'2.0'పై రజిని కూతురు ఒకే ఒక్క మాట!
దర్శకుడు శంకర్.. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం '2.0'. గురువారం రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దర్శకుడు శంకర్.. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం '2.0'. గురువారం రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పది వేల స్క్రీన్ లలో ఈ సినిమా విడుదలైంది. తొలిషోతోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం మొదలైంది.
శంకర్ అధ్బుతాల్లో ఇది ఎప్పటికీ నిలిచిపోతుందని, హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉందని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ట్వీట్లు చేస్తూ రజినీకాంత్, శంకర్ ల పట్ల తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు.
నాని లాంటి హీరోలు ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేకపోవడం బాధగా ఉందని ట్వీట్ లు చేస్తుండగా.. రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ ఈ సినిమా ఎలా ఉందనే విషయాన్ని ఒక్క మాటలో చెప్పేసింది.
''ఓ మై గాడ్.. 2.0 సినిమా ఇప్పటివరకు మనం ఈ ప్రపంచంలో చూడని ఓ అధ్బుతాన్ని ఆవిష్కరించింది'' అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
OH MY GOD !!!!!!!!!!!!! 2.0 IS OUT OF THIS WORLD !!!!!!!!! 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
— soundarya rajnikanth (@soundaryaarajni) November 28, 2018
ఇవి కూడా చదవండి..
ఆ రికార్డ్ రజినీకి మాత్రమే.. ఇండియాలో మరే హీరోకి లేదు!
శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!
'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!
'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?
'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!
2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!
2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?