Asianet News TeluguAsianet News Telugu

అమ్మాయిలకు `వినో భాగ్యము విష్ణుకథ` టీమ్‌ బంపర్‌ ఆఫర్‌.. రీల్స్ చేస్తే `పుష్ప` షూటింగ్‌ ఛాన్స్..

`వినరో భాగ్యము విష్ణుకథ` సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్‌ "వాసవసుహాస"ఆకట్టుకుంది. ఇప్పుడు మరో సాంగ్‌ విడుదలైంది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.

kiran abbavaram vinaro bhagyamu vishnu katha second song out bumper offer to girls
Author
First Published Jan 19, 2023, 9:00 PM IST

కిరణ్‌ అబ్బవరం టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో మోస్ట్ ప్రామిసింగ్‌ హీరోగా నిలిచారు. డిఫరెంట్‌ స్క్రిప్టులు ఎంచుకుంటూ హీరోగా మెప్పిస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింట్‌ మూవీతో రాబోతున్నారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో రూపొందుతున్న `వినరో భాగ్యము విష్ణుకథ` చిత్రంలో నటిస్తున్నారు. మురళి కిషోర్‌ అబ్బురు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ అందరిని ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. 

మరోవైపు `ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్‌ "వాసవసుహాస" మరింతగా ఆకట్టుకుంది. ట్యూట్‌, లిరిక్స్ హంట్‌ చేస్తున్నాయి. గుళ్లల్లో ఈ పాట మారుమోగుతుంది. ఫంక్షన్లలోనూ తొలి ప్రయారిటీగా నిలుస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతిదీ సమ్‌ థింగ్‌ స్పెషల్‌గా,హృదయాలను ఆకట్టుకునేలా ఉండటం విశేషం. తాజాగా ఈ సినిమాలోని రెండో పాట విడుదలైంది. `ఓ బంగారం` అంటూ సాగే పాటని గురువారం విడుదల చేశారు. 

 సెకండ్  సింగిల్ ను రిలీజ్ చేయడంలో భాగంగా ఈ చిత్ర బృందం Vvit గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్ తో  మ్యాచ్ నిర్వహించింది. ఆ మ్యాచ్ లో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ప్లేయర్ తో "ఓ బంగారం" అనే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసింది. ఈ మ్యాచ్ లో  Vvit గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్ 123 కొట్టింది. దానిలో K.సైదులు అనే ప్లేయర్ హాఫ్ సెంచరీ చేయడంతో తనని మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా ప్రకటించి అతనిచే "బంగారం" సాంగ్ ను రిలీజ్ చేయించింది యూనిట్‌.

ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, అందరికి నచ్చే చిత్రమిది. మా ప్రొడ్యూసర్ వాసు ఈ సినిమాను మీకు దగ్గర చెయ్యాలని చెప్పి నెల ముందు నుంచి ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. భాస్కరభట్ల నాకు మంచి లిరిక్స్ ఇచ్చారు. అబ్బాయిలకు క్రికెట్‌ మ్యాచ్‌ పెట్టాం. మరి అమ్మాయిలకు అంటే.. దీనికి బన్నీవాసు స్పందించి ఈ సాంగ్ ను రీల్ గా చేసి గీతా ఆర్ట్స్ ను ట్యాగ్ చేస్తే, సెలెక్ట్ అయినా 10 మందికి వాళ్ళ ఫ్యామిలీ కి ఈ సినిమాను చూపించి. వాళ్ళను `పుష్ప` షూటింగ్ కి కూడా తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు. 

అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు  నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం  హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కిరణ్ సరసన  క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios