చిరు, వినాయిక్ కాంబినేషన్ షురూ, ఆ రీమేక్ ?
ఓటీటీ లతో అన్ని సినిమాలను ఒరిజినల్ వర్షన్స్లోనే ప్రేక్షకులు సినిమాలను చూసేస్తున్నారు. అందుకే.. స్టార్ హీరోలందరూ ఒరిజినల్ కథలతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ను మరోసారి దున్నేస్తున్నారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇదే ఊపులో చిరు.. మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పిన్నట్లు సమాచారం. చిరంజీవితో గతంలో ఠాగూర్ వంటి సూపర్ హిట్ ని ఆ తర్వాత ఖైదీ నెంబర్ 786 వంటి మరో బ్లాక్ బస్టర్ ఇచ్చిన వివి వినాయిక్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ఈ సినిమా ఓ తమిళ రీమేక్ అని తెలుస్తోంది.
తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న వార్తల ప్రకారం చిరంజీవి.. తమిళ బ్లాక్ బస్టర్ 'విశ్వాసం' సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారట. 2019లో విడుదలైన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యాక్ట్ చేశారు. అయితే ఈ విశ్వాసం సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. టీవీలలో కూడా చాలాసార్లు ప్రసారం అయ్యింది. ఆల్రెడీ తెలుగు ఆడియెన్స్ చూసేసిన సినిమా కాబట్టి.. కచ్ఛితంగా ఈ రీమేక్పై ఆసక్తి అంతగా ఏర్పడకపోవచ్చుని చెప్తున్నారు. ఇప్పటి ప్రేక్షకులు రీమేక్ సినిమాలను ప్రేక్షకులు ఏమాత్రం ప్రోత్సాహించడం లేదు. ఓటీటీ లతో అన్ని సినిమాలను ఒరిజినల్ వర్షన్స్లోనే ప్రేక్షకులు సినిమాలను చూసేస్తున్నారు. అందుకే.. స్టార్ హీరోలందరూ ఒరిజినల్ కథలతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.
దాంతో సోషల్ మీడియాలో మెగాభిమానులు.. చిరుని ఈ సినిమా చేయొద్దని రిక్వెస్టులు చేస్తున్నారు. ఈ రీమేక్ బదులు వాల్తేరు వీరయ్య తరహాలోనే ఫ్రెష్ కథలతో సినిమాలు చేయాల్సిందిగా కోరుతున్నారు. మరోవైపు చిరంజీవి చేస్తున్న 'భోళా శంకర్' కూడా అజిత్ 'వేదాళం' తెలుగు రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ మెగా సినిమాలో చిరు సోదరిగా కీర్తి సురేశ్ కనిపించనుంది.