఉంటుంది. దీంతో ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు సమయం లభిస్తుంది.

45
జంతువులను తాకకుండా వెనక్కి మళ్లించే అవకాశం
Image Credit : Tirumala Tirupati Devasthanams/X

జంతువులను తాకకుండా వెనక్కి మళ్లించే అవకాశం

రోబోట్ డాగ్‌లో సౌండ్, లైట్ యూనిట్లు కూడా ఉండనున్నాయి. వన్యప్రాణులు భక్తులు నడిచే మార్గాల వైపు వస్తే వాటిని నేరుగా ఎదుర్కోవడం కాకుండా శబ్దం, వెలుతురు ద్వారా తిరిగి అటవీ ప్రాంతం వైపు మళ్లించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే మనుషులు, వన్యప్రాణుల మధ్య నేరుగా ఎదురుపడే పరిస్థితులను తగ్గించవచ్చు. అదే సమయంలో భక్తులను అప్రమత్తం చేసి, అటవీ, విజిలెన్స్, భద్రతా సిబ్బంది వేగంగా స్పందించేలా చేయవచ్చు. అయితే రోబోట్‌ను ఇప్పటికే ఉన్న కెమెరా ట్రాప్‌లు, పెట్రోలింగ్, అటవీ సిబ్బంది నిఘాకు ప్రత్యామ్నాయంగా కాకుండా అదనపు మొబైల్ మానిటరింగ్ వ్యవస్థగా ఉపయోగించాలనే ఆలోచనలో టీటీడీ ఉంది.

TTD Explores Robotic Dog for Wildlife Monitoring & Devotee Safety

Equipped with AI, thermal & optical cameras, LiDAR and sensors, the robot can detect wildlife in darkness/fog, send geo-tagged alerts and stream live feeds to control rooms.#TTD#Tirumala#DevoteeSafetypic.twitter.com/RRPkQov3pB

— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) August 20, 2026

55
20 రోజుల ట్రయల్..
Image Credit : Tirumala Tirupati Devasthanams/X

20 రోజుల ట్రయల్..

ప్రస్తుతం ఒక రోబో డాగ్‌ను సుమారు 20 రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ సంస్థ ఈ రోబోట్‌ను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో రోబోట్ ధర సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉండొచ్చని తెలిపారు.

ట్రయల్ విజయవంతమై, అటవీ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు అందితే తదుపరి దశలో దీని వినియోగాన్ని విస్తరించే అవకాశం ఉంది. వచ్చే నెలలో నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను దృష్టిలో పెట్టుకుని రోబో డాగ్‌ను విస్తృతంగా ఉపయోగించే అంశాన్ని టీటీడీ పరిశీలిస్తోంది.

మొత్తంగా చూస్తే, రోబోట్ ద్వారా లభించే వీడియోలు, థర్మల్ చిత్రాలు, కదలికల సమాచారం భవిష్యత్తులో వన్యప్రాణుల సంచార తీరును అర్థం చేసుకోవడంలో ఉపయోగపడవచ్చు. ఏ ప్రాంతాల్లో ఎక్కువ నిఘా అవసరం, ఎప్పుడు పెట్రోలింగ్ పెంచాలి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు ఈ డేటా సహాయపడే అవకాశం ఉంది. సాంకేతికత ఆధారిత ఈ ప్రయోగం విజయవంతమైతే తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల పర్యవేక్షణతో పాటు భక్తుల భద్రతకు ఇది మరో కీలక సాధనంగా మారే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తిరుపతి
ఆంధ్ర ప్రదేశ్
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Crop insurance: రైతులకు గుడ్ న్యూస్.. పంటల బీమా గడువు పెంపు.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా?
Recommended image2
Dakshina Kailasam: గ్రహణ సమయంలోనూ మూయని ఏకైక గుడి.. ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా ఎందుకు వెళ్లాలి?
Recommended image3
Weather Update: పసిఫిక్ లో 2 తుపాన్లు.. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అలర్ట్
Related Stories
Recommended image1
భ‌విష్య‌త్తులో ఈ ప్రాంతం మ‌రో లింగంప‌ల్లి కావ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌కి 40 కి.మీల దూరంలో
Recommended image2
రెండు రోజులుగా ఒకే చోట పార్కింగ్ చేసిన కారులోంచి దుర్వాస‌న‌.. ఏంటా చూడ‌గా షాకింగ్ సీన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved