Asianet News TeluguAsianet News Telugu

'మైత్రి మూవీ మేక‌ర్స్' నుంచి కాస్టింగ్ కాల్

తెలుగులో వరసగా శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్దలం వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్. న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ ముగ్గురు క‌లిసి నడుపుతున్న ఈ  మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌ విలక్షణమైన చిత్రాలకు మారు పేరుగా మారింది.

Casting Call from Mythri Movie Makers!
Author
Hyderabad, First Published May 4, 2019, 4:14 PM IST

తెలుగులో వరసగా శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్దలం వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్. న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ ముగ్గురు క‌లిసి నడుపుతున్న ఈ  మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌ విలక్షణమైన చిత్రాలకు మారు పేరుగా మారింది. రీసెంట్ గా చిత్రలహరి చిత్రంతో మెగా మేనల్లుడుకు హిట్ ఇచ్చిన బ్యానర్  తమ బ్యానర్ లో నిర్మించబోయే చిత్రానికి కాస్టింగ్ కాల్ ఇచ్చారు.

9 నుండి 11 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న అమ్మాయిలు తమ సినిమాలో నటించటానికి కావాలని ఈ కాస్టింగ్ కాల్ సారాంసం. ఉత్సాహం ఉన్నవారు మేక‌ప్ లేకుండా త‌మ పిల్లల ఫోటోల‌ని వాట్సాప్ చేయాల‌ని కోరింది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం. సినిమాలో న‌టించాల‌నే ఆస‌క్తి ఉన్న బాలిక‌లు వెంట‌నే త‌మ ఫోటోల‌ని పంపితే ఆ అవకాసం మీకే దక్కచ్చు.

ఇక ఇప్పుడు ఈ బేన‌ర్‌లో డియ‌ర్ కామ్రేడ్, గ్యాంగ్ లీడ‌ర్, వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ చిత్రం,అల్లు అర్జున్ 20వ చిత్రం రూపొందుతున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios