IPL 2025 SRH vs GT: గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కు రషీద్ ఖాన్ దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. అద్భుతమైన క్యాచ్ ను పట్టి జీటీకి హెడ్ తలనొప్పిని దూరం చేశాడు. రషీద్ ఖాన్ పరుగెత్తుకుంటూ బౌండరీలైన్ వద్ద పట్టిన ఈ మ్యాచ్ ఐపీఎల్ 2025 లో బెస్ట్ క్యాచ్ అని చెప్పవచ్చు.
- Home
- Andhra Pradesh
- Telugu news live updates: Rashid Khan: ట్రావిస్ హెడ్ కు దిమ్మదిరిగిపోయింది.. ఐపీఎల్ బెస్ట్ క్యాచ్.. రషీద్ ఖాన్ అదరగొట్టాడు భయ్యా
Telugu news live updates: Rashid Khan: ట్రావిస్ హెడ్ కు దిమ్మదిరిగిపోయింది.. ఐపీఎల్ బెస్ట్ క్యాచ్.. రషీద్ ఖాన్ అదరగొట్టాడు భయ్యా
నేడు (శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్నారు. అమరావతి పున:నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని ముఖ్య అతిథిగా వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మోదీ గన్నవారం చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ లో అమరావతికి వస్తారు. పలు కీలక పనుల ప్రారంభానికి ప్రధాని శంకుస్థానపన చేయనున్నారు. ఇక ఈ రోజు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Rashid Khan: ట్రావిస్ హెడ్ కు దిమ్మదిరిగిపోయింది.. ఐపీఎల్ బెస్ట్ క్యాచ్.. రషీద్ ఖాన్ అదరగొట్టాడు భయ్యా
IPL 2025 SRH vs GT: గుజరాత్ టైటాన్స్ సూపర్ విక్టరీ... ప్లేఆఫ్స్ నుంచి హైదరాబాద్ టీమ్ అవుట్
IPL 2025 SRH vs GT: ఐపీఎల్ 2025లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను గుజరాత్ టైటాన్స్ చిత్తుగా ఓడించింది. ఈ విక్టరీతో గిల్ టీమ్ గుజరాత్ ప్లేఆఫ్స్ కు చేరువైంది. హైదరాబాబ్ టీమ్ అవుట్ అయింది.
MumbaiIndians: ముంబై ఇండియన్స్ క్రికెటర్పై అత్యాచార కేసు
MumbaiIndians: ముంబై ఇండియన్స్ జట్టు మాజీ ఆటగాడు శివాలిక్ శర్మపై జోధ్పూర్లో అత్యాచార కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిసినట్టు బాధితురాలు ఆరోపించింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
పూర్తి కథనం చదవండిJD Vance: ఉగ్రవాదంపై పోరుకు పాకిస్తాన్ భారత్ తో కలిసి రావాలి : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
JD Vance urges Pakistan join India to fight terrorism: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ సంయమనం పాటించాలనీ, దాడి చేసిన వారిని పట్టుకోవడంలో పాకిస్తాన్ సహకరించాలని, విస్తృత ప్రాంతీయ సంఘర్షణను నివారించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కోరారు.
పూర్తి కథనం చదవండిShubman Gill: గిల్ ఔటా? నాటౌటా?.. ఏం జరిగిందంటే?
Gujarat Titans captain Shubman Gill: ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో శుభ్ మన్ గిల్ 76 పరుగుల సూపర్ నాక్ ఆడాడు. కానీ వివాదాస్పద రన్ అవుట్తో వెనుదిరిగాడు. గిల్ సూపర్ షో మధ్య అతని రనౌట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గిల్ అవుట్ అయ్యాడా? కాలేదా? అసలు ఏం జరిగింది?
వయసు 49 ఏళ్ళు.. అయినా బద్రి హీరోయిన్ ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా ?
తన మొదటి చిత్రం 'కహో నా ప్యార్ హై' ద్వారా రాత్రికి రాత్రే స్టార్గా మారిన నటి అమీషా పటేల్, ఇటీవలి కాలంలో తన గ్లామర్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
పూర్తి కథనం చదవండిPawan Kalyan: అమరావతి రీలాంచ్ లో ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్.. ఫోటోలు చూశారా
Pawan Kalyan with Narendra Modi at Amaravati relaunch: అమరావతి రీలాంచ్ సభ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ స్పీచ్ లతో అదరగొట్టారు. పవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభలో పవన్ కళ్యాణ్ ఫోటోలు మీకోసం.
PM Modi: చంద్రబాబును చూసి నేర్చుకున్నానన్న ప్రధాని మోడీ.. ఏంటది?
Amaravati: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. తాను, చంద్రబాబు, పవన్ ఆంధ్రరాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ క్రమంలోనే తాను చంద్రబాబును చూసి నేర్చుకున్నానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాబును చూసి ప్రధాని మోడీ ఏం నేర్చుకున్నారు?
హీరోయిన్ మేఘన రాజ్ రెండో పెళ్లి రూమర్స్, ఎలా క్లారిటీ ఇచ్చిందో తెలుసా
తన భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడిచిన తర్వాత, రెండో వివాహం గురించి వస్తున్న వదంతులపై మేఘనా రాజ్ స్పష్టతనిచ్చారు.
పూర్తి కథనం చదవండిPakistan fears war with India: 2 నెలలకి సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి.. యుద్ధ భయంలో పాకిస్తాన్ !
Pakistan fears war with India: పహల్గాంలో జరిగిన దాడి తర్వాత ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ లో యుద్ధ భయం మొదలైంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పాకిస్తాన్ ప్రజలకు సూచించింది.
పూర్తి కథనం చదవండిఒకేసారి రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు, ఫ్యాన్స్ తో కలసి పార్టీ చేసుకున్న సూపర్ స్టార్
ఒక నెల వ్యవధిలో థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లు సాధించిన రెండు చిత్రాలలో మోహన్ లాల్ నటించారు.
పూర్తి కథనం చదవండిస్టార్ హీరో మూవీ సెట్ లో కట్టుదిట్టమైన భద్రత..ఏం చేస్తున్నారో తెలుసా
సుదీప్ నటిస్తున్న ‘బిల్లా రంగ బాష’ సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో దర్శకుడు అనూప్ భండారి ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు.
పూర్తి కథనం చదవండిPM Modi's surprise gift to Pawan Kalyan: పవన్ కు ప్రధాని మోడీ సర్ప్రైజ్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?
Amaravati: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ సభలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ వేదికపైకి వచ్చిన సమయంలో రైతులు అందించిన అనూహ్య స్వాగతం సభా వాతావరణాన్ని ఉద్విగ్నంగా మార్చింది. అలాగే, ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.
PM Modi: నాకు నమ్మకం ఉంది, మూడేళ్లలో అమరావతి సాకారమవుతుంది: మోదీ
అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభంతోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ తన స్పీచ్తో అందరినీ ఆకట్టుకున్నారు. మధ్య మధ్యలో తెలుగులో మాట్లాడారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని ఒక శక్తి అని అభివర్ణించారు. చంద్రబాబు మీద తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
ఏసీ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్కార్ట్లో 50 % వరకు డిస్కౌంట్ ఆఫర్స్
Flip Cart Discount Sale: ఇది వేసవి కాలమా? వర్షాకాలమా? అర్థం కాకుండా ఉంది. ఏసీతో పనేముందిలే ఈ సమ్మర్ ఎలాగోలా అయిపోతుందిలే అనుకోవడానికి వీల్లేకుండా ఉంది. ఒకరోజు విపరీతంగా ఎండ కాస్తే, మర్నాడే భారీగా వర్షం పడుతోంది. అందువల్ల ఏసీ తప్పనిసరిగా కొనుక్కోవాలి. ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న 50 శాతం డిస్కౌంట్ ఆఫర్స్ ఉపయోగించుకుంటే మీరు రూ.30 వేల లోపే మంచి ఏసీ కొనుక్కోవచ్చు. ఏ కంపెనీలు ఈ ఆఫర్లు అందిస్తున్నాయో తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండిPM Modi: ఇది మనం చేయాలి, మనమే చేయాలి.. మోదీ పవర్ ఫుల్ స్పీచ్
అమరావతి పునఃనిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి గురించి వివరించారు. అమరావతి ఒక నగరం కాదని ఇది ఒక శక్తి అని మోదీ చెప్పుకొచ్చారు. మోదీ ఇంకా ఏమన్నారంటే..
సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుందా? రూ.56,100 జీతం వచ్చే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది
Indian Army: సైన్యంలో చేరి దేశం కోసం పోరాడాలని ఉందా? ఇండియన్ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగం మీకు వస్తే మీ కెరీర్ మంచి జీతంతో ప్రారంభమవుతుంది. ఇండియన్ ఆర్మీ నుంచి విడుదలైన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండిChandrababu Naidu: మూడేళ్లలో అమరావతిని కట్టేస్తాం.. మళ్లీ మోదీనే ప్రారంభిస్తారు
అమరావతి పునఃనిర్మాణ పనుల శ్రీకార కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన విషయాలను ప్రస్తావించారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా అమరావతనిని నిర్మిస్తామని తెలిపారు. మూడేళ్లలోనే అమరావతిని నిర్మించి, మళ్లీ మోదీని ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
నిరుద్యోగులకు శుభవార్త! బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఎలా అప్లై చేయాలంటే..
Bank of Baroda: బ్యాంకులో జాబ్ సంపాదించడం మీ లక్ష్యమా? అయితే ఇది మీకు కచ్చితంగా శుభవార్తే. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? అర్హతలేంటి? ఎలా అప్లై చేయాలి? ఇలాంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండిPawan Kalyan: అమరావతి రైతులు ధర్మ యుద్ధంలో గెలిచారు: పవన్ కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన అమరావతి పునఃనిర్మాణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు పవన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రైతులు ధర్మ యుద్ధంలో గెలిచారన్నారు. పవన్ ఇంకా ఏం మాట్లాడరంటే..