పవన్ కళ్యాణ్- సుజిత్ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
`సాహో` ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేశారట.
పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. `హరిహరవీరమల్లు` చిత్రం షూటింగ్ జరుపుకుంటోందీ. దీంతోపాటు హరీష్ శంకర్తో `ఉస్తాద్ భగత్ సింగ్`, అలాగే సుజిత్తో ఓ సినిమా సముద్రఖనితో ఓ రీమేక్ చేయబోతున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్తో చేయాల్సిన `ఉస్తాద్ భగత్ సింగ్` ఓపెనింగ్ జరిగింది. గ్రాండ్గా గతేడాది చివర్లో నిర్వహించారు. కానీ రెగ్యూలర్ షూటింగ్కి మాత్రం టైమ్ పడుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాని ప్రారంభించబోతున్నారు పవన్. సుజిత్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించిన విసయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మించబోతున్న చిత్రమిది. దీన్ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కథతో తెరకెక్కిస్తున్నారట. కొరియన్ స్టయిల్లో ఉంటుందనే విడుదల చేసిన పోస్టర్ని బట్టి తెలిసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని కూడా ప్రారంభించబోతున్నారు. అందుకు ముహూర్తం ఫిక్స్ చేశారట. జనవరి 30న సోమవారం ఈ సినిమాని గ్రాండ్గా ప్రారంభించేందుకు నిర్ణయించారని తెలుస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మరి ఈ సినిమాకి సంబంధించిన రెంగ్యూలర్ షూటింగ్ ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ `హరిహరవీరమల్లు` చిత్రం షూటింగ్ పూర్తి కాలేదు. దీనికి ఇంకా రెండు మూడు నెలలు పట్టే ఛాన్స్ ఉందట. మరి హరీష్ శంకర్ సినిమా ఎప్పుడు చేస్తాడు, త్వరలో ప్రారంభం కాబోతున్న సుజిత్ సినిమా షూటింగ్ ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాతోపాటు సముద్రఖని దర్శకత్వంలో `వినోదయసీతం` చిత్ర రీమేక్లో నటించాల్సి ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అయితే మొదట ఈ సినిమానే పట్టాలెక్కుతుందని టాక్ వచ్చింది. కానీ పవన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇక ఇప్పుడు నటిస్తున్న `హరిహర వీరమల్లు` చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.