ప్రస్తుత ఆధునిక యుగంలో సెల్ఫీ అనేది ఒక ట్రెండ్. ఈ సెల్ఫీ ప్రస్తుతం అందరికీ ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ఒక్క క్లిక్కుమనిపించి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరికి ఓ అలవాటుగా మారిపోయింది. సెల్ఫీ కోసం ఎక్కడ లేని స్టంట్లు చేసి ప్రాణాలు మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
త్రి సభ్యధర్మాసనం వెలువరించిన తీర్పు చాలా సంతోషాన్ని కలిగించిందని ఆమె అభిప్రాయపడింది. నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష వేస్తారన్న నమ్మకం తనకు కలుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
నిర్భయ రేప్, హత్య కేసు నిందితుల్లో ఒకరైన అక్షయ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఉరిశిక్షపై పునరాలోచించాలంటూ అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది.
నిర్భయ కేసులో ఎలాంటి కొత్త విషయం లేదని ధర్మాసనానికి విన్నవించారు. అమానవీయ కరమైన ఇలాంటి కేసుల్లో దోషులపై కనికరం చూపించకూడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా వాదించారు. ఈ కేసును సాగతీసేందుకు నిందితుల తరపు న్యాయవాది ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.
రాజధాని మార్చే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని తానే రెండు నెలల క్రితం చెప్పినట్లు గుర్తు చేశారు జీవీఎల్ నరసింహారావు. ప్రాంతాల వారీగా అభివృద్ధి జరగాలన్నది తమ అభిమతమని చెప్పుకొచ్చారు. అంతేగానీ ఆర్థిక, రాజకీయ కోణంలో నిర్ణయాలు ఉండకూడదన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కాకపోతే వేరే చోట ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలే కానీ 3 రాజధానులు అంటూ ప్రజలను గందరగోళానికి గురి చేయోద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు అవసరమా అంటూ ప్రశ్నించారు.
సింగపూర్ను ఆదర్శంగా తీసుకుని రాజధానిని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. బాబుపై కోపంతో రాజధానిని మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు.
భారీగా ఆస్తుల కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటి వరకు సిద్ధిపేటలో భారీగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే రూ.30కోట్ల అక్రమ ఆస్తులను సైతం ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
సీఎం జగన్ ప్రకటనపై తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడులు వ్యతిరేకిస్తుంటే ఆ పార్టీలోని సీనియర్ నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు.
జగన్ నిర్ణయాలు గానీ ప్రకటనలు గానీ చూస్తుంటే ఆయన అనుభవరాహిత్యం, ఆత్రుత కనిపిస్తోందన్నారు. జగన్ నిర్ణయాలు రాష్ట్రానికి చేటు తెచ్చేలా కనిపిస్తున్నాయంటూ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.