త్రిష పుట్టిన రోజు గిప్ట్.. ఫ్యాన్స్ కు షాక్!
ఈ రోజు స్టార్ హీరోయిన్ త్రిష తన 36 జన్మదినం జరుపుకుంటోంది.
ఈ రోజు స్టార్ హీరోయిన్ త్రిష తన 36 జన్మదినం జరుపుకుంటోంది. ఈ వయస్సులో కూడా ఎంతో చలాకీగా, ఉత్సాహంగా పూర్తి స్దాయి బిజీగా ఉండటం ఆమెకే సాధ్యం. ప్రస్తుతం తన తల్లి ఉషా కృష్ణన్తో కలిసి యూఎస్లో చక్కర్లు కొడుతున్న త్రిష తన అభిమానులకు పుట్టిన రోజు గిప్ట్ ని అందించింది. అయితే ఆ పుట్టిన రోజు గిప్ట్ అందుకున్న వారు ఆశ్చర్యపోయారు.అదేమంటే ఆమె తాజా చిత్రం ట్రైలర్.
అందులో ఆమె ఓ చిన్నారికు తల్లిగా కనిపించనుంది. పాపకు తల్లిగా కనపడటమనేది ఆమె ఫ్యాన్స్ కు షాకింగ్ విషయం అయితే అందులో ఆమె యాక్షన్ ఎపిసోడ్స్, ఫెరఫార్మెన్స్ అదిరిపోయాయని ఇనానమస్ గా వినపడుతోంది.
తమిళ డైరక్టర్ కె తిరుగననమ్ దర్శకత్వంలో ఆమె పరమపదం విలయట్టు అనే చిత్రం చేస్తుంది. ఈ చిత్రం త్రిషకి 60వ సినిమా. నంద, ఏఎల్ అజగప్పన్, వేల రామ్మూర్తి, రిచార్డ్, చామ్స్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. 24 అవర్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్పై ఈ చిత్రం నిర్మితమవుతుంది. అమ్రీష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు త్రిష పుట్టిన రోజు సందర్భంగా పరమపదం విలయట్టు ట్రైలర్ విడుదల చేశారు.
ఇందులో త్రిష మూగ, చెవిటి అయిన చిన్నారికి తల్లిగా కనిపించనుంది. తన కూతురు కిడ్నాప్కి గురి కావడంతో ఆమె రకరకాల సమస్యలని ఎలా ఎదుర్కొంది. ఎలా తన కుమార్తెని సేవ్ చేసుకుంది అనే విషయం చుట్టూ తిరుగుతుంది. పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో హై యాక్షన్ సీన్స్ అభిమానులని అలరిస్తాయని అంటున్నారు. మీరు ఈ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.
ప్రస్తుతం త్రిష చేతిలో అరడజనుకి పైగా ప్రాజెక్ట్లు ఉన్నాయి. వాటిలో ప్రముఖ తమళ దర్శకుడు మురుగదాస్ శిష్యుడు శరవణన్ దర్శకత్వంలో త్రిష ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ చిత్రానికి ‘రాంగి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.